Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

‘విశ్వశాంతి’ ని కాంక్షిస్తూ ‘భగవద్గీతా గాన ప్రచార శంఖారావం’ పేరుతో – భగవద్గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేస్తున్న ఆస్ట్రేలియా పర్యటనలో భాగం గా మూడవ కార్యక్రమం – బ్రిస్బేన్ లోని, ‘తెలుగు లహరి’ సంస్థ ఆధ్వర్యం లో అద్వితీయం గా జరిగింది.

‘విశ్వశాంతి’ ని కాంక్షిస్తూ ‘భగవద్గీతా గాన ప్రచార శంఖారావం’ పేరుతో – భగవద్గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేస్తున్న ఆస్ట్రేలియా పర్యటనలో భాగం గా మూడవ కార్యక్రమం – బ్రిస్బేన్ లోని, ‘తెలుగు లహరి’ సంస్థ ఆధ్వర్యం లో అద్వితీయం గా జరిగింది.

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

‘విశ్వశాంతి’ ని కాంక్షిస్తూ ‘భగవద్గీతా గాన ప్రచార శంఖారావం’ పేరుతో – భగవద్గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేస్తున్న ఆస్ట్రేలియా పర్యటనలో భాగం గా మూడవ కార్యక్రమం – బ్రిస్బేన్ లోని, ‘తెలుగు లహరి’ సంస్థ ఆధ్వర్యం లో అద్వితీయం గా జరిగింది. గత రెండు దశాబ్దాల కాలం లో బ్రిస్బేన్ లో జరిగిన కార్యక్రమాలలో ఇటువంటి స్ఫూర్తి దాయకమైన గీతా ప్రవచనాన్ని, ప్రేక్షకుల విశేష స్పందన ని తాము చూడలేదని శ్రీ ప్రభాకర్ బచ్చు, శ్రీ హరి పంచుమర్తి తదితరులు పేర్కొన్నారు. “భగవద్గీతను అర్ధం చేసుకుని ఆచరించడం ద్వారా ఇతరులకు స్ఫూర్తిదాయకo గా నిలబడే స్థాయికి ఎదగ వచ్చు. మతాలు ఆవిర్భవించని కాలం లో సర్వదేశాలకు, సర్వ కాలాలకు, సర్వ జాతులకు వర్తించే విధం గా జగత్తులోని ప్రతి మానవుడిని ఉద్దేశించి మహోదాత్త మైన కర్తవ్యోపదేశo చేయడం ద్వారా శ్రీకృష్ణుడు జగద్గురువయ్యాడు. భగవద్గీత వృద్ధాప్యపు కాలక్షేపం కాదు. జీవిత ప్రారంభ దశలోనే చదివి అర్ధంచేసుకోవలసిన పాఠం. అందుచేత తల్లి తండ్రులు పిల్లలకు బాల్యదశనుంచే దీనిని నేర్పించాలి. ఇందువల్ల నైతిక విలువలు కలిగిన ఉత్తమ జీవితం గడపవచ్చు. మనం చేసే సత్కర్మల ద్వారా ఇతరులకు స్ఫూర్తిని అందించవచ్చు. ‘కర్మాచరణలో నైపుణ్యమే యోగం’ అని తెలుసుకోవడం ద్వారా సృజనాత్మకం గా పనులు చేసి ప్రపంచం చేత అభినందనలు పొందవచ్చు. మరణించిన తర్వాతకూడా ప్రజల హృదయాలలో జీవించే పనులు చేయవచ్చు. సుఖదుఃఖాల లో స్థితః ప్రజ్ఞతను సాధించవచ్చు. కర్మ ఫలితాన్ని భగవదర్పణం చేయడం ద్వారా ప్రశాంత జీవితాన్ని సాధించవచ్చు. మానసిక వత్తిడి లేని జీవితాన్ని గడపవచ్చు. ఏ ప్రాణి పట్ల ద్వేషభావాన్ని కలుగని సమభావనను అలవరచుకోవచ్చు. ఆత్మహత్యల ఆలోచన లేని జీవితం గడపవచ్చు. తెలిసిన తెలియకపోయినా ప్రకృతి శక్తుల ప్రభావం మనమీద కనిపించినట్టే, తెలియకుండా చదివినా భగవద్గీత అనిర్వచనీయమైన ఆనందాన్ని,శక్తిని ఇస్తుంది.” అన్నారు శ్రీ గంగాధర శాస్త్రి. మాతృ భాషను, మాతృ భూమిని, మాతృ సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగు భాష గొప్పదనాన్ని వివరించారు. శ్లోకాలద్వారా సంస్కృతాన్ని, పద్యాలద్వారా తెలుగు భాషా మాధుర్యాన్ని పిల్లలకు తెలియజేయాలన్నారు. ‘విశ్వరూప సందర్శన యోగం’ లోని కొన్ని శ్లోకాలను కళ్ళకు కట్టినట్టు తాత్పర్య సహితం గా గానం చేసి ప్రేక్షక శ్రోతలలో ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపారు. ఈ సందర్భం గా తెలుగు సంస్కృతి, బ్రిస్బేన్ వెబ్సైటు ను శ్రీ గంగాధర శాస్త్రి చేత ప్రారంభింపజేశారు. ఈ కార్యక్రమ నిర్వహణలో సహకరించిన క్వీన్స్ ల్యాండ్ తెలుగు అసోసియేషన్, షిర్డీసాయి సంస్థాన్, తెలంగాణా అసోసియేషన్ అఫ్ క్వీన్స్ ల్యాండ్, పలక- బలపం సంస్థలకు గంగాధర శాస్త్రి అభినందనాపూర్వక ఆశీస్సులందించారు. శ్రీమతి పద్మప్రియ నోరి తెలుగులో చేసిన సుమధురమైన వ్యాఖ్యానాన్ని, శ్రీమతి సుస్మితా రవి, శ్రీమతి రేణుక కరణం, చిరంజీవులు తియాన్సిక, యుక్త ల నాట్యకౌశలాన్ని అభినందిస్తూ, శ్రీ శ్రీధర్ పోపూరి, శ్రీమతి జ్యోత్స్న ల ఆతిధ్యానికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈపర్యటన ను దేవా (DEVAA – DHARMA ENLIGHTENMENT VEDIC ASSOCIATION OF AUSTRALIA) సంస్థ వ్యవస్థాపకులు శ్రీమాన్ పవన్ వఝల అత్యంత సమర్ధవంతం గా నిర్వహించినందుకు గంగాధర శాస్త్రి కృతజ్ఞతాభినందనలు తెలిపారు.

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *