Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

సంగారెడ్డి జిల్లా లోని నారాయణ్ ఖేడ్ గ్రామం లో ప్రసిద్ధ యజుర్వేద పండితులు బ్రహ్మశ్రీ యలమంచి మోహన్ జోషి ఘనం గా నిర్వహించిన ‘మహారుద్ర సహిత శత చండీ యాగ పురస్సర చతుర్వేద స్వాహాకార సుదర్శన మహా యాగ ఉత్సవం’లోప్రసిద్ధ ఆధ్యాత్మిక గాయకులు, గీతా గాన ప్రవచన, ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి….

సంగారెడ్డి జిల్లా లోని నారాయణ్ ఖేడ్ గ్రామం లో ప్రసిద్ధ యజుర్వేద పండితులు బ్రహ్మశ్రీ యలమంచి మోహన్ జోషి ఘనం గా నిర్వహించిన ‘మహారుద్ర సహిత శత చండీ యాగ పురస్సర చతుర్వేద స్వాహాకార సుదర్శన మహా యాగ ఉత్సవం’లోప్రసిద్ధ ఆధ్యాత్మిక గాయకులు, గీతా గాన ప్రవచన, ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి….

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

‘క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరన్తప … అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ..! అంటే – మానసిక దౌర్బల్యాన్ని నీచమైనది గా చెబుతూ దాన్ని విడిచిపెట్టి నీ కర్తవ్యాన్ని ధర్మబద్ధం గా ఆచరిస్తే అంతటా విజయమే..! భగవద్గీతను జీవితకాలం లో సర్వావస్థల్లో చదివి అర్ధం చేసుకోగలిగితే స్వార్ధ రహిత ఉత్తమ సమాజాన్ని నిర్మించవచ్చు. మానసిక దౌర్బల్యం అనేక రూపాలలో పట్టి పీడిస్తుంది. ఎలక్షన్స్ దగ్గరపడుతుండగా మద్యం, డబ్బు, ఉచితాలు, పధకాల పేరుతొ సామాన్యుణ్ణి ప్రలోభపెడితే పదవిలోకి రావచ్చు. అనేది రాజకీయ నాయకుల మానసిక దౌర్బల్యమైతే.. ఆ పంచిపెట్టేది మన డబ్బే కదా… తీసుకుంటే తప్పేంటి ? అనేది సామాన్యుడి లాజికల్ మానసిక దౌర్బల్యం ..! డబ్బు మనదే.. కానీ ఇస్తున్నది ఏ రూపం లో అన్నది ముఖ్యం… ఇదీ ఒకరకం గా ‘ఓటుకి నోటు’ పథకమే.. దురదృష్టం ఏమిటంటే ఈ సామాన్యుడే ప్రభుత్వాలను నిర్ణయించేది. మనం ఏది ఆలోచించినా, ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం కుటుంబం మీద, సమాజం మీద, రాష్ట్ర అభివృద్ధి మీద, దేశ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఈ సందర్భం లోనే ‘ధర్మo’ అనేది గుర్తుకు రావాలి.. భగవద్గీతా బోధన పేరుతో ప్రతి ఒక్కరికీ ధర్మమార్గం అంటే ఏమిటో, హిందూయిజం గొప్పతనమేమిటో చెబుతూ ప్రజలను చైతన్యపరచాలి. కష్టం తో సంపాదించేదానికే విలువుంటుంది. ఉచితానికి విలువలేదు. ఇచ్చేవాడికీ తీసుకునే వాడికీ ఇద్దరికీ అగౌరవమే.. శారీరక, మానసిక, ఆర్ధిక, ప్రకృతి వైపరీత్యాలవల్ల దుర్బలులైన వారికే దానం చెయ్యాలి. ఇదే పాత్ర ఎరిగి దానం అంటారు. గీత లో ‘దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే..’ శ్లోకం ఈ విషయమే చెబుతుంది.. నైతిక విలువలను పెంపొందించడానికి భగవద్గీత కంటే మించిన జీవిత పాఠం మరొకటి లేదు. దీనిని బాల్యదశ నుండే పిల్లలకు నేర్పించండి.” అన్నారు ప్రసిద్ధ ఆధ్యాత్మిక గాయకులు, గీతా గాన ప్రవచన, ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. సంగారెడ్డి జిల్లా లోని నారాయణ్ ఖేడ్ గ్రామం లో ప్రసిద్ధ యజుర్వేద పండితులు బ్రహ్మశ్రీ యలమంచి మోహన్ జోషి ఘనం గా నిర్వహించిన ‘మహారుద్ర సహిత శత చండీ యాగ పురస్సర చతుర్వేద స్వాహాకార సుదర్శన మహా యాగ ఉత్సవం’ సందర్భం గా మూడవ రోజున గంగాధర శాస్త్రి గీతా వైభవాన్ని గానసహితం గా వివరించారు. ‘శివునికి ప్రీతికరమైన ఈ కార్తీక మాసం లో విష్ణురూపుడైన శ్రీ కృష్ణుని గీతను చెప్పించడాన్ని శివకేశవులకు అభేదాన్ని చెప్పడమే’ అని గంగాధర శాస్త్రి అన్నారు. కర్మ ఫలాన్ని పరమాత్మకు అర్పిస్తూ, అనన్య భక్తి తో ఆరాధించడం వల్లే పరమాత్మ అనుగ్రహం లభిస్తుందని అన్నారు. తల్లి తండ్రులు పిల్లలతో వీలైనంత సమయం గడపాలనీ, శ్రీరామాయణ, భారత, భాగవత, భగవద్గీతల వంటి మన ఆధ్యాత్మిక సంపద గురించిన అవగాహన కల్పించాలని గంగాధర శాస్త్రి కోరారు. తన సమక్షం లో భగవద్గీతా శ్లోక పఠనం చేసిన చిన్నారులను గంగాధర శాస్త్రి అభినందించి ఆశీర్వదించారు. లోక క్షేమాన్ని కాంక్షిస్తూ ఈ యాగాలను శాస్త్రోక్తం గా నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ మోహన్ జోషి కి హృదయపూర్వకo గా నమస్సులందిస్తూ అభినందించారు. చివరిగా భక్తులతో శ్రీ గంగాధర శాస్త్రి చేయించిన కృష్ణ భజన తో ‘మా ఫంక్షన్ హాల్’ భక్తి తరంగాలతో నిండిపోయింది. కార్యక్రమ అనంతరం గంగాధర శాస్త్రి మార్వాడి గల్లీ లోని 200 ఏళ్ల క్రిందటి రాధాకృష్ణ మందిరాన్ని దర్శించారు. ఈ మందిర నిర్వాహకులు

శ్రీ నందకిషోర్ భంగ్ గంగాధర శాస్త్రి కి స్వాగతం పలికి రాధాకృష్ణ చిత్రాన్ని ఆవిష్కరింపజేసి అటుపై తాము నిర్వహిస్తున్న గోశాలను చూపించారు. ఈ సందర్భం గా రావి ఆకు పైన శ్రీ గంగాధర శాస్త్రి చిత్రాన్ని చిత్రించిన పటాన్ని శ్రీ సంతోష్ కుమార్ బహూకరించారు.

+66

See Insights and Ads

Boost post

All reactions:

88

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *