Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

‘సంగీత నాటక అకాడమి’ దక్షిణభారతీయ కేంద్రాన్ని – పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు చేతులమీదుగా హైదరాబాద్ లో ని శిల్పకళావేదిక లో జరిగిన (12. 2. 2024) ఒక కార్యక్రమం లో లాంఛనం గా ప్రారంభించింది. కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి అద్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధి గా గీతా గాన ప్రవచన ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి హాజరయ్యారు.

‘సంగీత నాటక అకాడమి’ దక్షిణభారతీయ కేంద్రాన్ని – పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు చేతులమీదుగా హైదరాబాద్ లో ని శిల్పకళావేదిక లో జరిగిన (12. 2. 2024) ఒక కార్యక్రమం లో లాంఛనం గా ప్రారంభించింది. కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి అద్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధి గా గీతా గాన ప్రవచన ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి హాజరయ్యారు.

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ – దక్షిణాది కళలను, కళాకారులను ప్రోత్సహించడం కోసం ‘సంగీత నాటక అకాడమి’ దక్షిణభారతీయ కేంద్రాన్ని – పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు చేతులమీదుగా హైదరాబాద్ లో ని శిల్పకళావేదిక లో జరిగిన (12. 2. 2024) ఒక కార్యక్రమం లో లాంఛనం గా ప్రారంభించింది. కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి అద్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధి గా గీతా గాన ప్రవచన ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి హాజరయ్యారు. ఈ SNA కేంద్రం లో నిర్మించే ఆడిటోరియానికి ఘంటసాల శత జయంతి నేపధ్యం లో ‘గానగంధర్వ ఘంటసాల కళా మండపం’ అనిపేరు పెట్టడం బహుధా హర్షణీయమని, ఘంటసాల ను ‘తెలంగాణ’ ప్రభుత్వాలు మరిచిపోయాయనే అనుమానం సర్వే సర్వత్రా వ్యక్తమవుతున్న తరుణం లో శ్రీ జి కిషన్ రెడ్డి గారి చొరవతో జరుగుతున్న ఘంటసాల ఆడిటోరియం నిర్మాణం – ఇటు ఘంటసాల పాటను, ఆయన అభిమానులను గౌరవించినట్టయ్యిందని గంగాధర శాస్త్రి అన్నారు. కేవలం ఆడిటోరియానికి ఘంటసాల పేరు పెట్టడం తో పరిమితం కాకుండా, ప్రతి సంవత్సరం ఘంటసాల పాటల పోటీలను నిర్వహించి, తగిన బహుమతులతో గాయకులను ప్రోత్సహించవలసిందని సూచించారు. అంతేకాక ‘సంగీత నాటక అకాడమీ’ సంగీత విభాగం లో ఇచ్చే అవార్డులు కూడా ఘంటసాల పేరుతోనే ఇస్తే బావుంటుందని గంగాధర శాస్త్రి అన్నారు. ” ఘం.. ట.. సా.. ల..! అనే నాలుగు అక్షరాలు నాలాంటి వేలాది మంది గాయకులకు చతుర్వేదాలతో సమానమైనవి. తెలుగు సినిమా రంగానికి ఆయన చిరస్మరణీయులు. నాకు ఆయన ప్రాతస్మరణీయులు. ఘంటసాల గారి గానం తోనే జీవితమంతా ముడిపడి ఉన్న గాయకుడు బహుశా నేనొక్కడినేమో అనిపిస్తుంది. మా నాన్నగారి ద్వారా నేను విన్న తొలి పాట – ఘనా ఘన సుందర, కాలేజీ రోజుల్లో నాకు రాష్ట్ర స్థాయి ఉత్తమ బహుమతి తెచ్చిపెట్టిన పాట – శివశంకరి, నాకు ‘ఈనాడు’ పత్రికలో రామోజీ రావు గారు జర్నలిస్టు గా ఉద్యోగం ఇవ్వడానికి కారణమైన పాట – పాడుతా తీయగా, సినీ నేపధ్య గాయకుడుగా శ్రీ దాసరినారాయణ రావు గారు అవకాశం ఇవ్వడానికి దోహదం చేసింది – పుష్పవిలాపం, భాషపై పట్టు నేర్పింది – శ్యామలా దండకం, నన్ను ఎన్ టి ఆర్, ఏ ఎన్నార్, డా సి నారాయణ రెడ్డి వంటి మహానుభావులకు దగ్గర చేసింది ఘంటసాల పాటే… ! చివరకు – ఈ దేశం లో సంపూర్ణ భగవద్గీతను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రికార్డు చేసి, విడుదల చేసి, గీతా ప్రచారానికే జీవితాన్ని అంకితం చేసిన తొలి గాయకుడు గా నాకు స్ఫూర్తినిచ్చి, నా జన్మను చరితార్థం చేసింది కూడా ఘంటసాల గారే… ! ‘ఘంటసాల గానo ప్రాంతాలకు అతీతమైనది. భగవద్గీత మతాలకు అతీతమైనది. ఘంటసాలగారి స్థానాన్ని భర్తీ చేసిన వాళ్ళు ఉన్నారేమో గాని ఆయన స్థాయిని భర్తీ చేసిన వారు లేరని నా అభిప్రాయం.. ఆ గాన యోగి గాత్రం లో ఉన్న ఆర్ద్రత, పవిత్రత, పరమ శాంతి మరే గాత్రం లోనూ నేను వినలేదు. మిగతా వారి పాటలు తేనె తాగుతున్నట్టు అనిపిస్తే, ఘంటసాల పాటలు అమృతం తాగుతున్నట్టు అనిపించేవి. ఆయన మార్గమే నా రాతను మార్చి ‘గీత’ వైపు నడిపించింది. భగవద్గీతను జీవన గీత గా గుర్తించండి. మరణ గీత గా కాదు. గీతను బాల్యదశనుండే తాత్పర్యం తో సహా పిల్లలకు నేర్పించండి. స్వార్థ రహిత ఉత్తమ సమాజాన్ని నిర్మించండి..” అంటూ గాన ప్రసంగం చేశారు గంగాధర శాస్త్రి. ఈ సందర్భం గా అదే వేదికపైన గానం చేసిన కొందరు అంధ విద్యార్థులు తాము భగవద్గీత నేర్చుకుంటున్నామని చెబుతూ, శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి తమ పాఠశాలకు ఆహ్వానిస్తూ ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమం లో తెలుగు కోయిల శ్రీమతి పి. సుశీల, ప్రసిద్ధ పారిశ్రామిక వేత్త, దాత శ్రీ అల్లూరి సీతారామరాజు పాల్గొన్నారు.

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *