Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

‘పత్రీజీ ధ్యాన మహా యాగం’ కార్యక్రమం లో (24.12.2023) శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం…

‘పత్రీజీ ధ్యాన మహా యాగం’ కార్యక్రమం లో (24.12.2023) శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం…

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

‘లౌకికమైనవి చూస్తేనే నమ్మగలం ….ఆధ్యాత్మికమైనవి నమ్మితేనే చూడగలం … పరమాత్మను తెలుసుకోవాలన్నా, దర్శించాలన్నా, ముందు నమ్మకం ఉండాలి… అటుపై అర్హత ఉండాలి… యోగమాయ చేత ఆవరించబడి ఉండడం వల్ల పరమాత్మ కనిపించడు… అనన్యమైన భక్తి చేత మాత్రమే ఈ మాయను దాటి పరమాత్మను చేరవచ్చు. పరమాత్మే పరమ గతి అని నమ్మాలి. మనం చేసే సమస్త కర్మల ఫలితం పరమాత్మదే అని భావించాలి. ఇంద్రియ విషయాలపట్ల ఆసక్తి లేకుండా ఉండాలి. సమస్త ప్రాణుల పట్ల ప్రేమభావం కలిగి ఉండాలి… ఇవే పరమాత్మ అనుగ్రహం పొందాలనుకునే వారికి ఉండాల్సిన ప్రధానమైన అర్హతలు.’ అన్నారు గీతా గాన ప్రవచన ప్రచారకర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. ‘పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీ’ వారి ఆధ్వర్యం లో, కడ్తాల్ లో 40 వేలమంది ప్టేక్షకుల సమక్షం లో వైభవంగా జరిగిన ‘పత్రీజీ ధ్యాన మహా యాగం’ కార్యక్రమం లో (24.12.2023) శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ‘ఏపని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి. ధర్మ బద్ధం గా చెయ్యాలి. స్వార్ధ రహితం గా చెయ్యాలి. లోక హితం కోసం చెయ్యాలి. ఏ పనినైతే ఎంచుకున్నామో ఆ పనికి మనమే చిహ్నమయ్యేట్టు చెయ్యాలి. ఇతరులకు స్ఫూర్తినిచ్చేట్టు చెయ్యాలి. దైవార్పణ బుద్ధి తో చెయ్యాలి. అలా కర్మలను ఆచరించేవాడే మరణాన్ని జయించగలడు. ‘జాతస్య హి ధ్రువో మృత్యుహు.. శ్లోకం అదే చెబుతుంది.. పుట్టిన వానికి మరణము తప్పదు.. అని చెబుతూ నువ్వు శాశ్వతం కాదు అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది.. మరణించిన వానికి జన్మము తప్పదు.. అంటూ పునర్జన్మ ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. ఈ జననమరణాల మధ్యలోని జీవిత ప్రయాణాన్ని లోకం గుర్తుపెట్టుకునేలా సాగించాలి.’ అన్నారు గంగాధర శాస్త్రి. నిలకడ లేని చంచలమైన చిత్తం ఏ ఏ విషయాల లో సంచరిస్తుంటుందో, ఆయా విషయాలనుండి దానిని నియంత్రించి ఆత్మయందే స్థిరం గా ఉంచడం కోసం సాధన చెయ్యాలి… ఇదే ధ్యాన యోగం..ఇలా చేయగలిగిన ధ్యాన యోగ సాధకుడే పత్రీజీ …! ధ్యానం గురించి పూర్తి అవగాహన పొందాలంటే భగవద్గీత లో ఆరవ అధ్యాయం “ఆత్మ సంయమ యోగం’ చదవండి’ అన్నారు గంగాధర శాస్త్రి. ‘ఈ ప్రపంచం లో లౌకిక, ఆధ్యాత్మిక విషయాల గురించి సమగ్రం గా చెప్పగలిగే ఒకే ఒక్క దైవ గ్రంథం, వ్యక్తిత్వవికాస గ్రంథం, ధర్మ గ్రంథం, మానవీయ గ్రంథం, మతాలకు అతీతమైన గ్రంథం…..ఒక్క భగవద్గీత మాత్రమే..! దీనిని బాల్య దశనుండే పిల్లలకు నేర్పించి మనదైన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. అలా కాపాడుకునే ప్రయత్నం బలంగా చేయకపోవడంవల్లే కన్వర్షన్ పేరుతో ఒక మతం, లవ్ జిహాద్ పేరుతో మరో మతం- హిందూ మతాన్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నాయి…”అంటూ హెచ్చరించారు గంగాధర శాస్త్రి. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని, అందరూ భగవద్గీత చదవాలని సూచించారు. ఘంటసాల, అన్నమయ్య గీతాలను ఆలపించారు. బ్రహ్మమొక్కటే కీర్తన ఆలపిస్తున్నప్పుడు ప్రేక్షకులు ఆనంద నృత్యాలు చేశారు. కొన్ని భగవద్గీత శ్లోకాలను ప్రేక్షకుల చేత చెప్పిస్తూ, భగవద్గీతను చదివి ఆచరిస్తామని వారిచేత ప్రతిజ్ఞ చేయించారు. తనకి సంపూర్ణ భగవద్గీత పాడాలని సూచించింది భారవే అని గంగాధర శాస్త్రి గుర్తుచేసుకున్నారు. చివరన పిరమిడ్ సొసైటీ చైర్మన్ శ్రీ కే విజయభాస్కర రెడ్డి – శ్రీ గంగాధర శాస్త్రి దంపతులను సత్కరించారు.

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ

Leave a Reply