Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

అమెరికా లోని కాన్సస్ సిటీ లోని “తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ కాన్సస్ సిటీ” వారు ఘనం గా నిర్వహించిన (10.9.2023) కార్యక్రమంలో డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేసిన స్ఫూర్తిదాయకమైన గీతా గాన ప్రవచనం….

అమెరికా లోని కాన్సస్ సిటీ లోని “తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ కాన్సస్ సిటీ” వారు ఘనం గా నిర్వహించిన (10.9.2023) కార్యక్రమంలో డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేసిన స్ఫూర్తిదాయకమైన గీతా గాన ప్రవచనం….

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

‘గర్భం లో ఉన్నప్పుడే అభిమన్యుడు పద్మవ్యూహం గురించి తెలుసుకున్నట్టు.. తల్లిగర్భంలోనే విష్ణు తత్వం విని ప్రహ్లాదుడు పరమ వైష్ణవ భక్తుడైనట్టు … తల్లి గర్భం లో ఉన్నప్పుడే శిశువుకు భగవద్గీతను వినిపిస్తే – ఈ లోకం లోకి వచ్చాక లౌకిక మైన కర్మలను ఆచరిస్తూనే ఆధ్యాత్మ జ్ఞాని అవుతాడు. భవబంధాలకు తావు లేకుండా కర్మలను ఆచరించ గలుగుతాడు. మానసిక వత్తిడి లేని ఆరోగ్యవంతుడు గా జీవితం కొనసాగిస్తాడు. నిస్వార్ధం గా లోకహితం కోసం కర్మలను ఆచరిస్తాడు. తనని శాశ్వతుడిని చేసే కర్మల పట్ల ఆసక్తి చూపుతాడు. లక్ష్యం చేరుకోవడం కోసం చేసే ప్రయాణాన్ని అనుక్షణం ఆస్వాదించగలుగుతాడు. భగవద్గీత లో శ్రీకృష్ణుడు అర్జునుడి కి ఉపదేశించిన ప్రతీ శ్లోకమూ సకల మానవాళి కి ఉపయోగపడే ఒక్కో జీవిత పాఠం … ! అందుకే కనీసం బాల్యదశ నుండైనా మీ పిల్లలకు భగవద్గీతామృతాన్ని రుచి చూపించండి.. గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే. సందేహం లేదు.’ అన్నారు గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. ‘అద్దం ముందు నిలబడితే మనం భౌతికం గా ఎలా ఉంటామో మాత్రమే తెలుస్తుంది. భగవద్గీత అనే అద్దం ముందు నిలబడితే మన తత్త్వ మేమిటో తెలుస్తుంది. మనం తినే ఆహారాన్ని బట్టి, చేసే కర్మలను బట్టి మనం సాత్త్వికులమో, రాజసికులమో, తామసికులమో అర్ధమవుతుంది. మన తప్పుటడుగుల్ని సరిచేసి, మనల్ని మనం ఉద్ధరించుకునే అవకాశం కల్పిస్తుంది గీత..!’ అన్నారు గంగాధర శాస్త్రి. నిత్యజీవితానికి భగవద్గీత ను అన్వయిస్తూ సాగిన ప్రవచనం ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. అమెరికా లోని కాన్సస్ సిటీ లోని “తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ కాన్సస్ సిటీ” వారు ఘనం గా నిర్వహించిన (10.9.2023) కార్యక్రమంలో డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేసిన స్ఫూర్తిదాయకమైన గీతా గాన ప్రవచనాన్ని ప్రేక్షకులు మంత్రముగ్ధులై విన్నారు. ఈ సందర్భం గా అసోసియేషన్ కు చెందిన పలువురు సభ్యులు శ్రీ గంగాధర శాస్త్రి గాన ప్రవచనా సరళి పై ప్రశంసల జల్లు కురిపిస్తూ.. ”గీతా గాన కౌస్తుభ” బిరుదు తో ఘనం గా సత్కరించారు. కార్యక్రమానికి రూపకల్పన చేసి, నడిపించిన తీరు అద్వితీయమని శ్రీ గంగాధర శాస్త్రి అసోసియేషన్ సభ్యులను ప్రశంసిస్తూ – బోర్డు చైర్ పర్సన్, శ్రీ అమ్మిరెడ్డి శ్రీధర్, ప్రెసిడెంట్ శ్రీ నరేంద్ర దుద్దెల, వైస్ ప్రెసిడెంట్ శ్రీ చంద్ర శేఖర్ యక్కలి, బోర్డు సభ్యులు శ్రీ శ్రీనివాస్ పెనుగొండ, శ్రీ శివ తియ్యగూర, కోశాధికారులు శ్రీ ఫణి కుమార్, శ్రీ ఉదయ్, శ్రీమతి శ్రావణి మేక, శ్రీ విశేష్ రేపల్లె, శ్రీమతి సరిత, పాండురంగ, శ్రీమతి రాధికా గాదిరాజు, శ్రీనుకుమార్, లకు కృతజ్ఞతలు తెలియజేసారు. తమ తెలుగు భగవద్గీత కు చేయూత నందించడమే గాక, ఆత్మీయ ఆతిధ్యం అందిస్తూ ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తలు గా వ్యవహరించి, ఘన విజయం చేకూర్చిన వదాన్యులు శ్రీ రాజగోపాల్, శ్రీమతి అరుణ రంగినేని లకు డా గంగాధర శాస్త్రి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేశారు. కార్యక్రమానికి ముందు హిందూ దేవాలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ శ్రీనివాసాచార్యులు మహేంద్రాడ నిర్వహణలో హిందూ దేవాలయం లోని శ్రీవెంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు చేశారు. వేదికపై గణపతి కీర్తన తో పాటు, భగవద్గీత శ్లోకాలు గానం చేసిన చిII శ్రీనిధి ని గంగాధర శాస్త్రి అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *