Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

‘విశ్వశాంతి’ ని, శ్రేయస్సునూ కాంక్షిస్తూ – భగవద్గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేస్తున్న ఆస్ట్రేలియా-భగవద్గీతా ప్రచార యాత్ర లో భాగం గా ముగింపు కార్యక్రమాన్ని – మెల్బోర్న్ లోని TAAI (ఆస్ట్రేలియా తెలుగు సంఘం) సంస్థ అత్యంత వైభవం గా, ప్రేక్షకులు చిరకాలం గుర్తుంచుకునే విధం గా ( 6.4.2024-మౌంట్ వేవర్లీ కమ్మ్యూనిటీ సెంటర్ )నిర్వహించింది.

‘విశ్వశాంతి’ ని, శ్రేయస్సునూ కాంక్షిస్తూ – భగవద్గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేస్తున్న ఆస్ట్రేలియా-భగవద్గీతా ప్రచార యాత్ర లో భాగం గా ముగింపు కార్యక్రమాన్ని – మెల్బోర్న్ లోని TAAI (ఆస్ట్రేలియా తెలుగు సంఘం) సంస్థ అత్యంత వైభవం గా, ప్రేక్షకులు చిరకాలం గుర్తుంచుకునే విధం గా ( 6.4.2024-మౌంట్ వేవర్లీ కమ్మ్యూనిటీ సెంటర్ )నిర్వహించింది.

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

‘విశ్వశాంతి’ ని, శ్రేయస్సునూ కాంక్షిస్తూ – భగవద్గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేస్తున్న ఆస్ట్రేలియా-భగవద్గీతా ప్రచార యాత్ర లో భాగం గా ముగింపు కార్యక్రమాన్ని – మెల్బోర్న్ లోని TAAI (ఆస్ట్రేలియా తెలుగు సంఘం) సంస్థ అత్యంత వైభవం గా, ప్రేక్షకులు చిరకాలం గుర్తుంచుకునే విధం గా ( 6.4.2024-మౌంట్ వేవర్లీ కమ్మ్యూనిటీ సెంటర్ )నిర్వహించింది. సంస్థ అధ్యక్షులు శ్రీ చక్రి చయనం, ఉపాధ్యక్షులు శ్రీమతి కృష్ణ బేతనభట్ల, కోశాధికారి శ్రీ హేమంత్, సహ కార్యదర్శి శ్రీ హరి దేవరకొండ, శ్రీ రామ్ వెలవర్తిపాటి తదితర సభ్యులు శ్రీ గంగాధర శాస్త్రి ని పూర్ణకుంభo తో స్వాగతించారు. అనంతరం సాగిన శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం లో – భగవద్గీతను మతగ్రంథం గా కాక మానవీయ గ్రంథం గా చూడాలన్నారు. ‘ఇది ఉత్తమ జీవన విధాన మార్గం. ఉన్నతమైన వ్యక్తిత్వవికాస గ్రంథం. దీనిని వైరాగ్య గ్రంథం లాగా చూసేవారు ఇప్పటికీ ఉన్నారు. అదే నిజమైతే కృష్ణ పరమాత్మ చేసినబోధ విని అర్జునుడు యుద్ధం చేసి విజయం సాధించేవాడు కాద’ని అన్నారు గంగాధర శాస్త్రి. అర్జునునికి స్ఫూర్తినిచ్చి విజయపథం వైపు నడిపించిన కృష్ణుని బోధ మనల్ని నడిపించదా అని ప్రశ్నించారు. ‘న మే ద్వేష్యో స్తి న ప్రియః’ అంటూ తనకు ప్రియుడు కానీ అప్రియుడు కానీ ఎవ్వరూ లేరని, ఎవరు ధర్మవర్తనులవుతారో వారితో ఉంటానని కృష్ణ పరమాత్మ చెబుతాడని గంగాధర శాస్త్రి అన్నారు. ప్రతి ఒక్కరూ గీత చదివి పిల్లలచేత కూడా చదివించాలని అన్నారు. కృష్ణుడు అర్జునునికి నిర్బంధించినట్టు గా గీత చెప్పలేదని – ‘యథేచ్ఛసి తథా కురు’ అంటూ -‘బాగా ఆలోచించుకుని నీకు ఎలా ఇష్టమైతే ఆలా ఆచరించు’ అంటూ స్వేచ్ఛ నిస్తూ చెప్పాడని గంగాధర శాస్త్రి అన్నారు. వ్యక్తిత్వ వికాసానికి గీత కు మించిన గ్రంథం లేదని, ఇంటింటా గీతా జ్యోతులు వెలగాలన్నది తమ భగవద్గీతా ఫౌండేషన్ అభిలాష అనీ అన్నారు. మతాలు ఆవిర్భవించని కాలం లో బోధించిన గీతను మత గ్రంథ మని, అది బోధించిన భగవానుడైన శ్రీకృష్ణుని హిందూ మతస్థుడని అనడం అర్థరహితమని అన్నారు. గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే నన్నారు. పాశ్చాత్యులు సైతం ప్రశంసించిన గీతను హిందువులే నిర్లక్ష్యం చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. కార్యక్రమం చివరన గంగాధర శాస్త్రి అందరి చేతా కృష్ణ భజన చేయించారు. ప్రపంచం లోని వివిధ భాషల్లోకి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీతను రికార్డు చేసి విడుదల చేసేందుకు చేయూతను కోరారు. మెల్బోర్న్ లో తన గీతా ప్రవచనాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన శ్రీ చక్రి చయనం, ఇతర సభ్యులను హృదయపూర్వక కృతజ్ఞతలతో అభినందించారు. శ్రీమతి లక్ష్మి ఆధ్వర్యం లో చిన్నారులు భగవద్గీత లోని రెండవ అధ్యాయం శ్లోకాలను పఠించగా వారి ఉచ్చారణను శ్రీ గంగాధర శాస్త్రి అభినందించారు. ఈ సందర్భం గా ‘తత్వం యోగశాల’ వారి చిహ్నాన్ని గంగాధర శాస్త్రి ఆవిష్కరించారు. శ్రీ రామ్ వేల్ తమ ‘అసెట్ పాయింట్స్’ సంస్థ తరఫున శ్రీ గంగాధర శాస్త్రి ని సత్కరించారు. ఆస్ట్రేలియా తెలుగు సంఘం మరియు ‘దేవా’ సంస్థ సంయుక్తం గా శ్రీ గంగాధర శాస్త్రిని ‘గీతా గాన ప్రవచన కౌస్తుభ’ బిరుదు తో ఘనం గా సత్కరించారు. కార్యక్రమ ప్రారంభం లో శ్రీమతి హర్షవర్ధని పాడిన ప్రార్ధన గీతాన్ని, అటుపై ‘ముద్దుగారే యశోద’ కీర్తనను అభినయించిన శ్రీమతి రూపా ప్రవీణ్, చిII రేయా లను గంగాధర శాస్త్రి అభినందించారు. ఆస్ట్రేలియా భగవద్గీత ప్రచార యాత్ర ను అత్యంత సమర్ధవంతం గా నిర్వహించిన శ్రీ పవన్ వఝలను శ్రీ గంగాధర శాస్త్రి కృతజ్ఞతలు చెబుతూ సత్కరించారు.

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *