Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

భగవద్గీత వృద్ధాప్యపు కాలక్షేపం కాదు. కేవలం పఠనా గ్రంథమూ కాదు. అధ్యయన గ్రంథం.. ఆచరణ గ్రంథం..!

భగవద్గీత వృద్ధాప్యపు కాలక్షేపం కాదు. కేవలం పఠనా గ్రంథమూ కాదు. అధ్యయన గ్రంథం.. ఆచరణ గ్రంథం..!

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

‘దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే / దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతమ్ II ( గీత -17-20) దానమిచ్చుట కర్తవ్యమని భావించి దేశ, కాల, పాత్రములనెఱిఁగి ప్రత్యుపకారమునాశింపక చేయుదానము సాత్త్విక దానము… అంటాడు కృష్ణ పరమాత్మ ఇదే ఉత్తమ దానము. మనిషి విధి గా ఆచరించవలసిన మూడు పుణ్య కర్మలలో దానము కూడా ఒకటి. మిగతా రెండు యజ్ఞము, తపస్సు. దాతలు ప్రధానం గా గుర్తించవలసింది పాత్ర ఎరిగి దానం చేయడం. దేవుడు కూడా కోరికను బట్టి ఇవ్వడు. అర్హతను బట్టే ఇస్తాడు. మనమూ అర్హతను బట్టే దానం చెయ్యాలి. శారీరక, మానసిక, ఆర్ధిక దుర్బలులకు, ప్రకృతి వైపరీత్యాలవల్ల దెబ్బతిని కోలుకోలేని వారికి సహాయం చెయ్యండి. ఈ జ్ఞానం కొరవడడం వల్లే ప్రభుత్వాలు ప్రజలకు అవసరం లేని అనేక ఉచితాల ఆశ చూపించి, ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. ప్రజలను మానసిక దుర్బలులను, సోమరిపోతులను చేస్తున్నారు. ఉచితం ఎప్పుడూ అనుచితమే.. ఉచితం గా వచ్చేదానికి విలువ ఉండదు. ఏదైనా కష్టపడితే వచ్చే ఫలితానికే విలువ… ఏదైనా ఉచితం గా పొందాలనుకోవడం మానసిక దుర్బలత్వమే…! ఉచితం అంటున్నారంటే అది మరొక చోట ధరలు పెంచి వసూలు చేస్తారని, ఆ భారం పేదల పైనే మరింత పడుతుందని అర్ధం చేసుకోనంతకాలం వ్యవస్థ మారదు.’ అన్నారు ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి…! మాజీ ప్రధాని శ్రీ పి వి నరసింహా రావు సోదరులు, సర్వార్ధ సంక్షేమ సమితి మరియు పి.వి సాహిత్య పీఠం అధ్యక్షులు శ్రీ పివి మనోహరరావు ఆధ్వర్యం లో జరిగిన ( 10.12.2023, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం, హైదరాబాద్) కార్తీకమాస వనభోజన కార్యక్రమం లో శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. “కార్తీక మాసం శివునికి ప్రీతికరమైనదైతే, మార్గశిరం విష్ణువునకు ప్రీతికరమైనది. ఈ ఇద్దరికీ భేదం లేదని ‘గీత’ లో ‘రుద్రాణాం శంకరశ్చాస్మి’ అంటూ మరోసారి స్పష్టం చేసాడు విష్ణు రూపుడైన కృష్ణపరమాత్మ…దీన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీ పి వి మనోహరరావు గారు నాచేత కార్తీక మాసం లో గీతా ప్రవచనం చెప్పించడం సముచితం గా ఉందని భావిస్తున్నాను. భగవద్గీతను జీవన గీత గా గుర్తెరిగి అధ్యయనం చేస్తే ఉత్తమ జీవితం గడపడం ఎలాగో అర్థమవుతుంది. అప్పుడే జన్మ సార్ధకమవుతుంది. భగవద్గీత వృధాప్యపు కాలక్షేపం కాదు. కేవలం పఠనా గ్రంథమూ కాదు. అధ్యయన గ్రంథం.. ఆచరణ గ్రంథం..! కాబట్టి గీత నేర్చుకుందాం.. రాత మార్చుకుందాo… ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం… బాల్యదశ నుండే మన పిల్లలకు భగవద్గీతను నేర్పించడం ద్వారా సనాతన ధర్మ రక్షకులమవుదాం. స్వార్ధరహిత ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం…” అన్నారు గంగాధర శాస్త్రి. అనంతరం శ్రీ పివి మనోహర రావు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా విచ్చేసిన బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ, బ్రహ్మశ్రీ వి ఎస్ ఆర్ మూర్తి, ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా సంఘం అధ్యక్షులు శ్రీ విజయ బాబు తదితరులు గంగాధర శాస్త్రి ని సత్కరించారు.

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ

Leave a Reply