Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

గీతాగాన, ప్రవచన, ప్రచారకర్త శ్రీ ఎల్.వి. గంగాధర శాస్త్రి కి మహర్షి పాణిని యూనివర్సిటీ “గౌరవ డాక్టరేట్ “

ప్రసిద్ధ గాయకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త శ్రీ ఎల్. వి. గంగాధర శాస్త్రి కి ఉజ్జయిని, మధ్యప్రదేశ్ లోని “మహర్షి పాణిని సంస్కృత ఏవం వైదిక విశ్వవిద్యాలయం” “గౌరవ డాక్టరేట్ ” ప్రకటించింది.

భారతీయ సంస్కృతి ని, సంస్కృత విద్యను పరిరక్షించడం లో భాగంగా – పరిశోధనాత్మక కృషి చేసి, భారతీయ ఆధ్యాత్మిక సారమైన భగవద్గీత లోని 700 శ్లోకాలను స్వీయ సంగీతం లో తెలుగు తాత్పర్య సహితంగా గాన చేసి, వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, విడుదల చేసి, అంతటితో తన భాధ్యత తీరిపోయిందని భావించకుండా – స్వార్థ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం గీతా ప్రచారమే తన జీవితంగా మలుచుకున్నందుకు శ్రీ గంగాధర శాస్త్రి కి “గౌరవ డాక్టరేట్ ” ను ప్రకటిస్తున్నట్లు పాణిని విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సి.జి .విజయకుమార్ తెలియజేసారు.

మే 24, 2023 ఉదయం 11 గంటలకు కోఠీ మార్గ్ లోని విక్రం కీర్తి మందిరం, ఉజ్జయిని (మధ్యప్రదేశ్ ) లో జరిగే ‘మహర్షి పాణిని సంస్కృ త్ ఏవం వైదిక్ విశ్వవిద్యాలయం’ నాల్గవ స్నాతకోత్సవం లో ఆయనను గౌరవ డాక్టరేట్ తో సన్మానించనున్నట్లు రిజిస్ట్రార్ డాII దిలీప్ సోని తెలిపారు.

ఈ సందర్భం గా గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు ఎల్.వి. గంగాధర శాస్త్రి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ –

మధ్యప్రదేశ్ గవర్నర్, ఆ రాష్ట్రం లోని విశ్వవిద్యాలయాల కులపతి అయిన శ్రీ మంగుభాయ్ పటేల్ కు, మహర్షి పాణిని విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీ విజయ్ కుమార్ సి.జి కు, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ కు, ఉన్నత విద్యా శాఖా మంత్రి శ్రీ మోహన్ యాదవ్ లకు వినమ్ర పూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.

కాగా – ‘భగవద్గీతా ఫౌండేషన్ ‘ ద్వారా తాను 17 ఏళ్లుగా చేస్తున్న కృషిని గుర్తించిన భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇన్ ఛార్జ్, తెలుగువాడైన శ్రీ పి. మురళీధరరావు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా తనకీ గౌరవం దక్కిందని, అందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని గంగాధర శాస్త్రి అన్నారు.

సంస్కృత వ్యాకర్త అయిన ‘పాణిని మహర్షి ‘ పేరు తో స్థాపించిన విశ్వవిద్యాలయం నుంచి ఈ గౌరవం పొందడం సముచితంగా, అదృష్టంగా భావిస్తున్నానని గంగాధర శాస్త్రి అన్నారు. తనకు లభించిన ఈ గౌరవం – తనకు జన్మనిచ్చిన తల్లి దండ్రులకు, 17 ఏళ్ళ తన భగవద్గీతా ప్రయాణం లో సహకరించిన భార్యాబిడ్డలకు, మార్గ నిర్దేశకత్వం చేసిన గురువులకు, సాంకేతిక నిపుణులకు, ప్రపంచం నలుమూలల నుండి చేయూతనందించిన భగవద్గీత అభిమానులకే చెందుతుందని, తాను కేవలం శ్రీ కృష్ణుడు ఉపయోగించుకున్న సాధనం మాత్రమేనని గంగాధర శాస్త్రి అన్నారు.

స్వార్థ రహిత ఉత్తమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా ‘భగవద్గీత’ పునాదుల పై నిర్మించిన లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక, సామాజిక సేవా సంస్థ ‘భగవద్గీతా ఫౌండేషన్ ‘ ద్వారా గీతా ప్రచారం తో పాటు –

* పేద విద్యార్థులకు, అనాధ బాలలకు, వికలాంగులకు , వృద్ధాశ్రమాలకు చేయూత

* గోసేవ, యోగ శిక్షణ, వేదశాస్త్రాల పరిరక్షణ

* ఆయుర్వేద, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ

వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సంస్థ వ్యవస్థాపకులు గంగాధర శాస్త్రి చెప్పారు.

ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా ఆధ్యాత్మిక సామాజిక సేవా క్షేత్రంగా తెలుగునాట ‘ భగవద్గీతా యూనివర్సిటీ ‘ స్థాపనే పరమ లక్ష్యం గా ‘భగవద్గీతా ఫౌండేషన్’ కృషి చేస్తుందని చెబుతూ – మతాలకు అతీతమైన జ్ఞాన గ్రంథం ‘భగవద్గీత’ ను ప్రతి ఒక్కరూ చదివి ఆచరించాలని, గీతను బాల్య దశ నుండే పిల్లలకు నేర్పించాలని కోరారు.

గతం లో శ్రీ గంగాధర శాస్త్రి సినిమా జర్నలిస్టు గా, సినీ నేపధ్య గాయకుడుగా, సంగీత కార్యక్రమాల సమర్పకుడు గా, ప్రయోక్త గా కొనసాగుతున్న తరుణం లో పరివర్తన చెంది, అప్పటి వరకూ తాను చేసిన జీవిత ప్రయాణపు దిశను మార్చుకుని ఆధ్యాత్మిక మార్గం లోకి ప్రవేశించారు. తెలుగు వాడైన ఘంటసాల కొంతమేరకు గానం చేసిన భగవద్గీతను సంపూర్ణం గా గానం చేసి, ఆయనకు అంకితమిచ్చి గురు ఋణం చెల్లించుకున్నారు. ‘భగవద్గీత జీవన గీత – మరణ గీత కాదు.’అన్న నినాదం తో సాగుతున్న గంగాధర శాస్త్రి కృషిని శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్థ స్వామి, దివంగత రాష్ట్రపతి డా II ఏ పి జె అబ్దుల్ కలాం, ప్రధాని నరేంద్రమోడీ, శ్రీ రాంనాథ్ కోవింద్ వంటి వారు ప్రశంసించారు. గతం లో – గీత ద్వారా గంగాధర శాస్త్రి చేస్తున్న కృషిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కళారత్న’ తో సత్కరించింది.

నకిరేకల్ లో గంగాధర శాస్త్రి గారి గీతా గాన ప్రవచనం…

“మనం చేసే కర్మలు ధర్మబద్ధమైనవి అయి ఉన్నప్పుడు మాత్రమే పరమాత్మ అనుగ్రహం సంపూర్ణం గా ఉంటుంది. ధర్మ మార్గం లో ఉన్న ఏ భక్తుడు అనన్య భక్తి తో పరమాత్మ ను ధ్యానిస్తాడో అట్టి వారి యోగక్షేమాలు తానే చూసుకుంటానని పరమాత్మ చెబుతాడు. ఇక్కడ యోగం అంటే పొందని దానిని పొందుట, క్షేమం అంటే పొందినదానిని రక్షించుట అని ఆది శంకరుల భాష్యం. ఏ దేవతను ఆరాధించినా అది తనను ఆరాధించినట్టేనని చెబుతూ ఆయా దేవతలు తన అనుగ్రహం వల్లనే ఫలాలను ఇస్తారని పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు. తిరగలిలో దగ్గరగా ఉండే గింజలు నలగవు. అలాగే పరమాత్మకు దగ్గరగా ఉండే వానికి నాశనము లేదు. ‘న మే భక్త: ప్రణశ్యతి’ అన్నది పరమాత్మ వాక్యం… గీతను బాల్య దశనుండే పిల్లలకు నేర్పించండి. ఈ దేశం గొప్పతనం, ఇక్కడి ఆధ్యాత్మిక జ్ఞానం భగవద్గీత రూపం లో పిల్లలకు నేర్పించండి. ఇలా తెలియ చేయకపోవడo వల్లే పిల్లలు తల్లి తండ్రులను, ఈ దేశాన్ని వదిలేసి కేవలం డబ్బుకోసం ఇతర దేశాల వెంట పరుగెడుతున్నారు. ఉత్తమ జీవన విధానాన్ని, ఆదర్శవంతమైన సమాజాన్ని ఏర్పరుస్తుంది భగవద్గీత. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యం గా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది భగవద్గీత. భగవద్గీతను ప్రచారం చేయడమంటే మతాన్ని ప్రచారం చెయ్యడమని కాదు. ధర్మాన్నీ, జ్ఞానాన్ని ప్రచారం చెయ్యడం…! మానసిక, శారీరక, వాచిక ఆరోగ్యాలను కాపాడి ఉన్నతమైన మార్గాన్ని చూపుతుంది గీత.. ” అన్నారు గీతా గాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి… నల్గొండ జిల్లా నకిరేకల్ లోని షిరిడి సాయిబాబా సంస్థాన్ ప్రాంగణం లో (29.4. 2023) ఆయన గీతా గాన ప్రవచనం చేశారు. భగవద్గీత శ్లోకాలు పఠించిన చిన్నారులను, వారికి శిక్షణనిచ్చిన గురువు శ్రీమతి సుమలత ను ఆశీర్వదించారు. తమకు ఆత్మీయ ఆతిధ్యం అందించిన శ్రీ రాంబాబు, తులసి దంపతులకు, ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన ప్రతి ఒక్క సభ్యునికి కృతజ్ఞతలు తెలియజేసారు. ట్రస్టు చైర్మన్ శ్రీ కోసం లింగయ్య, సభ్యులు శ్రీ గంగాధర శాస్త్రి దంపతులను సత్కరించారు.

స్వార్ధ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం భగవద్గీతా ప్రచారమే లక్ష్యం గా భారత దేశం లోని హైదరాబాద్ లో స్థాపించిన ‘భగవద్గీతా ఫౌండేషన్’ కు అనుబంధం గా అమెరికా లోని న్యూజెర్సీ లో ‘గీతా ఫౌండేషన్’ స్థాపనకు మూల కారకుడైన శ్రీ రమేష్ అనుమోలు ను భగవద్గీతా గాన,ప్రవచన, ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి సత్కరించారు. అనంతరం అమెరికా లో భగవద్గీతా వ్యాప్తి గురించి చర్చించారు.

‘ఆల్ ఫోర్స్ జెన్ నెక్స్ట్’ వార్షికోత్సవాలు

కరీంనగర్ లోని ప్రముఖ విద్యా సంస్థ ‘ఆల్ ఫోర్స్ జెన్ నెక్స్ట్’ వార్షికోత్సవానికి – ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ముఖ్య అతిథి గా హాజరై జ్యోతి ప్రకాశనం చేసి “కర్తవ్యం,లక్ష్యం, నైతిక విలువలు, భగవద్గీత ‘ అనే అంశాలపై విద్యార్థులను, తల్లి తండ్రులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. బుధవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం – వివిధ విభాగాలలో ప్రతిభా పాటవాలను కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు శ్రీ గంగాధర శాస్త్రి బహుమతి ప్రదానం చేసారు. అనంతరం విద్యా సంస్థల చైర్మన్ శ్రీ నరేందర్ రెడ్డి – గంగాధర శాస్త్రి ని సత్కరించారు.

GITA GANA YAGNAM – ABUDABI

GITA JAYANTHI – 2015

GITA JAYANTHI – 2017

గీతాజయంతి సంధర్భంగా ” గీతాయాత్ర” మరియు శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారికి “గీతాచార్య” అవార్డు తో సత్కారం. శ్రీ అవధూతగిరి మహారాజ్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీటాధిపతులు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్తాపక అధ్యక్షులు శ్రీ ఎల్.వీ.గంగాధర శాస్త్రి గారు మరియు సముద్రాల వేణుగోపాల చారి గారు, అంబర్ పేట్ శాసనసభ్యులు జి.కిషన్ రెడ్డి గారు, లయన్ విజయ్ కుమార్ గారు … మరియు గీతాభిమానులు.
 
 

GITA JAYANTHI – 2018

భగవద్గీతా ఫౌండేషన్’ గీతా జయంతి పర్వదినాన్ని డిసెంబర్ 18 న వైభవం గా నిర్వహించింది.. ఇందులో భాగం గా హైదరాబాద్, హిమాయత్ నగర్ లోని బాలాజీ భవన్ నుండి వందలాది మంది విద్యార్థులు, భగవద్గీత అభిమానులు, అనుచరులతో ‘గీతా రథ యాత్ర’ ప్రారంభమై రామకృష్ణా మఠం వరకూ భగవద్గీతా పారాయణం తో… గీతా సూక్తుల నినాదాలతో సాగింది.. గీతా రథం లో శ్రీకృష్ణార్జునులు కొలువై ఉండగా … గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగాధర శాస్త్రి గానం చేసిన భగవద్గీతా గానం సౌండ్ సిస్టం లో వినిపిస్తుండగా … ఈ రథ యాత్ర ఆధ్యాత్మిక వైభవం గా సాగింది.. అనంతరం రామకృష్ణా మఠం లో గోపూజ నిర్వహించి అటు పై.. వివేకానంద హాల్ లో గీతా జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి… సంస్థ ఉపాధ్యక్షులు శ్రీ బి కే శర్మ దంపతులు శ్రీ కృష్ణార్చన లో పాల్గొన్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కూచిపూడి నర్తకీమణి ‘పద్మశ్రీ’ శోభానాయుడు ఆధ్యాత్మిక పారవశ్యం తో శ్రీ కృష్ణ నృత్యాంజలి చేశారు.. శ్రీ. గంగాధర శాస్త్రి స్వాగత ఉపన్యాసం చేస్తూ, నిత్య జీవితం లో భగవద్గీత పఠన ఆవశ్యకత ను స్ఫూర్తి దాయకం గా వివరిస్తూ , కృష్ణ గీతాలను ఆలపిస్తూ .. భగవద్గీతా ఫౌండేషన్ ప్రగతి నివేదన చేశారు. శ్రీ శ్రీ శ్రీ అవధూత గిరి మహారాజ్ , శ్రీ స్వామి శితి కంఠానంద ఆశీస్సులు అందజేశారు.. ఈ సందర్భం గా భగవద్గీతా ఫౌండేషన్ శ్రీ ఓగేటి కృపాలు కు ‘గీతాచార్య ‘ పురస్కారం, చిII కల్యాణరామ స్వరూప్ కు ‘పార్థ’ పురస్కారం కు అందజేసింది. ప్రస్తుతం భగవద్గీతా ఫౌండేషన్ రూపొందిస్తున్న ఆంగ్ల భగవద్గీత పోస్టర్ ను ఎక్స్ జాయింట్ డైరెక్టర్ సిబిఐ శ్రీ వి వి లక్ష్మీ నారాయణ ఆవిష్కరించారు. రిటైర్డ్ డీజీపీ శ్రీ కరణం అరవిందరావు భగవద్గీత సిద్ధాంతాన్ని వివరించారు. పురస్కారాల కమిటీ అధ్యక్షులు డా II ఆర్ వి ఎస్ ఎస్ అవధానులు ఆశీస్సులు అందించారు. కార్యక్రమానికి విచ్చేసిన భగవద్గీతాభిమానులతో గంగాధర శాస్త్రి చేయించిన కృష్ణ భజన తో గీతా జయంతి వేడుకలు ఘనం గా ముగిశాయ
 

BHAGAVADGITA PADA YATRA 2015

GITA GANA YAGNAM – KANSAS City