Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

‘తేజస్విని కల్చరల్ అసోసియేషన్’ సినారే 93 వ జన్మదినోత్సవం సందర్భం గా హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో (23.7.2024)ఏర్పాటు చేసిన కార్యక్రమం లో గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి…

“తెలుగు భాష అభ్యున్నతికే తన జీవితాన్ని అంకితం చేసి, తన రచనల ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చి, తన స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేనంత శిఖర స్థాయి లో అక్షరానికి సేవలందించిన మహాకవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఆచార్య డాII సి. నారాయణ రెడ్డి గారు… ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమను పంచేదే తల్లి అయితే – జ్ఞాన దృష్టి తో చూడగలిగితే అటువంటి తల్లులు ప్రకృతి నిండా ఉన్నాయని చెబుతూ అందుకు ఉదాహరణగా – కణ కణ లాడే ఎండకు శిరసుమాడినా మనకు తన నీడను అందించే చేట్టే అమ్మ / చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ … అంటూ ‘ప్రేమించు’ సినిమాకి పాట రాస్తూ అమ్మ విలువ తెలియజేశార” ని గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి అన్నారు. ‘తేజస్విని కల్చరల్ అసోసియేషన్’ సినారే 93 వ జన్మదినోత్సవం సందర్భం గా హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో (23.7.2024)ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొని ఆయన గాన ప్రసంగం చేశారు. సినారే రాసిన ఖండ కావ్యాలు, తెలుగు గజళ్ళు, ద్విపదలు, ప్రపంచపదులు, సినిమా పాటలు, లలిత గీతాలతో సమాజం పైన ‘ఎన్ని యుగాలైనా ఇగిరిపోని గంధం’ లాంటి పరిమళాలు జల్లిన మహాకవి సినారె – అని అన్నారు. ఆయనను ఈనాటి కవులు స్ఫూర్తి గా తీసుకోవాలని, ధనం సంపాదించుకునే అవకాశం ఉన్నా ద్వంద్వార్థాల సాహిత్యం జోలికి ఎన్నడూ పోని, ధర్మం తెలిసిన నిష్కామ కర్మయోగి అని, విలువలతో కూడిన, స్ఫూర్తిదాయకమైన జీవితం గడిపారని అన్నారు. సినారే ఎంతటి కవో అంతటి సంగీతజ్ఞుడు కూడా అన్నారు. కాబట్టి ఆయన పేరుతో శ్రీ ఓలేటి పార్వతీశం కు, శ్రీమతి ఎం. ఎం. శ్రీలేఖకు అవార్డు ఇవ్వడం సముచితమని అందుకు సంస్థ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ సుధాకర్ ను హృదయపూర్వకం గా అభినందిస్తున్నాననీ గంగాధర శాస్త్రి అన్నారు. భారత దేశం లో ఏ మహిళా సంగీత దర్శకురాలూ చేయనివిధం గా 80 సినిమాలకు పైగా సంగీతం అందించిన ఎం. ఎం. శ్రీలేఖ పద్మశ్రీ పురస్కారానికి అర్హురాలని ఆయన అన్నారు. సంగీత దర్శకురాలిగా ఆమె, నేపధ్య గాయకుడిగా తాను ‘నాన్నగారు’ చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యామని గంగాధర శాస్త్రి అన్నారు.

“శ్రీకృష్ణ పరమాత్మ దైవానుగ్రహానికి నిదర్శనం … అర్జునుడు పురుష ప్రయత్నానికి నిర్వచనం … పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే అఖండ విజయమే…

“శ్రీకృష్ణ పరమాత్మ దైవానుగ్రహానికి నిదర్శనం … అర్జునుడు పురుష ప్రయత్నానికి నిర్వచనం … పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే అఖండ విజయమే… ఇదే భగవద్గీతా ఆచరణ ఫలితం …! ఇస్తే వద్దన్న వాడు శ్రీరాముడు… నాకివ్వమని అడిగిన వాడు శ్రీకృష్ణుడు… యత్కరోషి యదశ్నాసి (9-27) అంటూ నువ్వు చేసే కర్మము, తినే ఆహారము, హోమము చేసే హవ్యము, అర్పించే దానము ఆచరించే తపస్సు, సర్వ కర్మల ఫలితం నాకే సమర్పిస్తే మోక్షం పేరుతో నన్నే చేరతావు.. అంటాడు కృష్ణ పరమాత్మ .. ఇక్కడ అడగడం అంటే ఆయనకు అవసరమై కాదు. మనలోని అహంకారాన్ని దునుమాడి మోక్షం ఇవ్వడానికి !!! వామనుడు బలిచక్రవర్తి అహంకారాన్ని అడిగాడు … మోక్షం ఇవ్వడానికి … అలాగే శ్రీకృష్ణుడు సమస్త కర్మఫలాన్ని తనకు సమర్పించమని అడుగుతాడు ఇదీ మోక్షం ఇవ్వడానికే… !!! ” అన్నారు గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డా II ఎల్ వి గంగాధర శాస్త్రి..

గురుపౌర్ణమి సందర్భం గా (21.7. 2024) మణికొండ (హైదరాబాద్) లోని కోదండ రామస్వామి దేవాలయం లో ‘గీతా సద్గురు’ శ్రీమాన్ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యం లో జరిగిన గీతా సత్సంగం లో గంగాధర శాస్త్రి పాల్గొని నిత్య జీవితం లో భగవద్గీత ఆవశ్యకతపై గాన ప్రవచనం చేశారు. గీత మతాలకు అతీతమైన గ్రంథమని, ఇది మత గ్రంథం కాదనీ, మానవీయ గ్రంథమనీ ఆయన అన్నారు. గీతను బాల్య దశ నుండే నేర్పించాలని, భగవద్గీతను చదివి అర్ధం చేసుకుని, ఆచరించి, ప్రచారం చేస్తే స్వార్ధ రహిత ఉత్తమ సమాజాన్ని చూడవచ్చని అన్నారు. “ఇది ధర్మ ప్రబోధ గీత, కర్తవ్య బోధ, వ్యక్తిత్వ వికాస గ్రంథం, నైతిక విలువలను పెంపొందించే ఉపదేశం…. సర్వమానవులకు ఆశాదీపం… సాధకులకు కల్పవృక్షం … గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే … తల్లి తండ్రులారా … బాల్యదశనుంచే మీ పిల్లలకు ఆధ్యాత్మికతను పరిచయం చేయండి.రామాయణ, మహాభారతాలు వారికి పరిచయం చేయండి. ఇవి వారికి కొండంత మానసిక స్థైర్యాన్నిస్తాయి. నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి.ఇవాళ సోషల్ మీడియా లో కనిపించే అనేక అనారోగ్యకరమైన వీడియోలకు, ఆ వీడియోల కింద సంస్కారం లేని కామెంట్లకు కారణం … వారి తల్లితండ్రులు విలువలు చెప్పి పెంచకపోవడమే… జీవితం కేవలం ధనార్జకోసమే అన్నట్టు గడుపరాదు… డబ్బు సుఖాన్నిస్తుంది కానీ శాంతినివ్వదు. సత్కర్మ, దుష్కర్మ, పాపం,పుణ్యం, ధర్మo,అధర్మం, దైవం, మోక్షం, జ్ఞానం, అజ్ఞానం, ఇంద్రియాల వ్యాపారం, త్రిగుణాలు, యజ్ఞం, దానం, తపస్సు, ధ్యానం, యోగం… ఇలాంటి పదాలన్నిటి అర్ధాలను బాల్యదశనుండే పిల్లలకు చెప్పండి… ముఖ్యం గా ఈ బాధ్యత తల్లులదే.. ఎందుకంటే బిడ్డకి తల్లే మొదటి గురువు కాబట్టి…. కేనోపనిషత్తు చెప్పినట్టు – న చేదిహావేదీన్మహతీ వినష్టిః … ఏది ఈ జన్మలో తెలుసుకొనకపోతే గొప్ప నష్టం జరుగుతుందో అదే ఉపనిషత్తు వివరిస్తుంది … ఆ సర్వోపనిషత్తుల సారమే భగవద్గీత …! ” అన్నారు గంగాధర శాస్త్రి. భారత దేశం లో హిందువులు 85 శాతం ఉన్నప్పటికీ వారిలోని హిందుత్వం బలం గా లేకపోవడం దురదృష్టం అని అన్నారు. క్రైస్తవ పాఠశాలల్లో బైబిల్ నేర్పుతున్నప్పుడు… హిందువులు స్థాపించే విద్యాలయాలలో భగవద్గీత ను నేర్పించక పోవడం అత్యంత దురదృష్టం అన్నారు. హిందువులలో బలమైన ఐక్యత ఉండివుంటె ఈ పాటికే గీత జాతీయ గ్రంథం అయ్యుండేదని, ప్రతి పాఠశాలలోనూ పాఠ్యాంశం గా అయ్యుండేదని గంగాధర శాస్త్రి అన్నారు. ప్రతి హిందువూ గీతా ప్రచారకులు కావాలని పిలుపునిచ్చారు.

కేంద్ర బొగ్గు గనుల శాఖామంత్రి గా నియమితులైన సందర్భం గా శ్రీ జి. కిషన్ రెడ్డి ని – గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ అధ్యక్షులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి, శ్రీ ఆజాద్ బాబు తో మర్యాదపూర్వకం గా కలిసి అభినందించారు.

కేంద్ర బొగ్గు గనుల శాఖామంత్రి గా నియమితులైన సందర్భం గా శ్రీ జి. కిషన్ రెడ్డి ని – గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ అధ్యక్షులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి, శ్రీ ఆజాద్ బాబు తో మర్యాదపూర్వకం గా కలిసి అభినందించారు. భగవద్గీత ను ప్రపంచవ్యాప్తం గా గాన ప్రవచనాల రూపం లో విస్తృత ప్రచారం చేస్తున్నందుకు శ్రీ కిషన్ రెడ్డి శ్రీ గంగాధర శాస్త్రి కి అభినందనలు తెలియ జేశారు. భగవద్గీతా ఫౌండేషన్ అనేక భాషలలోకి భగవద్గీతను గాన పద్ధతి లో రికార్డు చేసి ప్రచారం చేసే ప్రాజెక్టులకు భారత ప్రభుత్వం తరఫున సహకారం అందేలా చూడాలని గంగాధర శాస్త్రి కిషన్ రెడ్డి ని కోరగా, తప్పకుండా తనవంతు సహకారం ఉంటుందని కిషన్ రెడ్డి అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ, ధర్మాదాయ శాఖ సలహాదారులు శ్రీమాన్ జ్వాలాపురం శీకాంత్ – హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ ను (16.5. 2024) సందర్శించారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ, ధర్మాదాయ శాఖ సలహాదారులు శ్రీమాన్ జ్వాలాపురం శీకాంత్ – హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ ను (16.5. 2024) సందర్శించారు. గీతా గాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌంయేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకేసీ చీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలిసి శ్రీకాంత్ కు స్వాగతం పలికి సత్కరించారు. భగవద్గీతా ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాల తో రూపొందించిన లఘు చిత్రాన్ని శ్రీ శ్రీ కాంత్ వీక్షించారు. అటు పై సంస్కృత పండితుల పరిష్కరణ లో, ప్రామాణిక స్థాయిలో, తెలుగు తాత్పర్యం తో రూపొందిన, భారత దేశపు మొట్టమొదటి సంగీతభరిత సంపూర్ణ భగవద్గీత ను ఉభయ తెలుగు రాష్ట్రాలలోని దేవాలయాలన్నింటిలోనూ ప్రదర్శించే విషయమై చర్చించారు. ఇటీవల కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం పొందినందుకు శ్రీ గంగాధర శాస్త్రిని అభినందిస్తూ – ప్రపంచం లో – భగవద్గీతను ఆరాధించే ప్రతి ఒక్కరికీ ఆయా భాషల్లో తాత్పర్యాలతో రికార్డు చేసి విశ్వవ్యాప్తం చేసే విషయమై, ఫౌండేషన్ లక్ష్యాలను ముందుకు తీసుకు వెళ్లే విషయమై సుదీర్ఘం గా చర్చించి, సంగీత భరిత సంపూర్ణ భగవద్గీతా వ్యాప్తికి దేవాదాయ శాఖ తరఫున కృషి చేస్తానని శ్రీ శ్రీకాంత్ అన్నారు.

‘విశ్వశాంతి’ ని, శ్రేయస్సునూ కాంక్షిస్తూ – భగవద్గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేస్తున్న ఆస్ట్రేలియా-భగవద్గీతా ప్రచార యాత్ర లో భాగం గా ముగింపు కార్యక్రమాన్ని – మెల్బోర్న్ లోని TAAI (ఆస్ట్రేలియా తెలుగు సంఘం) సంస్థ అత్యంత వైభవం గా, ప్రేక్షకులు చిరకాలం గుర్తుంచుకునే విధం గా ( 6.4.2024-మౌంట్ వేవర్లీ కమ్మ్యూనిటీ సెంటర్ )నిర్వహించింది.

‘విశ్వశాంతి’ ని, శ్రేయస్సునూ కాంక్షిస్తూ – భగవద్గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేస్తున్న ఆస్ట్రేలియా-భగవద్గీతా ప్రచార యాత్ర లో భాగం గా ముగింపు కార్యక్రమాన్ని – మెల్బోర్న్ లోని TAAI (ఆస్ట్రేలియా తెలుగు సంఘం) సంస్థ అత్యంత వైభవం గా, ప్రేక్షకులు చిరకాలం గుర్తుంచుకునే విధం గా ( 6.4.2024-మౌంట్ వేవర్లీ కమ్మ్యూనిటీ సెంటర్ )నిర్వహించింది. సంస్థ అధ్యక్షులు శ్రీ చక్రి చయనం, ఉపాధ్యక్షులు శ్రీమతి కృష్ణ బేతనభట్ల, కోశాధికారి శ్రీ హేమంత్, సహ కార్యదర్శి శ్రీ హరి దేవరకొండ, శ్రీ రామ్ వెలవర్తిపాటి తదితర సభ్యులు శ్రీ గంగాధర శాస్త్రి ని పూర్ణకుంభo తో స్వాగతించారు. అనంతరం సాగిన శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం లో – భగవద్గీతను మతగ్రంథం గా కాక మానవీయ గ్రంథం గా చూడాలన్నారు. ‘ఇది ఉత్తమ జీవన విధాన మార్గం. ఉన్నతమైన వ్యక్తిత్వవికాస గ్రంథం. దీనిని వైరాగ్య గ్రంథం లాగా చూసేవారు ఇప్పటికీ ఉన్నారు. అదే నిజమైతే కృష్ణ పరమాత్మ చేసినబోధ విని అర్జునుడు యుద్ధం చేసి విజయం సాధించేవాడు కాద’ని అన్నారు గంగాధర శాస్త్రి. అర్జునునికి స్ఫూర్తినిచ్చి విజయపథం వైపు నడిపించిన కృష్ణుని బోధ మనల్ని నడిపించదా అని ప్రశ్నించారు. ‘న మే ద్వేష్యో స్తి న ప్రియః’ అంటూ తనకు ప్రియుడు కానీ అప్రియుడు కానీ ఎవ్వరూ లేరని, ఎవరు ధర్మవర్తనులవుతారో వారితో ఉంటానని కృష్ణ పరమాత్మ చెబుతాడని గంగాధర శాస్త్రి అన్నారు. ప్రతి ఒక్కరూ గీత చదివి పిల్లలచేత కూడా చదివించాలని అన్నారు. కృష్ణుడు అర్జునునికి నిర్బంధించినట్టు గా గీత చెప్పలేదని – ‘యథేచ్ఛసి తథా కురు’ అంటూ -‘బాగా ఆలోచించుకుని నీకు ఎలా ఇష్టమైతే ఆలా ఆచరించు’ అంటూ స్వేచ్ఛ నిస్తూ చెప్పాడని గంగాధర శాస్త్రి అన్నారు. వ్యక్తిత్వ వికాసానికి గీత కు మించిన గ్రంథం లేదని, ఇంటింటా గీతా జ్యోతులు వెలగాలన్నది తమ భగవద్గీతా ఫౌండేషన్ అభిలాష అనీ అన్నారు. మతాలు ఆవిర్భవించని కాలం లో బోధించిన గీతను మత గ్రంథ మని, అది బోధించిన భగవానుడైన శ్రీకృష్ణుని హిందూ మతస్థుడని అనడం అర్థరహితమని అన్నారు. గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే నన్నారు. పాశ్చాత్యులు సైతం ప్రశంసించిన గీతను హిందువులే నిర్లక్ష్యం చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. కార్యక్రమం చివరన గంగాధర శాస్త్రి అందరి చేతా కృష్ణ భజన చేయించారు. ప్రపంచం లోని వివిధ భాషల్లోకి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీతను రికార్డు చేసి విడుదల చేసేందుకు చేయూతను కోరారు. మెల్బోర్న్ లో తన గీతా ప్రవచనాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన శ్రీ చక్రి చయనం, ఇతర సభ్యులను హృదయపూర్వక కృతజ్ఞతలతో అభినందించారు. శ్రీమతి లక్ష్మి ఆధ్వర్యం లో చిన్నారులు భగవద్గీత లోని రెండవ అధ్యాయం శ్లోకాలను పఠించగా వారి ఉచ్చారణను శ్రీ గంగాధర శాస్త్రి అభినందించారు. ఈ సందర్భం గా ‘తత్వం యోగశాల’ వారి చిహ్నాన్ని గంగాధర శాస్త్రి ఆవిష్కరించారు. శ్రీ రామ్ వేల్ తమ ‘అసెట్ పాయింట్స్’ సంస్థ తరఫున శ్రీ గంగాధర శాస్త్రి ని సత్కరించారు. ఆస్ట్రేలియా తెలుగు సంఘం మరియు ‘దేవా’ సంస్థ సంయుక్తం గా శ్రీ గంగాధర శాస్త్రిని ‘గీతా గాన ప్రవచన కౌస్తుభ’ బిరుదు తో ఘనం గా సత్కరించారు. కార్యక్రమ ప్రారంభం లో శ్రీమతి హర్షవర్ధని పాడిన ప్రార్ధన గీతాన్ని, అటుపై ‘ముద్దుగారే యశోద’ కీర్తనను అభినయించిన శ్రీమతి రూపా ప్రవీణ్, చిII రేయా లను గంగాధర శాస్త్రి అభినందించారు. ఆస్ట్రేలియా భగవద్గీత ప్రచార యాత్ర ను అత్యంత సమర్ధవంతం గా నిర్వహించిన శ్రీ పవన్ వఝలను శ్రీ గంగాధర శాస్త్రి కృతజ్ఞతలు చెబుతూ సత్కరించారు.

‘విశ్వశాంతి’ ని కాంక్షిస్తూ ‘భగవద్గీతా గాన ప్రచార శంఖారావం’ పేరుతో – భగవద్గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేస్తున్న ఆస్ట్రేలియా పర్యటనలో భాగం గా మూడవ కార్యక్రమం – బ్రిస్బేన్ లోని, ‘తెలుగు లహరి’ సంస్థ ఆధ్వర్యం లో అద్వితీయం గా జరిగింది.

‘విశ్వశాంతి’ ని కాంక్షిస్తూ ‘భగవద్గీతా గాన ప్రచార శంఖారావం’ పేరుతో – భగవద్గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేస్తున్న ఆస్ట్రేలియా పర్యటనలో భాగం గా మూడవ కార్యక్రమం – బ్రిస్బేన్ లోని, ‘తెలుగు లహరి’ సంస్థ ఆధ్వర్యం లో అద్వితీయం గా జరిగింది. గత రెండు దశాబ్దాల కాలం లో బ్రిస్బేన్ లో జరిగిన కార్యక్రమాలలో ఇటువంటి స్ఫూర్తి దాయకమైన గీతా ప్రవచనాన్ని, ప్రేక్షకుల విశేష స్పందన ని తాము చూడలేదని శ్రీ ప్రభాకర్ బచ్చు, శ్రీ హరి పంచుమర్తి తదితరులు పేర్కొన్నారు. “భగవద్గీతను అర్ధం చేసుకుని ఆచరించడం ద్వారా ఇతరులకు స్ఫూర్తిదాయకo గా నిలబడే స్థాయికి ఎదగ వచ్చు. మతాలు ఆవిర్భవించని కాలం లో సర్వదేశాలకు, సర్వ కాలాలకు, సర్వ జాతులకు వర్తించే విధం గా జగత్తులోని ప్రతి మానవుడిని ఉద్దేశించి మహోదాత్త మైన కర్తవ్యోపదేశo చేయడం ద్వారా శ్రీకృష్ణుడు జగద్గురువయ్యాడు. భగవద్గీత వృద్ధాప్యపు కాలక్షేపం కాదు. జీవిత ప్రారంభ దశలోనే చదివి అర్ధంచేసుకోవలసిన పాఠం. అందుచేత తల్లి తండ్రులు పిల్లలకు బాల్యదశనుంచే దీనిని నేర్పించాలి. ఇందువల్ల నైతిక విలువలు కలిగిన ఉత్తమ జీవితం గడపవచ్చు. మనం చేసే సత్కర్మల ద్వారా ఇతరులకు స్ఫూర్తిని అందించవచ్చు. ‘కర్మాచరణలో నైపుణ్యమే యోగం’ అని తెలుసుకోవడం ద్వారా సృజనాత్మకం గా పనులు చేసి ప్రపంచం చేత అభినందనలు పొందవచ్చు. మరణించిన తర్వాతకూడా ప్రజల హృదయాలలో జీవించే పనులు చేయవచ్చు. సుఖదుఃఖాల లో స్థితః ప్రజ్ఞతను సాధించవచ్చు. కర్మ ఫలితాన్ని భగవదర్పణం చేయడం ద్వారా ప్రశాంత జీవితాన్ని సాధించవచ్చు. మానసిక వత్తిడి లేని జీవితాన్ని గడపవచ్చు. ఏ ప్రాణి పట్ల ద్వేషభావాన్ని కలుగని సమభావనను అలవరచుకోవచ్చు. ఆత్మహత్యల ఆలోచన లేని జీవితం గడపవచ్చు. తెలిసిన తెలియకపోయినా ప్రకృతి శక్తుల ప్రభావం మనమీద కనిపించినట్టే, తెలియకుండా చదివినా భగవద్గీత అనిర్వచనీయమైన ఆనందాన్ని,శక్తిని ఇస్తుంది.” అన్నారు శ్రీ గంగాధర శాస్త్రి. మాతృ భాషను, మాతృ భూమిని, మాతృ సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగు భాష గొప్పదనాన్ని వివరించారు. శ్లోకాలద్వారా సంస్కృతాన్ని, పద్యాలద్వారా తెలుగు భాషా మాధుర్యాన్ని పిల్లలకు తెలియజేయాలన్నారు. ‘విశ్వరూప సందర్శన యోగం’ లోని కొన్ని శ్లోకాలను కళ్ళకు కట్టినట్టు తాత్పర్య సహితం గా గానం చేసి ప్రేక్షక శ్రోతలలో ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపారు. ఈ సందర్భం గా తెలుగు సంస్కృతి, బ్రిస్బేన్ వెబ్సైటు ను శ్రీ గంగాధర శాస్త్రి చేత ప్రారంభింపజేశారు. ఈ కార్యక్రమ నిర్వహణలో సహకరించిన క్వీన్స్ ల్యాండ్ తెలుగు అసోసియేషన్, షిర్డీసాయి సంస్థాన్, తెలంగాణా అసోసియేషన్ అఫ్ క్వీన్స్ ల్యాండ్, పలక- బలపం సంస్థలకు గంగాధర శాస్త్రి అభినందనాపూర్వక ఆశీస్సులందించారు. శ్రీమతి పద్మప్రియ నోరి తెలుగులో చేసిన సుమధురమైన వ్యాఖ్యానాన్ని, శ్రీమతి సుస్మితా రవి, శ్రీమతి రేణుక కరణం, చిరంజీవులు తియాన్సిక, యుక్త ల నాట్యకౌశలాన్ని అభినందిస్తూ, శ్రీ శ్రీధర్ పోపూరి, శ్రీమతి జ్యోత్స్న ల ఆతిధ్యానికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈపర్యటన ను దేవా (DEVAA – DHARMA ENLIGHTENMENT VEDIC ASSOCIATION OF AUSTRALIA) సంస్థ వ్యవస్థాపకులు శ్రీమాన్ పవన్ వఝల అత్యంత సమర్ధవంతం గా నిర్వహించినందుకు గంగాధర శాస్త్రి కృతజ్ఞతాభినందనలు తెలిపారు.

‘విశ్వశాంతి’ ని కాంక్షిస్తూ ‘భగవద్గీతా గాన ప్రచార శంఖారావం….

‘విశ్వశాంతి’ ని కాంక్షిస్తూ ‘భగవద్గీతా గాన ప్రచార శంఖారావం’ పేరుతో – భగవద్గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఇటీవలే భారత రాష్ట్రపతి చేతుల మీదుగా సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ఆస్ట్రేలియా దేశం లో పర్యటిస్తున్నారు. ఆయన తొలి గీతా ప్రవచన కార్యక్రమo సిడ్నీ లోని పెనెంట్ హిల్స్ కమ్యూనిటీ సెంటర్ లో (24.3.2024) అత్యంత వైభవం గా ఏర్పాటు కాగా ఇతరప్రాంతాలనుంచి కూడా అనేకమంది భగవద్గీతాభిమానులు విశేషం గా తరలివచ్చి కార్యక్రమానికి ఘనవిజయం చేకూర్చారు. ఆస్ట్రేలియా లోని సాంస్కృతిక సంస్థలన్నిటినీ ఏకీకృతం చేసి ‘దేవా ( DEVAA-DHARMA ENLIGHTENMENT VEDIC ASSOCIATION OF AUSTRALIA) అనే సంస్థను స్థాపించి, శ్రీ గంగాధర శాస్త్రి చేతులమీదుగా ప్రారంభింపజేస్తూ తొలి కార్యక్రమం గా గీతా గాన ప్రవచనాన్ని ఏర్పాటుచేశారు. శ్రీమాన్ పవన్ వఝల సారధ్యం లో శ్రీ సాయి పరవస్తు, శ్రీ రవి మిరియాల, శ్రీ రామ్ వేల్, శ్రీ జగదీష్ హరిదాసు, శ్రీ కిశోర్ రంగా, శ్రీ మురహరి గాజుల, శ్రీ అనంతసాయి పరస, శ్రీ జయపాల్ కదిరి, శ్రీ వాణి మోటమర్రి, శ్రీ సాయి గొల్లపూడి, శ్రీ మల్లిక్ రాచకొండ, శ్రీ శ్రీనివాస్ పల్లపోతు తదితరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆస్ట్రేలియా లో భగవద్గీతను బోధించే గురువులు తయారవ్వాలని, సర్వ శాస్త్రమయి అయిన భగవద్గీత పట్ల, సనాతన ధర్మం పట్ల పిల్లలందరికీ అవగాహన కల్పించాలని, మాతృభాషను, మాతృసంస్కృతిని కాపాడుకుంటూ, దీనిని తరువాత తరాలకు వారసత్వసంపదగా అందించే బాధ్యతను తెలుగువారందరూ స్వీకరించాలని, ఏ దేశం వెళ్లినా తమ మతాన్ని, సంస్కృతిని, వేషభాషలను కాపాడుకునే ముస్లింలు, సిక్ఖులు, క్రైస్తవులను చూసి హిందువులు మేల్కోవాలని, అందరిలో కలిసిపోయే ప్రయత్నం లో మన ఉనికిని కోల్పోవాల్సిన అవసరం లేదని గంగాధర శాస్త్రి అన్నారు. జ్ఞానం అంటే ఏమిటో మిగతా ప్రపంచానికి తెలియని వేల సంవత్సరాల క్రితమే జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ సర్వమానవాళి కోసం భగవద్గీత బోధించాడని, ఇది దేశ కాల జాత్యాదులకు అతీతమైన కర్తవ్య బోధ అని చెబుతూ – మన పిల్లలకు మన ధర్మం పట్ల అవగాహన కల్పించక పోవడం వల్లనే కన్వర్షన్స్ జరుగుతున్నాయని గంగాధర శాస్త్రి అన్నారు. గీత లోని అతి ముఖ్యమైన శ్లోకాలను దైనందిన జీవితానికి అన్వయించుకుని ఆచరిస్తే సత్పలితాలను పొందవచ్చని, భగవద్గీత వృద్ధాప్యపు కాలక్షేపం కాదని, బాల్యదశ నుంచే దీనిని అభ్యసిస్తే, మానసిక వత్తిడి లేని, స్వార్ధరహిత, ఆనందకరమైన ఉత్తమ జీవితాన్ని గడపవచ్చని గంగాధర శాస్త్రి అన్నారు. ఆయన విశ్వరూప సందర్శన యోగం లోని శ్లోకాలు తాత్పర్య సహితం గా, కళ్ళకు కట్టినట్టు గా, గానం చేస్తుంటే ప్రేక్షకులు భక్తి ఆర్ద్రతలతో , చెమర్చిన కళ్ళతో , లేచి నిలబడి కరతాళధ్వనులు సలిపారు. ఆయన తో పాటు భక్తి పారవశ్యం తో కృష్ణ భజన చేశారు.ఈ కార్యక్రమం లో తెలుగు, ఆంగ్ల భాషలలో కమనీయమైన వ్యాఖ్యానాన్ని అందించిన శ్రీమతి అర్చనను, స్వాగత నృత్యం తో ఆకట్టుకున్న శ్రీమతి నేహా మనోజ్ లను గంగాధర శాస్త్రి అభినందించారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించడమే కాక తనకు భక్తిపూర్వకంగా ఆతిధ్యాన్ని ఇచ్చిన శ్రీ పవన్ వఝల, శ్రీమతి హరిత దంపతులకు శ్రీ గంగాధర శాస్త్రి కృతజ్ఞతలతో ఆశీస్సులు అందించారు. శ్రీ గంగాధర శాస్త్రి గారి గీతా ప్రవచన స్ఫూర్తి తో ‘భగవద్గీతా ఫౌండేషన్’ ఆస్ట్రేలియా శాఖను త్వరలో స్థాపించి ఉద్యమ స్థాయిలో భగవద్గీతను ప్రచారం చేస్తామని దేవా సంస్థ సభ్యులు ప్రేక్షకుల కరతాళధ్వనులు మధ్య ప్రకటించారు. ఈ సందర్భం గా హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా తెలంగాణ స్టేట్ అసోసియేషన్, సిడ్నీ తెలుగు అసోసియేషన్, వేద గాయత్రి పరిషత్ మరియు జెట్ సభ్యులు శ్రీ గంగాధర శాస్త్రి ని సత్కరించారు.

‘ఈ రోజు నాజీవితం మహదానందకరమైన రోజు’ – శ్రీ ఎన్ వి రమణ(భారత సుప్రీమ్ కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి)

భారత సుప్రీమ్ కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్ వి రమణ తన ధర్మపత్ని, మనుమరాలితో – హైదరాబాద్ లోని ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయం లో (17.3.2024) కాసేపు ఆధ్యాత్మికం గా గడిపారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతాగాన, ప్రవచన, ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. శ్రీ రమణ దంపతులు శ్రీకృష్ణునికి తులసిమాల సమర్పించి భక్తిశ్రద్ధలతో పూర్వజాకార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ‘The Making of Bhagavadgita’ పేరుతో భగవద్గీతాఫౌండేషన్ రూపొందించిన లఘు చిత్రాన్ని శ్రీ రమణ వీక్షించి అమితానందపరవశుడై శ్రీ గంగాధర శాస్త్రిని ఆలింగనం చేసుకుని అభినందించారు. ఇటీవల రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ‘సంగీత నాటక అకాడమీ’ అవార్డు స్వీకరించిన సందర్భాన్ని కూడా ప్రస్తావిస్తూ శ్రీ గంగాధర శాస్త్రి ని అభినందించారు. అనంతరం ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలిసి శ్రీ గంగాధర శాస్త్రి శ్రీ రమణ దంపతులను దుశ్శాలువతో సత్కరించి తాము రూపొందించిన సంగీతభరిత సంపూర్ణ భగవద్గీత సి డి ప్యాక్ ను బహుమానం గా అందించి ఆశీస్సులందించారు. ఈ సందర్భం గా కరోనా సమయం లో స్వార్ధ రహితం గా వేలాదిమందికి ఉచిత వైద్య సేవలందించిన ప్రసిద్ధ వైద్యులు డాII రాజ్ కుమార్ ను, ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రసిద్ధ న్యాయవాది శ్రీ వై రామారావు దంపతులను, కొప్పరపు సోదర కవుల మనుమడు, ఆంధ్ర పత్రిక సంపాదకులు బ్రహ్మశ్రీ మా శర్మ ను – ‘భగవద్గీతా ఫౌండేషన్’ తరఫున శ్రీ ఎన్ వి రమణ సత్కరించారు. ఈ సందర్భం గా శ్రీ రమణ – ఫౌండేషన్ చేసిన, చేస్తున్న, చేపట్టబోతున్న కార్యక్రమాలను గురించి వివరం గా తెలుసుకున్నారు. ‘భగవద్గీతా ఫౌండేషన్’ చేపట్టిన ఈ కార్యక్రమాలు సమాజానికి ఎంతో స్ఫూర్తిని కలగజేస్తున్నాయని, స్వార్ధరహిత ఉత్తమసమాజనిర్మాణాన్నీ, ప్రపంచశాంతినీ కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తం గా శ్రీ గంగాధర శాస్త్రి చేస్తున్న ఈ నిస్వార్ధ గీతా ప్రచార సేవ లో, తానుకూడా భాగస్వామ్యం వహిస్తానని అన్నారు. ఈ సందర్భం గా శ్రీ గంగాధర శాస్త్రి శ్రీ ఎన్ వి రమణ మనుమరాలి చేత ఒక గీతా శ్లోకాన్ని చెప్పించగా – ఆమె వాక్స్పష్టతకు ముగ్ధుడైన గంగాధర శాస్త్రి ఆ చిన్నారికి అభినందనాపూర్వక ఆశీస్సులు అందించగా సభ్యులందరూ కారతాళధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. భగవద్గీత వృద్ధాప్యపు పాఠం కాదని, ఇలా బాల్యదశనుంచే నేర్పించవలసిన అత్యవసరమైన జీవిత పాఠమని, భగవద్గీతాఫౌండేషన్ లక్ష్యం కూడా గీతను బాలలకు, యువతకు చేర్చడమేనని శ్రీ గంగాధర శాస్త్రి అన్నారు. ‘ఈ రోజు నాజీవితం లో మరిచిపోలేని రోజు మహదానందకరమైన రోజు’ అంటూ శ్రీ ఎన్ వి రమణ – శ్రీ గంగాధర శాస్త్రి కి కృతజ్ఞతాపూర్వక నమస్సులు తెలియజేశారు. ఫౌండేషన్ సభ్యులు వారికి వీడ్కోలు పలికారు.

భారత రాష్ట్రపతి గౌII శ్రీమతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు-2023″ ను అందుకున్న గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

ప్రసిద్ధ గాయకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి – భారత రాష్ట్రపతి గౌII శ్రీమతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు-2023″ ను అందుకున్నారు. సంపూర్ణ భగవద్గీతలోని 700 శ్లోకాలను, స్వీయ సంగీతం లో, తాత్పర్య సహితం గా గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, లోకార్పణ చేసినందుకు ‘భారతీయ ప్రధాన సాంప్రదాయ సంగీత విభాగం లో ఆయనను ఈ అవార్డు తో భారత ప్రభుత్వం గౌరవించింది. ఈ కార్యక్రమం న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో మార్చ్ 6, 2024 న జరిగింది. గౌ II రాష్ట్రపతి తో పాటు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖామాత్యులు శ్రీ జి కిషన్ రెడ్డి, కేంద్ర చట్టము మరియు న్యాయ మంత్రిత్వ శాఖ, పార్లమెంట్ వ్యవహారాలు మరియు సాంస్కృతిక శాఖామాత్యులు శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, సంగీత నాటక అకాడమీ ఛైర్పర్సన్ శ్రీమతి సంధ్య పురేచ, కేంద్ర సాంస్కృతిక శాఖ సెక్రటరీ శ్రీ గోవింద్ మోహన్ లు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. కార్యక్రమానంతరం శ్రీ గంగాధర శాస్త్రి పాత్రికేయులతో మాట్లాడుతూ – ” గతం లో డా ఏ పి జె అబ్దుల్ కలాం గారికి నా భగవద్గీత వినిపించి ప్రశంసలు పొందడం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ‘కళారత్న’, మధ్యప్రదేశ్ లోని పాణిని యూనివర్సిటీ నుంచి ‘గౌరవ డాక్టరేట్’, ఇప్పుడు భారత రాష్ట్రపతి గౌ II శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ‘సంగీత నాటక అకాడమీ’ అవార్డు అందుకోవడం, అందునా నా తల్లితండ్రులు ఆరోగ్యం గా ఉన్నప్పుడే ఈ జాతీయ అవార్డు అందుకోవడం అసలైన ఆనందాన్నిస్తోంది. ఈ SNA అవార్డు నా ‘గీతా’ పరిశ్రమను గుర్తించి శ్రీ జి కిషన్ రెడ్డి గారు అందించినదిగా భావిస్తాను. జన్మనిచ్చిన తల్లితండ్రులకు, మాతృభూమికి, మాతృదేశానికి ఇంతకంటే తిరిగి ఏమివ్వగలను … ఈ అవార్డులూ ప్రశంసలూ అన్ని నా భగవద్గీతా మార్గానికే రావడం ఆత్మానందాన్ని కలగజేస్తోంది. ఇది ఏదీ నా ఒక్కడి ప్రతిభ కాదు. నేను నిమిత్తమాత్రుడిని.. అనుకోని నా గీతా ప్రయాణమంతా కృష్ణ పరమాత్ముని సంకల్పం.. నా తల్లి తండ్రుల తపఃఫలం..! అయితే నా పరమ లక్ష్యం మాత్రం అవార్డులు కాదు. – ‘ఇంటింటా గీతా జ్యోతులు వెలగాలి. ముఖ్యం గా ఈ దేశం లోని ప్రతి ఒక్క హిందువూ భగవద్గీత చదవాలి … అర్ధం చేసుకోవాలి… ఆచరించాలి… తరువాత తరాలకు అందించాలి.. తద్వారా సనాతన ధర్మాన్ని కాపాడాలి…! భారతీయ ఆధ్యాత్మికత దేశ కాల జాత్యాదులకు అతీతమైనది. కుల మత వర్గ లింగ విభేదాలకు తావులేనిది .. దీనిని ప్రపంచ వ్యాప్తం చేయడం ద్వారా స్వార్ధ రహిత ఉత్తమ సమాజాన్నీ, విశ్వ శాంతినీ సాధించవచ్చు.. అప్పుడే మాకు అసలైన ఆనందం. మా లాంటి ధర్మ ప్రచారకుల వ్యవస్థల గురించి తెలుసుకుని ప్రభుత్వాలు చేయూతనివ్వాలి. చేయూతకోసం మేము ప్రభుత్వాలను అర్ధించే పరిస్థితి ఉండరాదు. గీతను జాతీయ గ్రంథం గా ప్రకటించాలి. పాఠశాల ల్లో పాఠ్య అంశం గా భగవద్గీతను చేర్చాలి. అప్పుడే మనం మన దేశ అస్థిత్వాన్ని కాపాడుకున్నట్టు. భగవద్గీతను మతం అనే కోణం నుంచి చూడవద్దు. అలా ఐతే ఇంగ్లీషు నేర్చుకోవడం క్రైస్తవం అవుతుంది కదా…!. అందరినీ సమానం గా చూడమని చెప్పే ధర్మ మూర్తులు శ్రీరాముడు, శ్రీకృష్ణులకు జన్మనిచ్చిన భారత భూమిపై పుట్టినందుకు గర్వపడతాను.” అన్నారు గంగాధర శాస్త్రి. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఛైర్పర్సన్ శ్రీమతి సంధ్య పురేచా శ్రీ గంగాధర శాస్త్రిని దుశ్శాలువతో సత్కరిస్తూ – త్వరలో తమ అకాడమీ తరపున గీత ద్వారా ధర్మ ప్రచార కార్యక్రమాలను కూడా వేదికలపైన నిర్వహించబోతున్నట్టు చెబుతూ అందుకు గంగాధర శాస్త్రి సహకారాన్ని కోరారు.

గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త డా।। ఎల్ వి గంగాధర శాస్త్రి కి కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు….

ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డా II ఎల్ వి గంగాధర శాస్త్రి కి భారత దేశపు ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ’ అవార్డు లభించింది. 2023 సంవత్సరానికి గాను – ఇతర ప్రధాన సంప్రదాయ సంగీత విభాగం లో ఆయనకు ఈ ‘అకాడమీ పురస్కారం’ లభించింది. తాను అభ్యసించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతం తో – భారత దేశపు ఆధ్యాత్మిక సారమైన భగవద్గీత లోని 700 శ్లోకాలలో ఘంటసాల స్వరపరచి పాడిన 108 శ్లోకాలను ఆయన గౌరవార్థం యథాతథం గా పాడడం తో పాటు, మిగిలిన 594 శ్లోకాలను స్వీయ సంగీతం లో, తెలుగు తాత్పర్య సహితం గా గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, ‘భారతీయ గాయకుడి తొలి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత’ గా శ్రీ శ్రీ శ్రీ విశ్వేశ తీర్థ స్వామి, డాII ఏ పి జె అబ్దుల్ కలాం చేతులమీదుగా విడుదల చేసి, అంతటి తో తన బాధ్యత తీరిపోయిందని భావించకుండా, స్వార్ధ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసినందుకు గంగాధర శాస్త్రి కి ఈ అవార్డు దక్కింది. ఈ మహత్కార్యం చేసినందుకు గతం లో శ్రీ గంగాధర శాస్త్రి ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కళారత్న'(హంస) పురస్కారం తోను, మధ్యప్రదేశ్ లోని ‘మహర్షి పాణిని యూనివర్సిటీ’ ‘గౌరవ డాక్టరేట్’ తోను సత్కరించింది. కాగా ఇప్పుడీ అవార్డు ప్రకటించిన నేపధ్యం లో – ‘గీత’ పట్ల తన అంకిత భావాన్ని గత 16 సంవత్సరాలుగా గుర్తిస్తూ వచ్చిన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖామంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, అలాగే సంగీత నాటక అకాడమీ’ అకాడమీ చైర్మన్ డాII సంధ్య పురేచ కు, జ్యూరీ సభ్యులకు, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ కు గంగాధర శాస్త్రి కృతజ్ఞతలు తెలియజేసారు. ఇది తనకు తొలి జాతీయ అవార్డు అన్నారు. ఈ అవార్డు – పాట నేర్పిన తన తల్లి తండ్రులకు, ‘గీతా గాన మార్గదర్శి’ ఘంటసాల కు, గీతా సద్గురువులకు, శాస్త్రీయ సంగీతం నేర్పిన గురువులకు అంకితమన్నారు. ‘భగవద్గీత’ అంటే భారతదేశపు ఆలోచనా విధానమని, ఇది మతాలకు అతీతమైన, సర్వజనామోదయోగ్యమైన, ఆచరణీయమైన, అత్యుత్తమమైన కర్తవ్య బోధ అనీ, దీనిని ప్రతి ఒక్కరూ చదివి, అర్ధం చేసుకుని, ఆచరించడం ద్వారా స్వార్ధరహిత ఉత్తమ సమాజాన్ని ఏర్పరచవచ్చని, అందుకే తమ ‘భగవద్గీతా ఫౌండేషన్’ ద్వారా గీతా ప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేశానని గంగాధర శాస్త్రి అన్నారు. భగవద్గీతను జాతీయ గ్రంథం గా ప్రకటించడం ద్వారా ఈ దేశపు జ్ఞాన సంపదను గౌరవించాలని భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలనూ కోరుతున్నామని, గీతను పాఠ్యాంశం గా చేర్చి బాల్య దశ నుంచే పిల్లలకు నేర్పించడం ద్వారా, మానవీయ విలువలను పెంపొందించవచ్చని ఆయన అన్నారు. ఇప్పటికే అయోధ్యలో రామాలయ నిర్మాణం ద్వారా భారతీయుల ఆత్మ గౌరవాన్ని కాపాడినందుకు, పాఠ్య పుస్తకాల్లో మన దేశం పేరుని భారత్ గా మార్పుచేసి చరిత్ర ను కాపాడినందుకు కేంద్ర ప్రభుత్వానికి నమస్సులతో కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.