Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

రామాయణం మన జీవన పారాయణం..

రామాయణం మన జీవన పారాయణం..

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

'రామాయణం మన జీవన పారాయణం.. మానవ జాతికి జ్ఞాన మార్గాన్ని ఉపదేశించే మంత్రపుష్పం రామాయణం. ఉత్తమోత్తమమైన మానవ జీవిత మార్గదర్శక గ్రంథం రామాయణం ... సకల మానవాళిని ధర్మ మార్గం లో నడిపించే జ్ఞానజ్యోతి రామాయణం. నిజం గా బతకడమంటే మరణించాక కీర్తి కాయం తో బతకడమే అని ఆచరించి చెప్పిన తండ్రి రామయ్య తండ్రి. జీవితమంటే సుఖం గా బతకడం కాదు. ధర్మం గా బతకడమని తాను ఆచరించి చెప్పిన ధర్మ మూర్తి శ్రీరామ చంద్రుడు.కాబట్టే మారీచుడు అనే రాక్షసుడు సైతం 'రామోవిగ్రహవాన్ ధర్మః ' అని శ్రీరాముణ్ణి కొనియాడాడు. విశేషమైన ఫలితాలనిచ్చే గురు సేవ చేసిన వాడు శ్రీరాముడు. చిన్న చిన్న పాత్రలు కూడా గొప్ప గొప్ప సందేశాలను ఇచ్చే మహాద్భుతమైన మహాకావ్యం శ్రీ రామాయణం. ఆదర్శవంతమైన కుటుంబ వ్యవస్థను ఏర్పరుచుకోవాలంటే, ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ధైర్యం గా ఎదుర్కోవాలంటే... రామాయణం చదివి పిల్లలకు చెప్పండి. విశ్వామిత్రుడు గంగావతరణం శ్రీరామునికి చెప్పడానికి కారణం - తమ పూర్వికులు ఎంత గొప్పవారో తెలుసుకుని తదనుగుణం గా ప్రవర్తించమని చెప్పడమే. తన వనవాసం గురించి శ్రీరాముడు సీతకు చెప్పినప్పుడు - ' నేను మీ వెంటే వస్తాను. మీరు లేకుండా స్వర్గ సుఖాలు లభించినా ఇష్టపడను. పతిని అనుసరించడమే సతికి ధర్మం.' అన్నది సీతమ్మ. ఇది ఇవాళ్టికీ దంపతులకు శిరోధార్యం. చేసిన ప్రయత్నం విఫలమైనప్పుడు, సంపదలను పోగొట్టుకున్నప్పుడు అధైర్యపడకుండా మరల ప్రయత్నిస్తే ఫలితం ఉంది తీరుతుంది అని రామ కథ చెబుతుంది. చీటికీ మాటికీ ఆత్మహత్యల ఆలోచన చేసే మానసిక దుర్బలులకు రామాయణ మహాభారతాలు గొప్ప ఆత్మ స్థైర్యాన్నిస్తాయి.'వ్యక్తులు జీవించి ఉన్నంతవరకే వైరం.. ఆ తర్వాత దాన్ని వదిలివేయాలి.' అంటాడు శ్రీరాముడు - రావణుని దహన సంస్కారాలు నిర్వహించే విషయం లో విభీషణునికి చెబుతూ. అదీ రాముని ధర్మ తత్వం... ! ఇచ్చినపనిని సాధించడమే కాక, అసలుపనికి భంగం కలగకుండా దానికి అనుబంధంగా ఇతర కార్యాలను కూడా సాధించేవాడు ఉత్తమమైన సేవకుడు అని హనుమంతుడి పాత్ర చెబుతుంది. మోడీ అనే మహాత్ముడి వల్ల రామజన్మ భూమి వివాదాన్ని పరిష్కరించుకుని రామాలయ నిర్మాణం చేసుకోగలుగుతున్నాం. ఇక మిగిలింది రామరాజ్య స్థాపన. ఇందుకు ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా సహకరించాలి. అందుకోసం స్వార్ధం విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరూ స్వకళ్యాణం కోసం కాక లోకకల్యాణం కోసం ఆలోచించాలి. ' జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ..' అనే రామ వాక్యాన్ని పాటించి ప్రతిఒక్కరూ దేశభక్తులు కావాలి. భారతo లో భగవద్గీత రామాయణo లో సుందరకాండ అత్యంత శక్తివంతమైనవి. ఆపదలు కలిగినప్పుడు 'ఆపదామపహర్తారం...' శ్లోకాన్ని, సర్వకార్యసిద్ధికి 'సర్వధర్మాన్ పరిత్యజ్య" శ్లోకాన్ని పఠించండి. దైవం ధర్మజ్ఞులను మాత్రమే కరుణిస్తాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చైత్ర శుద్ధ నవమి శ్రీరాముని జన్మదినం. శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణుని జన్మదినం. మార్గశిర శుద్ధ ఏకాదశి గీతోపదేశ దినం. అని పిల్లలకు తెలియజేయండి. 11 వేల సంవత్సరాలు శ్రీరాముడు ఆదర్శ పరిపాలన సాగిస్తే, నేడు 5 సంవత్సరాల తరువాత ఆ ప్రభుత్వo కొనసాగుతుందో లేదో అనే సందేహం రావడానికి కారణం ప్రభుత్వాలపైన ప్రజలకు, ప్రజలపైన ప్రభుత్వాలకు గౌరవం లేకపోవడమే. అన్ని పండగలు మొక్కుబడిగా జరుపుకునే హిందువులు పండగల పరమార్ధాన్ని తెలుసుకుని హిందుత్వాన్ని కాపాడుకోవడం లో మాత్రం అత్యంత బలహీనం గా ఉన్నారు. కాబట్టే ఎవడు పడితే వాడు హిందువులను, హిందూ దేవతలను, దేవాలయాలను అవమానించి కూడా ధైర్యం గా మన మధ్యనే తిరగగలుగుతున్నారు. సనాతన ధర్మానికి పునాది అయిన భగవద్గీతను తాత్పర్యసహితం గా అధ్యయనం చేయండి. పిల్లలకు నేర్పించండి. తద్వారా హిందూ ధర్మాన్ని కాపాడండి. హిందువులను అవమానించే వారికి బలం గా బుద్ధి చెప్పండి." అన్నారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యం లో మెదక్ జిల్లా లోని రామాయంపేట లో ప్రభుత్వ కళాశాల మైదానం లో (28. 3.2023) జరిగిన సహస్ర హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం లో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం విశ్వహిందూ పరిషత్ మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీ పబ్బ సత్యనారాయణ నిర్వహణలో ఘనం గా జరింగింది.

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ

Leave a Reply