Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

‘మానవ జాతి కి జ్ఞాన మార్గాన్ని ఉపదేశించే మంత్రపుష్పం, ధర్మ మార్గం లో నడిపించే జ్ఞానజ్యోతి, తరింపజేసే కర్తవ్య బోధ భగవద్గీత. మనిషి మరణించాక కూడా కీర్తి కాయం తో బ్రతక గలిగే కర్మలను ఆచరించే స్ఫూర్తినివ్వగలిగే దివ్య సందేశం భగవద్గీత…

‘మానవ జాతి కి జ్ఞాన మార్గాన్ని ఉపదేశించే మంత్రపుష్పం, ధర్మ మార్గం లో నడిపించే జ్ఞానజ్యోతి, తరింపజేసే కర్తవ్య బోధ భగవద్గీత. మనిషి మరణించాక కూడా కీర్తి కాయం తో బ్రతక గలిగే కర్మలను ఆచరించే స్ఫూర్తినివ్వగలిగే దివ్య సందేశం భగవద్గీత…

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

‘మానవ జాతి కి జ్ఞాన మార్గాన్ని ఉపదేశించే మంత్రపుష్పం, ధర్మ మార్గం లో నడిపించే జ్ఞానజ్యోతి, తరింపజేసే కర్తవ్య బోధ భగవద్గీత. మనిషి మరణించాక కూడా కీర్తి కాయం తో బ్రతక గలిగే కర్మలను ఆచరించే స్ఫూర్తినివ్వగలిగే దివ్య సందేశం భగవద్గీత.. దీని విలువ తెలుసుకోండి.. చదివి అర్ధం చేసుకుని ఆచరించి తరించండి. కైకేయి తనకు దశరథుడు ఇచ్చిన రెండు వరాల గురించి శ్రీ రామునితో చెప్పినప్పుడు రాముని ముఖం లో ఎలాంటి మార్పు లేకపోవడం స్థితప్రజ్ఞుని లక్షణాన్ని సూచిస్తుంది. ఆతర్వాత యుగం లో శ్రీకృష్ణుడు కూడా ‘గీత’ ద్వారా మానవుడు ఎల్లప్పుడూ స్థితప్రజ్ఞుని లక్షణాలను కలిగి ఉండాలని చెబుతాడు. అందుచేత గీత నేర్చుకుంటే మన రాత మార్చుకున్నట్టే .. గీత గొప్పతనాన్ని తెలుసుకుని న్యూ జెర్సీ లో ఉన్న శాటన్ హాల్ యూనివర్సిటీ వారు తమ యూనివర్సిటీ లో MBA చదివే విద్యార్థులకు భగవద్గీతను ‘A JOURNEY TRANSFERMATION’ పేరుతో బోధిస్తున్నారు. ఇందుకు భారతీయులమైన మనం గర్వించాలి ” అన్నారు గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ..! ఆయనను – న్యూజెర్సీ, అమెరికా లోని ‘సాయి దత్త పీఠం కల్చరల్ సెంటర్’, ‘మన అమెరికా తెలుగు అసోసియేషన్’ (MATA), తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (TFAS) సంస్థలు ‘గీతారత్న’ బిరుదుతో ఘనం గా సత్కరించాయి.(16.9.2023 ) ఈ మూడు సంస్థలను కలుపుకుంటూ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారధి గా దశాబ్దాలుగా కళారంగానికి, ఆధ్యాత్మిక రంగానికి సేవలందిస్తున్న శ్రీ ఊటుకూరి ప్రసాద్ శ్రీ గంగాధర శాస్త్రి చే ‘గీతా గాన ప్రవచన’ కార్యక్రమాన్ని అత్యంత ఘనం గా నిర్వహించారు. ఈ మూడు సంస్థల అధ్యక్షులైన బ్రహ్మశ్రీ రఘు శర్మ, శ్రీ శ్రీనివాస్ గనగోని, శ్రీ మధు రాచకుళ్ల లు శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన వైభవాన్ని ప్రస్తుతించారు. ఆయన గాత్రం లో శ్రీకృష్ణ పరమాత్ముని విశ్వరూపాన్ని దర్శించామని అన్నారు. భగవద్గీతను ప్రతి ఒక్కరి చేతా చదివించే స్ఫూర్తి తో సాగిన అయన ప్రవచనం గతం లో ఎక్కడా తాము వినలేదని అన్నారు. మూడు గంటల పాటు సాగిన గీతా గాన గంగాప్రవాహం లో తాము ఓలలాడామని, ప్రవచనం ప్రారంభం నుంచి చివరి వరకూ, రాత్రి గం.10.30 దాటినా ఒక్కరు కూడా కదలకుండా ఆసక్తి గా వినడం తాము ఏ కార్యక్రమం లోనూ చూడలేదని అభిప్రాయపడ్డారు. ఇది తాము పొందిన ఒక దివ్యానుభూతి గా భావిస్తున్నామని అన్నారు. ఇందుకు నిర్వాహకుడైన శ్రీ ఊటుకూరి ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. శ్రీ దాము గేదల అభ్యర్ధన మేరకు ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రసిద్ధ సినీ గీయ రచయిత శ్రీ చంద్రబోస్, శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రయాణ విశిష్ఠతను కొనియాడుతూ ప్రత్యేకం గా రాసి ఇచ్చిన ప్రశంసా పత్రాన్ని శ్రీ మధు రాచకుల్ల చదివి వినిపించగా మూడు సంస్థల ప్రతినిధులూ కలిసి శ్రీ గంగాధర శాస్త్రి కి బహూకరించారు. ఈ సందర్భం గా గంగాధర శాస్త్రి -శ్రీ చంద్రబోస్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ రఘు శర్మ తమ దేవస్థానం లో కొలువై ఉన్న దేవి దేవతలకు గంగాధర శాస్త్రి చేత ప్రత్యేక పూజలు చేయించి, శ్రీ వేంకటేశ్వరుని శేష వస్త్రాలతో సత్కరించారు.

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ

Leave a Reply