Latest News

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

వాషింగ్టన్ లోని సియాటెల్ లో రెండవ రోజు “గీతా గాన ప్రచార శంఖారావం”

భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి భగవద్గీతా ప్రచార నిమిత్తం అమెరికా లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగం గా వాషింగ్టన్ లోని సియాటెల్ లో లక్ష్మి వెంకటేశ్వర దేవాలయం లో మూడు రోజుల పాటు ( జులై 13,14,15 ) నిత్య జీవితానికి భగవద్గీత అనుసంధానాన్ని వివరిస్తూ చేసిన గాన ప్రసంగానికి విశేషమైన స్పందన లభించింది. గీతా ప్రవచనం తో పాటు మధ్య మధ్య లో ఘంటసాల భక్తి గీతాలు, అన్నమయ్య కీర్తనలు గానం చేస్తూ, భక్తులతో భగవద్గీత శ్లోకాలను పఠిoప చేస్తూ, భజనలు చేయించడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. అనేకమంది ప్రేక్షకులు ఆనందాశ్రువులతో తమ సంతోషాన్ని శ్రీ గంగాధర శాస్త్రి తో పంచుకున్నారు. గంగాధర శాస్త్రి ‘గీత’ పై ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేశారు. ‘భగవద్గీతా ఫౌండేషన్’ చేపట్టిన ప్రాజెక్టులను వివరించి చేయూత కోరారు. కొందరు భక్తులు వారి గృహాలకు ఆహ్వానించి సత్కరించారు. చివరి రోజున దేవాలయ నిర్వాహకులు శ్రీమతి సాయి, ప్రధానార్చకులు శ్రీమాన్ ఉదయ భాస్కర పరాశర దీక్షితులు, శ్రీ జయరాం నండూరి, శ్రీమతి కళ్యాణి, శ్రీమతి షీలా, మోహన్ వార్తకవి, మాధవి, రాంప్రసాద్ సుంకర, కృష్ణకుమారి,రమేష్ కొలవేను,HTCC, Bothell ప్రధాన అర్చకులు శ్రీ వాసుదేవ శర్మ రావూరు తదితరులు డాII గంగాధర శాస్త్రి ని ఘనంగా సత్కరించారు.

+25

All reactions:

నీలకంఠాపురం దేవస్థానం లో గంగాధర శాస్త్రి గీత వైభవ గాన ప్రవచనం…..

“భారతదేశం లో తొలిసారిగా – వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే అత్యున్నత సాంకేతిక విలువలతో, మా “భగవద్గీతా ఫౌండేషన్’ రూపొందించిన తెలుగు తాత్పర్య సహిత, సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత ప్రతి తెలుగు వాడి ఇంట్లోనూ, ప్రతి దేవాలయం లోనూ మ్రోగాలని ఆకాంక్షిస్తున్నాం. దాదాపు 150 మంది సాంకేతిక నిపుణులు, పండితులు 7 సంవత్సరాలపాటు పరిశోధనాత్మక కృషి చేసి, తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని ఆశీస్సులతో విడుదలైన భగవద్గీత ఇది. దీని ద్వారా భగవద్గీత సారాన్ని అర్ధం చేసుకుని, ఆచరించి, జన్మలను చరితార్థం చేసుకోవలసిందిగా కోరుతున్నాం. కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే భగవద్గీత – మతాలకు అతీతమైన సార్వజనీన బోధ ! మనం చేసే కర్మల తాలూకు ఫలితాలే మనం అనుభవించే సుఖ దుఃఖాలు ! ‘జన్మ మృత్యు జరా వ్యాధి, దుఃఖ దోషా ను దర్శనమ్’ (13-9) అని పరమాత్మ చెప్పినట్టుగా జనన, మరణ, వార్ధక్య, వ్యాధుల వలన కలిగే దుఃఖాన్ని దోషాన్ని గుర్తించడమే జ్ఞానము. ఆ జ్ఞానం భగవద్గీతా పఠనం వల్ల మనకు లభిస్తుంది. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా, ఫలితం పరమాత్మకు అర్పించి, నిస్వార్ధం గా, లోక హితం కోసం, బంధాలకు అతీతం గా ఆచరించమని గీత చెబుతుంది. భగవద్గీత వైరాగ్యాన్ని బోధించే వృద్ధాప్యపు గ్రంథం కాదు. బాల్య దశ నుండే అభ్యసించవలసిన ఉత్తమ జీవనవిధాన గ్రంథం. మీ ఫోన్లలో రింగ్ టోన్ గా, కాలర్ ట్యూన్ గా భగవద్గీతా శ్లోకాలను పెట్టుకోండి. తల్లులారా.. భగవద్గీత మీరు నేర్చుకుని రోజుకో శ్లోకాన్ని మీ పిల్లలకు నేర్పించండి. సత్ఫలితాలను పొందండి. ” అన్నారు గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. శ్రీ సత్యసాయి జిల్లా లోని నీలకంఠాపురం గ్రామం లో, ఆంధ్రప్రదేశ్ పూర్వ మంత్రివర్యులు డాII రఘువీరారెడ్డి అత్యద్భుతం గా పునర్నిర్మించిన నీలకంఠాపురం దేవస్థానం లో గంగాధర శాస్త్రి గీత వైభవ గాన ప్రవచనం చేశారు. శ్రీ రఘువీరారెడ్డి లోని నిస్వార్ధ సేవ, ఆధ్యాత్మిక తత్పరతలను కొనియాడుతూ, రాజకీయ నాయకుడి గా ఆయన ప్రజలకు నిరంతర సేవలందించే స్థితిని పరమాత్ముడు అందించాలని కోరుకుంటున్నానని గంగాధర శాస్త్రి అన్నారు. రాష్ట్రం లోని ప్రతి దేవాలయం లోనూ భగవద్గీత వినిపించేట్టు గా చర్యలు గైకొనాలని, అలాగే భగవద్గీత ప్రచారమే లక్ష్యం గా స్థాపించిన తమ భగవద్గీతా ఫౌండేషన్ కు చేయూతనివ్వాలని – ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన ఆం.ప్ర. ఎండోమెంట్స్ సలహాదారు శ్రీ జ్వాలాపురం శ్రీకాంత్ కు సూచించారు. ఆనంతరం లేపాక్షి ఆలయ సందర్శనార్ధం వెళ్లిన శ్రీ గంగాధర శాస్త్రి కి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చక స్వామి శ్రీమాన్ లక్ష్మి నృసింహ నిర్వహణలో శ్రీ వీరభద్ర స్వామికి, దుర్గామాత కు, హనుమంతుడు ప్రతిష్టించిన సైకత లింగానికి శ్రీ గంగాధర శాస్త్రి పూజలు నిర్వహించారు. దేవతా స్తుతి చేస్తూ ‘స్వర’ పుష్పాలు సమర్పించారు.em ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

రామాయణం మన జీవన పారాయణం..

'రామాయణం మన జీవన పారాయణం.. మానవ జాతికి జ్ఞాన మార్గాన్ని ఉపదేశించే మంత్రపుష్పం రామాయణం. ఉత్తమోత్తమమైన మానవ జీవిత మార్గదర్శక గ్రంథం రామాయణం ... సకల మానవాళిని ధర్మ మార్గం లో నడిపించే జ్ఞానజ్యోతి రామాయణం. నిజం గా బతకడమంటే మరణించాక కీర్తి కాయం తో బతకడమే అని ఆచరించి చెప్పిన తండ్రి రామయ్య తండ్రి. జీవితమంటే సుఖం గా బతకడం కాదు. ధర్మం గా బతకడమని తాను ఆచరించి చెప్పిన ధర్మ మూర్తి శ్రీరామ చంద్రుడు.కాబట్టే మారీచుడు అనే రాక్షసుడు సైతం 'రామోవిగ్రహవాన్ ధర్మః ' అని శ్రీరాముణ్ణి కొనియాడాడు. విశేషమైన ఫలితాలనిచ్చే గురు సేవ చేసిన వాడు శ్రీరాముడు. చిన్న చిన్న పాత్రలు కూడా గొప్ప గొప్ప సందేశాలను ఇచ్చే మహాద్భుతమైన మహాకావ్యం శ్రీ రామాయణం. ఆదర్శవంతమైన కుటుంబ వ్యవస్థను ఏర్పరుచుకోవాలంటే, ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ధైర్యం గా ఎదుర్కోవాలంటే... రామాయణం చదివి పిల్లలకు చెప్పండి. విశ్వామిత్రుడు గంగావతరణం శ్రీరామునికి చెప్పడానికి కారణం - తమ పూర్వికులు ఎంత గొప్పవారో తెలుసుకుని తదనుగుణం గా ప్రవర్తించమని చెప్పడమే. తన వనవాసం గురించి శ్రీరాముడు సీతకు చెప్పినప్పుడు - ' నేను మీ వెంటే వస్తాను. మీరు లేకుండా స్వర్గ సుఖాలు లభించినా ఇష్టపడను. పతిని అనుసరించడమే సతికి ధర్మం.' అన్నది సీతమ్మ. ఇది ఇవాళ్టికీ దంపతులకు శిరోధార్యం. చేసిన ప్రయత్నం విఫలమైనప్పుడు, సంపదలను పోగొట్టుకున్నప్పుడు అధైర్యపడకుండా మరల ప్రయత్నిస్తే ఫలితం ఉంది తీరుతుంది అని రామ కథ చెబుతుంది. చీటికీ మాటికీ ఆత్మహత్యల ఆలోచన చేసే మానసిక దుర్బలులకు రామాయణ మహాభారతాలు గొప్ప ఆత్మ స్థైర్యాన్నిస్తాయి.'వ్యక్తులు జీవించి ఉన్నంతవరకే వైరం.. ఆ తర్వాత దాన్ని వదిలివేయాలి.' అంటాడు శ్రీరాముడు - రావణుని దహన సంస్కారాలు నిర్వహించే విషయం లో విభీషణునికి చెబుతూ. అదీ రాముని ధర్మ తత్వం... ! ఇచ్చినపనిని సాధించడమే కాక, అసలుపనికి భంగం కలగకుండా దానికి అనుబంధంగా ఇతర కార్యాలను కూడా సాధించేవాడు ఉత్తమమైన సేవకుడు అని హనుమంతుడి పాత్ర చెబుతుంది. మోడీ అనే మహాత్ముడి వల్ల రామజన్మ భూమి వివాదాన్ని పరిష్కరించుకుని రామాలయ నిర్మాణం చేసుకోగలుగుతున్నాం. ఇక మిగిలింది రామరాజ్య స్థాపన. ఇందుకు ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా సహకరించాలి. అందుకోసం స్వార్ధం విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరూ స్వకళ్యాణం కోసం కాక లోకకల్యాణం కోసం ఆలోచించాలి. ' జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ..' అనే రామ వాక్యాన్ని పాటించి ప్రతిఒక్కరూ దేశభక్తులు కావాలి. భారతo లో భగవద్గీత రామాయణo లో సుందరకాండ అత్యంత శక్తివంతమైనవి. ఆపదలు కలిగినప్పుడు 'ఆపదామపహర్తారం...' శ్లోకాన్ని, సర్వకార్యసిద్ధికి 'సర్వధర్మాన్ పరిత్యజ్య" శ్లోకాన్ని పఠించండి. దైవం ధర్మజ్ఞులను మాత్రమే కరుణిస్తాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చైత్ర శుద్ధ నవమి శ్రీరాముని జన్మదినం. శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణుని జన్మదినం. మార్గశిర శుద్ధ ఏకాదశి గీతోపదేశ దినం. అని పిల్లలకు తెలియజేయండి. 11 వేల సంవత్సరాలు శ్రీరాముడు ఆదర్శ పరిపాలన సాగిస్తే, నేడు 5 సంవత్సరాల తరువాత ఆ ప్రభుత్వo కొనసాగుతుందో లేదో అనే సందేహం రావడానికి కారణం ప్రభుత్వాలపైన ప్రజలకు, ప్రజలపైన ప్రభుత్వాలకు గౌరవం లేకపోవడమే. అన్ని పండగలు మొక్కుబడిగా జరుపుకునే హిందువులు పండగల పరమార్ధాన్ని తెలుసుకుని హిందుత్వాన్ని కాపాడుకోవడం లో మాత్రం అత్యంత బలహీనం గా ఉన్నారు. కాబట్టే ఎవడు పడితే వాడు హిందువులను, హిందూ దేవతలను, దేవాలయాలను అవమానించి కూడా ధైర్యం గా మన మధ్యనే తిరగగలుగుతున్నారు. సనాతన ధర్మానికి పునాది అయిన భగవద్గీతను తాత్పర్యసహితం గా అధ్యయనం చేయండి. పిల్లలకు నేర్పించండి. తద్వారా హిందూ ధర్మాన్ని కాపాడండి. హిందువులను అవమానించే వారికి బలం గా బుద్ధి చెప్పండి." అన్నారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యం లో మెదక్ జిల్లా లోని రామాయంపేట లో ప్రభుత్వ కళాశాల మైదానం లో (28. 3.2023) జరిగిన సహస్ర హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం లో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం విశ్వహిందూ పరిషత్ మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీ పబ్బ సత్యనారాయణ నిర్వహణలో ఘనం గా జరింగింది.

అమెరికా తెలుగు సంబరాలు -2023