Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చెప్పిన గీతాశ్లోకాలను మోరిస్విల్ మేయర్ శ్రీ టి జె కాలి తిరిగి ఉచ్చరించారు. గంగాధర శాస్త్రి ఆయనకు కుంకుమ తిలకం దిద్ది, తాను గానం చేసిన సంపూర్ణ భగవద్గీతా గాన పేటికను జ్ఞాపిక గా అందించగా, టి జె కాలి శ్రీ గంగాధర శాస్త్రి కి పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు….

గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చెప్పిన గీతాశ్లోకాలను మోరిస్విల్ మేయర్ శ్రీ టి జె కాలి తిరిగి ఉచ్చరించారు. గంగాధర శాస్త్రి ఆయనకు కుంకుమ తిలకం దిద్ది, తాను గానం చేసిన సంపూర్ణ భగవద్గీతా గాన పేటికను జ్ఞాపిక గా అందించగా, టి జె కాలి శ్రీ గంగాధర శాస్త్రి కి పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు….

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చెప్పిన గీతాశ్లోకాలను మోరిస్విల్ మేయర్ శ్రీ టి జె కాలి తిరిగి ఉచ్చరించారు. గంగాధర శాస్త్రి ఆయనకు కుంకుమ తిలకం దిద్ది, తాను గానం చేసిన సంపూర్ణ భగవద్గీతా గాన పేటికను జ్ఞాపిక గా అందించగా, టి జె కాలి శ్రీ గంగాధర శాస్త్రి కి పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. నార్త్ కరోలినా రాష్ట్రం లో, కారీ పట్టణం లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం లో (23.9. 2023) శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. నిత్య జీవితం లో భగవద్గీత ను అన్వయించుకుని ఎలా ఆచరించాలో, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి నిమిత్తం గా చేసుకుని సర్వ మానవాళిని సన్మార్గం లో నడిపించడం కోసం చేసిన కర్తవ్య బోధా రహస్యాన్ని శ్రీ గంగాధర శాస్త్రి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రేక్షకులు ఆసాంతం గీత ను భక్తి శ్రద్ధలతో విని పులకించారు. శ్రీ వేంకటేశ్వర దేవాలయాన్ని SV TEMPLE గా పిలువ వద్దని, పూర్తి పేరుతో పిలవాలని సూచించారు. వేంకటేశ్వర నామం బాధలను హరించే ఈశ్వర నామం గా గుర్తెరగాలని అన్నారు. అలాగే కృష్ణ అనే నామం కూడా అత్యంత శక్తివంతమైనదని, దానిని పూర్తి గా పలకాలని, సౌలభ్యం కోసం ‘క్రిష్’ గా కత్తిరించి పలకడo ద్వారా కృష్ణ నామ ఫలితాన్ని పొందజాలమని అన్నారు. క్రిష్ అనే ధాతువునకు ఆకర్షించుట అని అర్ధమని, ‘ణ’ అనేది ఆనంద వాచకమని, అందరిని ఆకర్షించే నిత్యానంద స్వరూపుడు కాబట్టి ఆయన కృష్ణుడయ్యాడని గంగాధర శాస్త్రి అన్నారు. మానవ జన్మను పవిత్రం చేసే పుణ్య కర్మలైన యజ్ఞ దాన తపస్సులను ప్రతి ఒక్కరూ ఆచరించాలని గీత చెబుతోందని అన్నారు. శ్రీ గంగాధర శాస్త్రి విశ్వరూప సందర్శన యోగాన్ని తాత్పర్యం తో గానం చేస్తున్నప్పుడు ఆర్ద్రత నిండిన హృదయాలతో చెమర్చిన కళ్ళతో ప్రేక్షకులు కరతాళధ్వనులు సలిపారు. తల్లి తండ్రులు ‘గీత’ను బాల్య దశనుండే తమ పిల్లలకు నేర్పించడం ద్వారా సనాతన ధర్మాన్ని తరువాత తరాలకు అందించాలని గంగాధర శాస్త్రి అన్నారు. భగవద్గీత కేవలం పఠనా గ్రంథం కాదని, అర్ధం చేసుకుని ఆచరించి తరించవలసిన గ్రంథమని అన్నారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణ కమిటీ చైర్మన్ డాII రాజ్ పోలవరం కు గంగాధర శాస్త్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ పవన్ ఎర్రంశెట్టి, డా. వల్లి కొడాలి, శ్రీ సతీష్ గరిమెళ్ళ ల సహకారాన్ని ప్రశంసించారు. భగవద్గీతా ఫౌండేషన్ కు చేయూతనందించడం తో పాటు తనకు ఆత్మీయ ఆతిధ్యం అందించిన శ్రీమతి లావణ్య, శ్రీ గోపాల్ కేతముక్కల దంపతులకు గంగాధర శాస్త్రి కృతజ్ఞతలు తెలియజేసారు. కార్యక్రమాన్ని అత్యంత సమర్ధవంతం గా నిర్వహించిన శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయo పాలక మండలి అధ్యక్షులు శ్రీ సునిల్ కొల్లూరు ను అభినందించారు. శ్రీ గంగాధర శాస్త్రి గీతా ప్రవచనం ద్వారా తమను మరో లోకానికి తీసుకు వెళ్లి మరిచిపోలేని దివ్యమైన అనుభూతి ని పంచిపెట్టారని శ్రీ సునీల్ కొల్లూరు అన్నారు. ఈ కార్యక్రమం లో తానా, టాటా, ట్యూటా, టి టి జి ఏ, హెచ్ ఎస్ ఎన్ సి సంస్థలు తమ సహకారం అందించాయి. ఈ సందర్భం గా బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రి ని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం సభ్యులు ఘనం గా సత్కరించారు.

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *