Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

సెయింట్ లూయిస్, అమెరికా లోని ‘ప్రవాస గాయత్రి సమాఖ్య’ ఆధ్వర్యం లో మహాత్మా గాంధీ సెంటర్ లో జరిగిన (27.8. 2023) గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి గారి ‘గీతా గాన ప్రవచనం’….

సెయింట్ లూయిస్, అమెరికా లోని ‘ప్రవాస గాయత్రి సమాఖ్య’ ఆధ్వర్యం లో మహాత్మా గాంధీ సెంటర్ లో జరిగిన (27.8. 2023) గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి గారి ‘గీతా గాన ప్రవచనం’….

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

సెయింట్ లూయిస్, అమెరికా లోని ‘ప్రవాస గాయత్రి సమాఖ్య’ ఆధ్వర్యం లో మహాత్మా గాంధీ సెంటర్ లో జరిగిన (27.8. 2023) ‘గీతా గాన ప్రవచనం’ కార్యక్రమంలో ప్రజలు అత్యధిక సంఖ్య లో పాల్గొని ఘన విజయం చేకూర్చారు. ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి తన గీతా గాన ప్రవచనం లో భగవద్గీత తో పాటు ఘంటసాల, అన్నమయ్య భక్తి గీతాలతో, భజనలతో రెండున్నర గంటలసేపు ప్రేక్షకులకు స్పూర్తినిస్తూ గీతా మార్గం లో ప్రయాణించారు. ”అమెరికన్స్ తో పాటు కలిసి మెలుగుతున్న భారతీయుల పిల్లలు ఒక పక్క తమ తల్లి తండ్రుల సంస్కృతిని, మరోపక్క అమెరికన్స్ జీవన విధానాన్ని అర్ధం చేసుకుంటూ నడవడం లో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని, తత్కారణం గా అశాంతి పెరిగి పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గంగాధర శాస్త్రి అన్నారు. దీనికి పరిష్కారం – బాల్యదశ నుండే మన పిల్లలకు స్వధర్మాన్ని, సంప్రదాయాలను, భగవద్గీతను తెలియజేయడం ఒక్కటే అని, మన సంస్కృతిని, మాతృ భాషను తరువాత తరం వారికి తెలియజేయాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని ‘శ్రేయాన్ స్వధర్మో విగుణః’ అనే గీతా శ్లోకాన్ని తాత్పర్య సహితం గా శ్రీ గంగాధర శాస్త్రి గుర్తు చేస్తూ వివరించారు. ‘గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే’ అని చెబుతూ గీత లో అతి ముఖ్య శ్లోకాలను నిజ జీవితం లో ఆచరించడం ద్వారా మానసిక వత్తిడి లేని ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపవచ్చని అన్నారు. తనకీ అవకాశం ఇచ్చిన శ్రీ ప్రసాద్ స్వర్ణ కు గంగాధర శాస్త్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. కార్యక్రమం విజయవంతం కావడానికి దోహదం చేసిన శ్రీ నారాయణ బొమ్మిరెడ్డిపల్లి, శ్రీ వెంకట్ ధర్మవరపు, శ్రీ హరి కావూరి, రవి ప్రకాష్ శ్రీపాద, శ్రీ సాయి స్తబ్నవిస్ లకు ధన్యవాదాలు తెలియజేసారు. ప్రసిద్ధ నాట్యకళాకారిణి, నాట్యాచారిణి శ్రీమతి అర్చన ఉపమాక సుమధురమైన తెలుగు లో వ్యాఖ్యానం అందించారు. ప్రసిద్ధ నాట్యాచారిణి శ్రీమతి సుజాత వింజమూరి, శ్రీమతి సునీత ధర్మవరపు, శ్రీమతి నీలిమ స్వర్ణ, శ్రీమతి ప్రియా నందనవనం, శ్రీమతి లావణ్య కావూరి, శ్రీమతి మాధవి స్తబ్నవిస్ లు జ్యోతి ప్రకాశనం చేసిన అనంతరం శ్రీ ప్రసాద్ స్వర్ణ – భగవద్గీతా వ్యాప్తి కి శ్రీ గంగాధర శాస్త్రి చేస్తున్న కృషిని వివరిస్తూ ఆయనను వేదికకు ఆహ్వానించారు. శ్రీ శ్రీనివాస ఐనాపురపు – గంగాధరు జూటము విడి /పొంగుచు యేతెంచెనేమొ పుష్కరవేళన్ /జంగమ తీర్థపు గళమున /సంగమమైనట్టి గంగ చప్పున మెఱిసెన్ / అంటూ తన పద్య రత్న మాలతో గంగాధర శాస్త్రి ని సత్కరించారు. శ్రీ జయరాం అద్దేపల్లి, శ్రీమతి జయంతి లు స్ప్రింగ్ ఫీల్డ్ నుంచి మూడున్నర గంటల రోడ్డు ప్రయాణం చేసి ఈ కార్యక్రమానికి హాజరై దివ్యమైన అనుభూతిని, భగవద్గీతా స్ఫూర్తిని పొందామని అన్నారు. యూట్యూబ్ వీడియోలు చూసిన స్ఫూర్తి తో శ్రీ గంగాధర శాస్త్రి గీతా ప్రవచనాన్ని ప్రత్యక్షం గా వినేందుకు సుదూరాలనుంచి అభిమానులు తరలిరావడం విశేషం.

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *