Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

 ధర్మబద్ధం గా చెయ్యాలి

 ధర్మబద్ధం గా చెయ్యాలి

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా చెయ్యాలి. త్రికరణశుద్ధి గా చెయ్యాలి. ఫలితం పరమాత్మదని భావించి చెయ్యాలి. భవబంధాలను వదలి చెయ్యాలి. నిస్వార్ధం గా చెయ్యాలి. అహంకారరహితం గా చెయ్యాలి. లోకహితం కోసం చెయ్యాలి…. ఇదే భగవద్గీత సారాంశం…’ అన్నారు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. ‘అమ్మకు ప్రేమతో…’ శీర్షికన తన తల్లి గారైన సునీతమ్మ జన్మదినం సందర్భం గా – శ్రీమతి సర్వేపల్లి ప్రవీణ (జూబిలీ హిల్స్ -హైదరాబాద్ లో ) ఏర్పాటు చేసిన గీతా సత్సంగం లో గంగాధర శాస్త్రి గాన ప్రవచనం చేశారు. ఆదర్శవంతమైన భవిష్యత్తు సౌధం నిర్మించుకోవాలంటే – జీవిత ప్రారంభదశలో నైతికమైన పునాది ఏర్పరచుకోవాలని అన్నారు. అందుకు ప్రపంచం లోనే – భగవద్గీత కు మించిన జీవిత పాఠం, ఉపదేశం మరొకటి లేదని అన్నారు. భగవద్గీత లోని ప్రతి శ్లోకాన్నీ – ప్రతి పదానికి అంతరార్ధం అర్ధం చేసుకుంటూ, దానిని ఆచరించే లక్ష్యం తో చదివితే – మన ఆలోచనా విధానంలో స్పష్టత ఏర్పడుతుందని, కుటుంబవ్యవస్థ, సమాజం, ప్రపంచం శాంతిమయం అవుతుందని అన్నారు. ఆధ్యాత్మికత అంటే అది రిటైర్మెంట్ సబ్జక్ట్ కాదని, భగవద్గీత వైరాగ్య గ్రంధం కాదని … అది ఉత్తమ జీవన విధాన మార్గాన్ని ఉపదేశించే పాఠమని, కాబట్టి దీనిని జీవిత ప్రారంభదశలోనే భగవద్గీత ద్వారా తల్లి తండ్రులు, గురువులు పిల్లలకు నేర్పించాలని గంగాధర శాస్త్రి అన్నారు. అందుకే తమ భగవద్గీతా ఫౌండేషన్ భగవద్గీతను పాఠ్యాంశం గా చేర్చమని రాష్ట్రప్రభుత్వాలని, జాతీయ గ్రంథం గా ప్రకటించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోందని అన్నారు. మరణించిన తరువాత కూడా ప్రజల హృదయాలలో జీవించి ఉండాలంటే అందుకు త్యాగం అవసరమని, అలాగే – సేవలేకపోతే ఆధ్యాత్మికత పరిపూర్ణం కాదని అన్నారు. సర్వ శక్తులకూ కారణమైన ఆహారాన్ని స్వీకరించేముందు విధిగా దైవానికి కృతజ్ఞతలు చెబుతూ – బ్రహ్మార్పణం బ్రాహ్మహవి (4-24), అహం వైశ్వానరో భూత్వా (15-14) శ్లోకాలను పఠించవలసిందని సూచించారు. మానవ సంబంధాలు కేవలం ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో భగవద్గీతా పఠనం మానసిక వత్తిడిని తగ్గించి, నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించి, ఉత్తమ లక్ష్యాన్ని చేరుస్తుందని అన్నారు. భగవద్గీతను మరణ గీత గా కాక జీవనగీత గా గుర్తించాలని, శ్రీకృష్ణుడికి మించిన మేనేజ్ మెంట్ గురువు, భగవద్గీత తో సమానమైన ఉత్తమ జీవన విధాన గ్రంధం ఈ ప్రపంచం లోనే లేదని అన్నారు. కుటుంబ జీవనానికి ఆత్మ జ్యోతి – తల్లి కాబట్టి తల్లులు తమ బిడ్డలకు భగవద్గీత నేర్పించే బాధ్యత తీసుకోవాలని, ఇలాంటి గీతా సత్సంగాలు ప్రతి చోటా వారానికి ఒక్కరోజైనా జరగాలని చెబుతూ – జూబిలీ హిల్స్ లో తరచుగా జరిగే పార్టీ లకు భిన్నం గా శ్రీమతి ప్రవీణ ఏర్పాటు చేసిన ఈ సత్సంగం ఎంతోమందికి ఆదర్శమని చెబుతూ వారికి ఆశీస్సులు అందజేశారు. చివరిగా గంగాధరశాస్త్రి ఆలపించిన కృష్ణ భజన లో అందరూ గళం కలిపారు.

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *