Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

మనిషి మరణించే వరకు జీవించడం

మనిషి మరణించే వరకు జీవించడం

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

ఇహ పర లోకాలలో సౌఖ్యం సమకూర్చుకోవడాన్ని అభ్యుదయం అంటారు. శాశ్వతానందమయ స్థితి, జన్మరాహిత్య స్థితి అయిన మోక్షాన్ని ప్రాప్తింప చేసుకోవడాన్ని శ్రేయస్సు అంటారు. ఒక కాలానికి, ఒక ప్రాంతానికి చెందిన ఒక మనిషి యొక్క అభ్యుదయాన్ని శ్రేయస్సునూ కోరుకుంటూ తగిన మార్గాలను బోధించే వాడు గురువు అవుతాడు. అయితే సర్వ దేశాలకూ, సర్వ కాలాలకూ, సర్వ జాతులకూ వర్తించే విధం గా – జగత్తులోని ప్రతి మానవుణ్ణి ఉద్దేశించి అభ్యుదయ నిశ్రేయస మార్గాలను రెండింటినీ, మహోదాత్తమైన పధ్ధతి లో, విశ్వజనీనమైన భగవద్గీతా రూపం లో ఉపదేశించడం ద్వారా శ్రీ కృష్ణుడు జగద్గురువయ్యాడు… ఆ జ్ఞానాన్ని యథార్థం గా విశ్లేషణాత్మకం గా, మహోదాత్తం గా జన బాహుళ్యానికి అందించడం ద్వారా వేద వ్యాసుడు, ఆది శంకరాచార్య జగద్గురువులయ్యారు.’ అన్నారు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త బ్రహ్మశ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ నిర్వహణలో శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య భక్త సమాజం, వేదాంత భారతి, ఋషి పీఠం, తత్వం చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యం లో హైదరాబాద్ లో జరుగుతున్న శ్రీ శంకర జయంతి ఉత్సవాలలో శ్రీ గంగాధర శాస్త్రి పాల్గొని ప్రసంగించారు. భారతదేశం లోని యోగులందరూ కలిసి ప్రజలలో తీసుకువచ్చిన ఆధ్యాత్మిక చైతన్యం ఒక ఎత్తైతే , ఆది శంకరులు ఒక్కరే తీసుకు వచ్చిన చైతన్యం అనన్య సామాన్యమనీ గంగాధర శాస్త్రి అన్నారు. ఎంత కాలం జీవించినా మరెవరూ చేయలేనంత ఆధ్యాత్మిక సేవ 32 సంవత్సరాల వయసులోపే అఖండ భారతాన్ని పర్యటించి, నాలుగు పీఠాలను స్థాపించి, హిందూ మతాల మధ్య సయోధ్యను నెలకొల్పి, అనేక రచనలు చేసి ముఖ్యం గా ప్రస్థాన త్రయానికి ( బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ) భాష్యాలు రచించి, హిందూ మతానికి దిశానిర్దేశం చేసిన అవతార పురుషుడు శ్రీ శంకరాచార్య – అన్నారు. ముఖ్యం గా లక్ష శ్లోకాల మహాభారత ఇతిహాసం లో – భీష్మ పర్వం లోని 25 వ అధ్యాయం నుండి 42 వ అధ్యాయం వరకూ ఉన్న భగవద్గీతకు అత్యద్భుతమైన భాష్యం అందించి హైన్దవ జాతిని జాగృతం చేసిన మొదటి వాడు జగద్గురువు ఆది శంకరాచార్య అన్నారు. శ్రీ శంకరాచార్య ‘నారాయణః పరోవ్యక్తాత్’ అంటూ నారాయణ స్మరణం తో భగవద్గీత కు భాష్యం ప్రారంభించారని, శివకేశవులకు అభేదమని ప్రవచించారని, విష్ణు రూపాలైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు శివుడిని పూజించిన వారేనని, అజ్ఞానం తో వారిద్దరూ వేరు అని మనం భావిస్తున్నామని గంగాధర శాస్త్రి అన్నారు. ‘సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।’ అంటూ -శివ నామం లేకుండా విష్ణు సహస్రనామం, విభూతి యోగం లో ‘రుద్రాణాం శంకర శ్చాస్మి’ అంటూ శంకర నామం లేకుండా భగవద్గీత పూర్తి కాదని పేర్కొన్నారు. భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయానికి శంకరులు చేసిన కృషి మరెవ్వరూ చేయలేదని అన్నారు. ముఖ్యం గా అద్వైతామృతవర్షిణి గా బోధించబడిన భగవద్గీతకు శ్రీ శంకరాచార్య వ్రాసిన భాష్యం అత్యంత ప్రామాణికమని గంగాధర శాస్త్రి అన్నారు. మతాలకు అతీతమైన, ఉత్తమ జీవన విధాన గ్రంథమైన భగవద్గీతను బాల్యదశ నుంచే నేర్పించే ప్రయత్నం తల్లులు చేయాలని పిలుపునిచ్చారు. అటుపై రాష్ట్ర ప్రభుత్వాలు గీతను పాఠ్యాంశo గా ప్రవేశ పెట్టాలని, కేంద్ర ప్రభుత్వం భగవద్గీతను జాతీయ గ్రంధం గా ప్రకటించాలని కోరారు. శ్రీ శంకరుల బోధనలను అర్ధం చేసుకుని వాటిని కొంతవరకైనా ఆచరించగలిగితే – అదే ఆ మహాత్మునికి ఘనమైన నివాళి అవుతుందని గంగాధరశాస్త్రి అన్నారు.

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ

Leave a Reply