Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

మలేషియా తెలుగు ప్రవాసితుల సంఘం ( EXPATS ) ఘనం గా నిర్వహించిన ఉగాది వేడుకలలో ( 4.5.2024 – మరియమ్మన్ బిల్డింగ్, సిటీ సెంటర్, కౌలాలంపూర్ ) గీతా గాన ప్రవచన ప్రచారకర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డా II ఎల్ వి గంగాధర శాస్త్రి స్ఫూర్తిదాయకమైన గాన ప్రసంగం….

మలేషియా తెలుగు ప్రవాసితుల సంఘం ( EXPATS ) ఘనం గా నిర్వహించిన ఉగాది వేడుకలలో ( 4.5.2024 – మరియమ్మన్ బిల్డింగ్, సిటీ సెంటర్, కౌలాలంపూర్ ) గీతా గాన ప్రవచన ప్రచారకర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డా II ఎల్ వి గంగాధర శాస్త్రి స్ఫూర్తిదాయకమైన గాన ప్రసంగం….

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

‘భగవద్గీతను ఉదహరిస్తూ శ్రీ గంగాధర శాస్త్రి గారు చెప్పింది అర్ధం చేసుకుని ఆచరించగలిగితే స్వార్ధం లేని ఉత్తమ సమాజాన్ని నిర్మించవచ్చు. స్ఫూర్తి దాయకం గా సాగిన ఆయన గాన ప్రవచనం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ రోజు మలేషియా లో ఆయన నాకు పరిచయం కావడం ఎంతో భాగ్యం గా భావిస్తున్నాను.’ అన్నారు మలేషియా లోని భారతీయ హై కమీషనర్ శ్రీ బి ఎన్ రెడ్డి – శ్రీ గంగాధర శాస్త్రి, శ్రీమతి అర్చన దంపతులను సత్కరిస్తూ ! మలేషియా తెలుగు ప్రవాసితుల సంఘం ( EXPATS ) ఘనం గా నిర్వహించిన ఉగాది వేడుకలలో ( 4.5.2024 – మరియమ్మన్ బిల్డింగ్, సిటీ సెంటర్, కౌలాలంపూర్ ) గీతా గాన ప్రవచన ప్రచారకర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డా II ఎల్ వి గంగాధర శాస్త్రి స్ఫూర్తిదాయకమైన గాన ప్రసంగం చేశారు. జీవితానికి సంబంధించిన అన్ని విషయాలూ భగవద్గీత లో చెప్పబడ్డాయనీ, ఇది మతాలకు అతీతమైన, అత్యున్నతమైన వ్యక్తిత్వ వికాస బోధ అని, ఇది కర్మ సిద్ధాంత గ్రంథమని, కర్మ,భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా మన కర్తవ్యాన్ని ఎలా ఆచరించాలో గీత తెలియజేస్తుందని గంగాధర శాస్త్రి అన్నారు. ఏపని చేసినా ధర్మబద్ధం గా చెయ్యాలని, త్రికరణ శుద్ధిగా చెయ్యాలని, ఫలితం పరమాత్మదని భావించి చెయ్యాలని, స్వార్ధ రహితం గా, లోకహితం కోసం చెయ్యాలని, తామరాకును నీటి బిందువు అంటని రీతిగా భవ బంధాలకు తావు లేకుండా కర్మలను ఆచరించాలని గీత చెబుతుందని అన్నారు. భగవద్గీత మత గ్రంధం కాదని, మానవీయ గ్రంథమని, మానసిక వత్తిడి లేని, ఆనందకరమైన జీవితాన్ని గంగాధర శాస్త్రి అన్నారు. ‘ప్రపంచం లో ఇతర మత గ్రంధాలు మానవులచేత రచించబడితే, భగవద్గీత సాక్షాత్తు తాను పరమాత్మ గా ప్రకటించుకుని, విశ్వరూప ప్రదర్శన ద్వారా నిరూపించుకున్న శ్రీకృష్ణ భగవానుడి ద్వారా బోధించబడిన మానవ వికాస గీత …! ఇందులోని ప్రతిశ్లోకమూ మంత్రతుల్యమే…గీత ఒక్కటి చదివితే సర్వశాస్త్రాల సారం చదివినట్టే…!కాబట్టి తల్లి తండ్రులారా … మీరు గీత నేర్చుకుని రోజుకొక్క శ్లోకం మీ బిడ్డలకు తాత్పర్యసహితం గా నేర్పించండి. భారత దేశానికి దూరమైనా భారతీయ సంస్కృతికి దూరం కావద్దు. 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు ఒక పగలు. బ్రహ్మదేవుని పగటి కాలాన్ని కల్పం అంటారు. అది సృష్టి కాలం. దీనినే యుగాది లేదా ఉగాది అంటారు. ఇది క్రోధి నామ సంవత్సరం.. చైత్రమాసం… ఉత్తరాయణం … వసంత ఋతువు.. పాడ్యమి తిథి…! చైత్ర శుద్ధ నవమి శ్రీరాముని పుట్టిన రోజు… శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణుని పుట్టిన రోజు. మార్గశిర శుద్ధ ఏకాదశి భగవద్గీత బోధించబడిన రోజు…! తిథులు. వారాలు, నక్షత్రాలు ఇవన్నీ మన పిల్లలకు నేర్పించాలి. బయట ఏ భాష అయినా నేర్చుకోండి . ఇంట్లో మాత్రం మీ పిల్లలతో తెలుగు లోనే మాట్లాడండి. మన భారత దేశం గొప్పతనాన్ని పిల్లలకు చెప్పండి. మన సంస్కుతీ సంపదని నిజమైన వారసత్వ సంపదగా తరువాత తరాలకు పంచిపెట్టండి. ‘ అన్నారు గంగాధర శాస్త్రి. ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనం గా నిర్వహించిన శ్రీ అనిల్ కుమార్, శ్రీ కంచర్ల ఆనంద్, శ్రీ ఇంద్ర నీల్, శ్రీ నాగరాజ్, శ్రీ సుబాని, శ్రీ కిరణ్, శ్రీ మస్తాన్ తదితరులను శ్రీ గంగాధర శాస్త్రి అభినందించారు. ‘మాతెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతం తో EXPATS ఉగాది ఉత్సవాలు ప్రారంభం కావడం విశేషమని, తెలుగు రాష్ట్రాలు విడి పోయాక తెలుగు జాతీయ గీతం ‘మా తెలుగు తల్లి కి మల్లెపూదండ’ అదృశ్యమైపోయిందని, తిరిగి మలేసియా లో ప్రత్యక్షమయినట్టనిపించిందని, మలేషియా లో ఉన్న తెలుగు వారికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకునే స్థాయికి EXPATS ఎదగడం హర్షణీయమని గంగాధర శాస్త్రి అన్నారు. క్రోధి నామసంవత్సర ఉగాది కార్యక్రమాలను జ్యోతి ప్రకాశనం తో ప్రారంభించి అటుపై తెలుగు జాతీయ గీతాన్ని ఆలపించిన చిన్నారులను, శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శించిన కళాకారులను ఆయన సత్కరించి ఆశీర్వదించారు.

+16

See insights and ads

Boost post

All reactions:

4040

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ

Leave a Reply