Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

‘గవా మంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశః

‘గవా మంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశః

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

గవా మంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశః’ అంటూ గోవును సర్వదేవతా స్వరూపం గా, చతుర్దశ భువనాకృతి గా కీర్తించిన వేదం పుట్టిన భరత భూమిలో గోవు నిరాదరణకు గురి కావడం దురదృష్టం..! అ అంటే అమ్మ .. ఆ అంటే ఆవు అని తెలుగు పిల్లలకు పాఠం చెబుతూ అమ్మ తర్వాత అంతటి స్థానాన్ని ఇచ్చిన తెలుగు భూమిలో కూడా నిత్యం గోవధ జరగడం తెలుగు జాతి దురదృష్టం’ అన్నారు గీతా గాన ప్రవచన ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. ‘అఖిల భారత గో సేవా ఫౌండషన్’ చేపట్టిన ‘గోమహాపాదయాత్ర’ కార్యక్రమానికి అతిథి గా హాజరై ప్రసంగించారు. గోవును హిందువుల జంతువుగా భావించరాదని, ఇది సర్వ మానవాళికి హితమొనర్చె ప్రాణి అని, సృష్టిలో శ్రేష్టమైనవాటిని హిందువులు తమ తపస్సు ద్వారా గుర్తించారనీ అన్నారు. వేదాలలో విశిష్ట స్థానం ఇవ్వబడి, ‘సర్వోపనిషదో గావో ..’ అంటూ ఉపనిషత్తుల ను గోవులతో పోల్చి న భరత భూమి లో, ‘పాడి ఆవులలో కామధేనువు నేను’ అనే పరమాత్మ చేత పేర్కొనబడిన మన దేశం లో నిత్యం వేలాది గోవులు బలి అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే గోవును జాతీయ ప్రాణి గా ప్రకటించి, గోవధ నిషేధానికి కఠినమైన చర్యలు చేపట్టాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులవల్ల భూమి, ఆహారం విషతుల్యమైపోయిందని, గో ఆధారిత వ్యవసాయం వల్ల భూమి సారవంతమవుతుందని, తద్వారా పండే పంట తినడం ద్వారా ఆరోగ్యం, సద్బుద్ధి, సదాలోచనలు కలుగుతాయని అన్నారు. ఆవులు పాలు రోగ నిరోధకశక్తి ని పెంచుతాయని, గోవులను వధ్యశాలలకు అమ్మేసేవారు, వాటిని కొని గోవులను సంహరించేవారు, ‘అల్కబీర్’ లాంటి గోవధ్యశాలలను నిర్వహించేవారు అందరు హిందువులే కావడం అత్యంత శోచనీయమని గంగాధర శాస్త్రి అన్నారు. గో హత్య మహా పాపమని అన్నారు. గర్భం తో ఉన్న గోవు లలోని పిండాలకు ముస్లిం దేశాలలో అత్యంత గిరాకీ అన్న వార్త చదివి దుఃఖం ఆపుకోలేకపోయానని, ఇది మానవ జాతికే శాపమని గంగాధర శాస్త్రి గద్గద స్వరం తో అన్నారు. ఈ సందర్బo గా -మానవ జీవితంతో మమేకమైన గోవు ప్రయోజనాలను వివరిస్తూ సాగే ‘గోవులగోపన్న’ చిత్రం లోని ‘వినరా వినరా నరుడా’ గీతాన్ని ఆలపించి ఆలోచింపచేశారు. భారత దేశపు సంస్కృతి అస్థిత్వాన్ని కాపాడి తరువాత తరాలవారికి అందించాల్సిన బాధ్యత మన అందరిదని చెబుతూ ఈ గో మహాపాదయాత్ర ముఖ్యోద్దేశ్యాన్ని గ్రహించి ప్రజలు చైతన్యులవ్వాలని, తల్లితండ్రులను కన్నబిడ్డలే పట్టించుకోని ఈ రోజుల్లో బాలకృష్ణ గురుస్వామి అఖిల గోమాత పరిరక్షణ కోసమే తన జీవితాన్ని అంకితం చేయడం నమస్కరించతగ్గ విశేషమని గంగాధర శాస్త్రిఅన్నారు. హైద్రాబాదు నుండి తిరుపతి వరకూ జరిగే ఈ గో మహాపాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు..

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ

Leave a Reply