Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

మలేషియా తెలుగు ప్రవాసితుల సంఘం ( EXPATS ) ఘనం గా నిర్వహించిన ఉగాది వేడుకలలో ( 4.5.2024 – మరియమ్మన్ బిల్డింగ్, సిటీ సెంటర్, కౌలాలంపూర్ ) గీతా గాన ప్రవచన ప్రచారకర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డా II ఎల్ వి గంగాధర శాస్త్రి స్ఫూర్తిదాయకమైన గాన ప్రసంగం….

‘భగవద్గీతను ఉదహరిస్తూ శ్రీ గంగాధర శాస్త్రి గారు చెప్పింది అర్ధం చేసుకుని ఆచరించగలిగితే స్వార్ధం లేని ఉత్తమ సమాజాన్ని నిర్మించవచ్చు. స్ఫూర్తి దాయకం గా సాగిన ఆయన గాన ప్రవచనం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ రోజు మలేషియా లో ఆయన నాకు పరిచయం కావడం ఎంతో భాగ్యం గా భావిస్తున్నాను.’ అన్నారు మలేషియా లోని భారతీయ హై కమీషనర్ శ్రీ బి ఎన్ రెడ్డి – శ్రీ గంగాధర శాస్త్రి, శ్రీమతి అర్చన దంపతులను సత్కరిస్తూ ! మలేషియా తెలుగు ప్రవాసితుల సంఘం ( EXPATS ) ఘనం గా నిర్వహించిన ఉగాది వేడుకలలో ( 4.5.2024 – మరియమ్మన్ బిల్డింగ్, సిటీ సెంటర్, కౌలాలంపూర్ ) గీతా గాన ప్రవచన ప్రచారకర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డా II ఎల్ వి గంగాధర శాస్త్రి స్ఫూర్తిదాయకమైన గాన ప్రసంగం చేశారు. జీవితానికి సంబంధించిన అన్ని విషయాలూ భగవద్గీత లో చెప్పబడ్డాయనీ, ఇది మతాలకు అతీతమైన, అత్యున్నతమైన వ్యక్తిత్వ వికాస బోధ అని, ఇది కర్మ సిద్ధాంత గ్రంథమని, కర్మ,భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా మన కర్తవ్యాన్ని ఎలా ఆచరించాలో గీత తెలియజేస్తుందని గంగాధర శాస్త్రి అన్నారు. ఏపని చేసినా ధర్మబద్ధం గా చెయ్యాలని, త్రికరణ శుద్ధిగా చెయ్యాలని, ఫలితం పరమాత్మదని భావించి చెయ్యాలని, స్వార్ధ రహితం గా, లోకహితం కోసం చెయ్యాలని, తామరాకును నీటి బిందువు అంటని రీతిగా భవ బంధాలకు తావు లేకుండా కర్మలను ఆచరించాలని గీత చెబుతుందని అన్నారు. భగవద్గీత మత గ్రంధం కాదని, మానవీయ గ్రంథమని, మానసిక వత్తిడి లేని, ఆనందకరమైన జీవితాన్ని గంగాధర శాస్త్రి అన్నారు. ‘ప్రపంచం లో ఇతర మత గ్రంధాలు మానవులచేత రచించబడితే, భగవద్గీత సాక్షాత్తు తాను పరమాత్మ గా ప్రకటించుకుని, విశ్వరూప ప్రదర్శన ద్వారా నిరూపించుకున్న శ్రీకృష్ణ భగవానుడి ద్వారా బోధించబడిన మానవ వికాస గీత …! ఇందులోని ప్రతిశ్లోకమూ మంత్రతుల్యమే…గీత ఒక్కటి చదివితే సర్వశాస్త్రాల సారం చదివినట్టే…!కాబట్టి తల్లి తండ్రులారా … మీరు గీత నేర్చుకుని రోజుకొక్క శ్లోకం మీ బిడ్డలకు తాత్పర్యసహితం గా నేర్పించండి. భారత దేశానికి దూరమైనా భారతీయ సంస్కృతికి దూరం కావద్దు. 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు ఒక పగలు. బ్రహ్మదేవుని పగటి కాలాన్ని కల్పం అంటారు. అది సృష్టి కాలం. దీనినే యుగాది లేదా ఉగాది అంటారు. ఇది క్రోధి నామ సంవత్సరం.. చైత్రమాసం… ఉత్తరాయణం … వసంత ఋతువు.. పాడ్యమి తిథి…! చైత్ర శుద్ధ నవమి శ్రీరాముని పుట్టిన రోజు… శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణుని పుట్టిన రోజు. మార్గశిర శుద్ధ ఏకాదశి భగవద్గీత బోధించబడిన రోజు…! తిథులు. వారాలు, నక్షత్రాలు ఇవన్నీ మన పిల్లలకు నేర్పించాలి. బయట ఏ భాష అయినా నేర్చుకోండి . ఇంట్లో మాత్రం మీ పిల్లలతో తెలుగు లోనే మాట్లాడండి. మన భారత దేశం గొప్పతనాన్ని పిల్లలకు చెప్పండి. మన సంస్కుతీ సంపదని నిజమైన వారసత్వ సంపదగా తరువాత తరాలకు పంచిపెట్టండి. ‘ అన్నారు గంగాధర శాస్త్రి. ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనం గా నిర్వహించిన శ్రీ అనిల్ కుమార్, శ్రీ కంచర్ల ఆనంద్, శ్రీ ఇంద్ర నీల్, శ్రీ నాగరాజ్, శ్రీ సుబాని, శ్రీ కిరణ్, శ్రీ మస్తాన్ తదితరులను శ్రీ గంగాధర శాస్త్రి అభినందించారు. ‘మాతెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతం తో EXPATS ఉగాది ఉత్సవాలు ప్రారంభం కావడం విశేషమని, తెలుగు రాష్ట్రాలు విడి పోయాక తెలుగు జాతీయ గీతం ‘మా తెలుగు తల్లి కి మల్లెపూదండ’ అదృశ్యమైపోయిందని, తిరిగి మలేసియా లో ప్రత్యక్షమయినట్టనిపించిందని, మలేషియా లో ఉన్న తెలుగు వారికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకునే స్థాయికి EXPATS ఎదగడం హర్షణీయమని గంగాధర శాస్త్రి అన్నారు. క్రోధి నామసంవత్సర ఉగాది కార్యక్రమాలను జ్యోతి ప్రకాశనం తో ప్రారంభించి అటుపై తెలుగు జాతీయ గీతాన్ని ఆలపించిన చిన్నారులను, శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శించిన కళాకారులను ఆయన సత్కరించి ఆశీర్వదించారు.

+16

See insights and ads

Boost post

All reactions:

4040

‘విశ్వశాంతి’ ని కాంక్షిస్తూ ‘భగవద్గీతా గాన ప్రచార శంఖారావం’ పేరుతో – భగవద్గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేస్తున్న ఆస్ట్రేలియా పర్యటనలో భాగం గా ద్వితీయ కార్యక్రమం – గోల్డ్ కోస్ట్ లోని, రోబినా కమ్యూనిటీ సెంటర్ లో, ‘గోల్డ్ కోస్ట్ తెలుగు సంఘం (TAG)’ ఆధ్వర్యం లో అద్వితీయం గా జరిగింది.

‘విశ్వశాంతి’ ని కాంక్షిస్తూ ‘భగవద్గీతా గాన ప్రచార శంఖారావం’ పేరుతో – భగవద్గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేస్తున్న ఆస్ట్రేలియా పర్యటనలో భాగం గా ద్వితీయ కార్యక్రమం – గోల్డ్ కోస్ట్ లోని, రోబినా కమ్యూనిటీ సెంటర్ లో, ‘గోల్డ్ కోస్ట్ తెలుగు సంఘం (TAG)’ ఆధ్వర్యం లో అద్వితీయం గా జరిగింది. ప్రసిద్ధ మానసిక వైద్యులు, TAG అధ్యక్షులు డాII మాణిక్ గూడూరి, శ్రీమతి హరిత గూడూరి, DEVAA వ్యవస్థాపకులు శ్రీ పవన్ వఝలలు శ్రీ గంగాధర శాస్త్రి కి పుష్పగుచ్ఛo తో స్వాగతం పలికారు. కార్యక్రమానికి చేదోడుగా నిలిచిన శ్రీ రవి ద్రోణవల్లి, శ్రీమతి మాధవి ద్రోణవల్లి, శ్రీమతి సురేఖ గాదంశెట్టి మరియు TAG మేనేజిమెంట్ కమిటీ లతో కలిసి శ్రీ గంగాధర శాస్త్రి జ్యోతిప్రకాశనం చేసి, వారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ గీతా గానప్రవచనం చేశారు. భగవద్గీత ను చదివి అర్ధం చేసుకుని, ఆచరిస్తే నిత్యజీవనసరళి లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని అన్నారు. ‘పొలం దున్ననిదే విత్తనం ఫలించనట్టు చిత్తం శుద్ధి కానిదే జ్ఞానం వంటబట్టదు. నిర్మలమైన చిత్తం తో భగవద్గీత అధ్యయనం చేస్తే లౌకిక, అలౌకికమైన గొప్ప ఫలితాలను పొందగలము. గీత వైరాగ్య గ్రంథం కాదు. మానవ జీవనo ఆదర్శవంతం గా గడిపేందుకు, సకల విజయాలకు దోహదం చేసే ఉత్తమ జీవన విధాన గ్రంథం. అందుకు ఉదాహరణే – ‘న యోత్సే..’ అంటూ యుద్ధం చేయనని గాండీవంతో పాటు అస్త్ర సన్న్యాసం చేసిన అర్జునుడు కృష్ణపరమాత్ముని గీతా బోధ విని ‘నష్టోమోహస్మృతిర్లబ్ధా..’. అంటూ తన అజ్ఞానo నశించి, సందేహాలు తొలగిపోయి యుద్ధం చేసి విజయం సాధించాడు. ఇది ఒక్క అర్జునునికి మాత్రమే కాదు. సకల మానవాళికి ఉపయోగపడే కర్తవ్య బోధ… విజయ గీత ! దీనిని మీరూ నేర్చుకుని మీబిడ్డలకు నేర్పించి మనదైన జ్ఞాన సంబంధమైన ఆస్తిని కాపాడుకోండి. ” అన్నారు గంగాధర శాస్త్రి. ఆయన తాత్పర్య సహితం గా గానం చేసిన విశ్వరూప సందర్శన యోగం వింటూ ప్రేక్షకులు చెమర్చిన కళ్ళతో లేచి నిలబడి కరతాళధ్వనులు సలిపారు. ‘తమ ‘గోల్డ్ కోస్ట్ తెలుగు సంఘం చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా, తెలుగువారి హృదయాలను కదిలించేలా, స్ఫూర్తిదాయకం గా గురువర్యులు డాII గంగాధర శాస్త్రి గారి ప్రవచనం సాగింద’ని, శ్లోకాలూ గీతాలూ, భజనలూ పాడుతూ అన్ని వర్గాలవారిని ఆకట్టుకునేలా, అర్ధమయ్యేలా గీత చెప్పడం తాముకూడా ఊహించలేదని, శాస్త్రి గారి భగవద్గీత ప్రచార ఉద్యమాన్ని ఆస్ట్రేలియా దేశవ్యాప్తం చేయడం లో తమవంతు కృషి చేస్తామని డాII మాణిక్ అన్నారు. అనంతరం డాII మాణిక్ గూడూరి దంపతులను, స్వచ్ఛమైన తెలుగులో సుమధురం గా వ్యాఖ్యానం అందించిన తెలుగు లహరి సభ్యులు శ్రీ హరి పంచుమర్తి ని, వినసొంపైన సౌండ్ సిస్టం ని అందించిన ఆస్ట్రేలియన్ సౌండ్ ఇంజనీర్స్ ని గంగాధర శాస్త్రి అభినందిస్తూ సత్కరించారు. దేవా (DEVAA – DHARMA ENLIGHTENMENT VEDIC ASSOCIATION OF AUSTRALIA ) సంస్థ నుంచి, తన ఆస్ట్రేలియా పర్యటనను అత్యంత వైభవం గా నిర్వహిస్తున్న శ్రీమాన్ పవన్ వఝల కు శ్రీ గంగాధర శాస్త్రి అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

‘మార్గశిర శుద్ధ ఏకాదశి’ గీతా జయంతి సందర్భం గా ప్రసిద్ధ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ ‘భగవద్గీతా ఫౌండేషన్’ హైదరాబాద్ లోని రామంతపూర్ లో అన్నదాన కార్యక్రమం…

‘మార్గశిర శుద్ధ ఏకాదశి’ గీతా జయంతి సందర్భం గా ప్రసిద్ధ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ ‘భగవద్గీతా ఫౌండేషన్’ హైదరాబాద్ లోని రామంతపూర్ లో అన్నదాన కార్యక్రమం (24.12.2023) నిర్వహించింది. సంస్థ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ఈ సందర్భం గా తన కుటుంబ సభ్యులతో పోచమ్మ దేవాలయం లో ప్రత్యేక పూజలు జరిపి, గోసేవ నిర్వహించారు. అనంతరం శ్రీ గంగాధర శాస్త్రి – ఫౌండేషన్ సభ్యులు, ఫౌండేషన్ అడ్వకసి చీఫ్ శ్రీ ఆజాద్ బాబు లతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

వాషింగ్టన్ లోని సియాటెల్ లో రెండవ రోజు “గీతా గాన ప్రచార శంఖారావం”

భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి భగవద్గీతా ప్రచార నిమిత్తం అమెరికా లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగం గా వాషింగ్టన్ లోని సియాటెల్ లో లక్ష్మి వెంకటేశ్వర దేవాలయం లో మూడు రోజుల పాటు ( జులై 13,14,15 ) నిత్య జీవితానికి భగవద్గీత అనుసంధానాన్ని వివరిస్తూ చేసిన గాన ప్రసంగానికి విశేషమైన స్పందన లభించింది. గీతా ప్రవచనం తో పాటు మధ్య మధ్య లో ఘంటసాల భక్తి గీతాలు, అన్నమయ్య కీర్తనలు గానం చేస్తూ, భక్తులతో భగవద్గీత శ్లోకాలను పఠిoప చేస్తూ, భజనలు చేయించడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. అనేకమంది ప్రేక్షకులు ఆనందాశ్రువులతో తమ సంతోషాన్ని శ్రీ గంగాధర శాస్త్రి తో పంచుకున్నారు. గంగాధర శాస్త్రి ‘గీత’ పై ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేశారు. ‘భగవద్గీతా ఫౌండేషన్’ చేపట్టిన ప్రాజెక్టులను వివరించి చేయూత కోరారు. కొందరు భక్తులు వారి గృహాలకు ఆహ్వానించి సత్కరించారు. చివరి రోజున దేవాలయ నిర్వాహకులు శ్రీమతి సాయి, ప్రధానార్చకులు శ్రీమాన్ ఉదయ భాస్కర పరాశర దీక్షితులు, శ్రీ జయరాం నండూరి, శ్రీమతి కళ్యాణి, శ్రీమతి షీలా, మోహన్ వార్తకవి, మాధవి, రాంప్రసాద్ సుంకర, కృష్ణకుమారి,రమేష్ కొలవేను,HTCC, Bothell ప్రధాన అర్చకులు శ్రీ వాసుదేవ శర్మ రావూరు తదితరులు డాII గంగాధర శాస్త్రి ని ఘనంగా సత్కరించారు.

+25

All reactions:

నీలకంఠాపురం దేవస్థానం లో గంగాధర శాస్త్రి గీత వైభవ గాన ప్రవచనం…..

“భారతదేశం లో తొలిసారిగా – వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే అత్యున్నత సాంకేతిక విలువలతో, మా “భగవద్గీతా ఫౌండేషన్’ రూపొందించిన తెలుగు తాత్పర్య సహిత, సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత ప్రతి తెలుగు వాడి ఇంట్లోనూ, ప్రతి దేవాలయం లోనూ మ్రోగాలని ఆకాంక్షిస్తున్నాం. దాదాపు 150 మంది సాంకేతిక నిపుణులు, పండితులు 7 సంవత్సరాలపాటు పరిశోధనాత్మక కృషి చేసి, తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని ఆశీస్సులతో విడుదలైన భగవద్గీత ఇది. దీని ద్వారా భగవద్గీత సారాన్ని అర్ధం చేసుకుని, ఆచరించి, జన్మలను చరితార్థం చేసుకోవలసిందిగా కోరుతున్నాం. కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే భగవద్గీత – మతాలకు అతీతమైన సార్వజనీన బోధ ! మనం చేసే కర్మల తాలూకు ఫలితాలే మనం అనుభవించే సుఖ దుఃఖాలు ! ‘జన్మ మృత్యు జరా వ్యాధి, దుఃఖ దోషా ను దర్శనమ్’ (13-9) అని పరమాత్మ చెప్పినట్టుగా జనన, మరణ, వార్ధక్య, వ్యాధుల వలన కలిగే దుఃఖాన్ని దోషాన్ని గుర్తించడమే జ్ఞానము. ఆ జ్ఞానం భగవద్గీతా పఠనం వల్ల మనకు లభిస్తుంది. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా, ఫలితం పరమాత్మకు అర్పించి, నిస్వార్ధం గా, లోక హితం కోసం, బంధాలకు అతీతం గా ఆచరించమని గీత చెబుతుంది. భగవద్గీత వైరాగ్యాన్ని బోధించే వృద్ధాప్యపు గ్రంథం కాదు. బాల్య దశ నుండే అభ్యసించవలసిన ఉత్తమ జీవనవిధాన గ్రంథం. మీ ఫోన్లలో రింగ్ టోన్ గా, కాలర్ ట్యూన్ గా భగవద్గీతా శ్లోకాలను పెట్టుకోండి. తల్లులారా.. భగవద్గీత మీరు నేర్చుకుని రోజుకో శ్లోకాన్ని మీ పిల్లలకు నేర్పించండి. సత్ఫలితాలను పొందండి. ” అన్నారు గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. శ్రీ సత్యసాయి జిల్లా లోని నీలకంఠాపురం గ్రామం లో, ఆంధ్రప్రదేశ్ పూర్వ మంత్రివర్యులు డాII రఘువీరారెడ్డి అత్యద్భుతం గా పునర్నిర్మించిన నీలకంఠాపురం దేవస్థానం లో గంగాధర శాస్త్రి గీత వైభవ గాన ప్రవచనం చేశారు. శ్రీ రఘువీరారెడ్డి లోని నిస్వార్ధ సేవ, ఆధ్యాత్మిక తత్పరతలను కొనియాడుతూ, రాజకీయ నాయకుడి గా ఆయన ప్రజలకు నిరంతర సేవలందించే స్థితిని పరమాత్ముడు అందించాలని కోరుకుంటున్నానని గంగాధర శాస్త్రి అన్నారు. రాష్ట్రం లోని ప్రతి దేవాలయం లోనూ భగవద్గీత వినిపించేట్టు గా చర్యలు గైకొనాలని, అలాగే భగవద్గీత ప్రచారమే లక్ష్యం గా స్థాపించిన తమ భగవద్గీతా ఫౌండేషన్ కు చేయూతనివ్వాలని – ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన ఆం.ప్ర. ఎండోమెంట్స్ సలహాదారు శ్రీ జ్వాలాపురం శ్రీకాంత్ కు సూచించారు. ఆనంతరం లేపాక్షి ఆలయ సందర్శనార్ధం వెళ్లిన శ్రీ గంగాధర శాస్త్రి కి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చక స్వామి శ్రీమాన్ లక్ష్మి నృసింహ నిర్వహణలో శ్రీ వీరభద్ర స్వామికి, దుర్గామాత కు, హనుమంతుడు ప్రతిష్టించిన సైకత లింగానికి శ్రీ గంగాధర శాస్త్రి పూజలు నిర్వహించారు. దేవతా స్తుతి చేస్తూ ‘స్వర’ పుష్పాలు సమర్పించారు.em ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

రామాయణం మన జీవన పారాయణం..

'రామాయణం మన జీవన పారాయణం.. మానవ జాతికి జ్ఞాన మార్గాన్ని ఉపదేశించే మంత్రపుష్పం రామాయణం. ఉత్తమోత్తమమైన మానవ జీవిత మార్గదర్శక గ్రంథం రామాయణం ... సకల మానవాళిని ధర్మ మార్గం లో నడిపించే జ్ఞానజ్యోతి రామాయణం. నిజం గా బతకడమంటే మరణించాక కీర్తి కాయం తో బతకడమే అని ఆచరించి చెప్పిన తండ్రి రామయ్య తండ్రి. జీవితమంటే సుఖం గా బతకడం కాదు. ధర్మం గా బతకడమని తాను ఆచరించి చెప్పిన ధర్మ మూర్తి శ్రీరామ చంద్రుడు.కాబట్టే మారీచుడు అనే రాక్షసుడు సైతం 'రామోవిగ్రహవాన్ ధర్మః ' అని శ్రీరాముణ్ణి కొనియాడాడు. విశేషమైన ఫలితాలనిచ్చే గురు సేవ చేసిన వాడు శ్రీరాముడు. చిన్న చిన్న పాత్రలు కూడా గొప్ప గొప్ప సందేశాలను ఇచ్చే మహాద్భుతమైన మహాకావ్యం శ్రీ రామాయణం. ఆదర్శవంతమైన కుటుంబ వ్యవస్థను ఏర్పరుచుకోవాలంటే, ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ధైర్యం గా ఎదుర్కోవాలంటే... రామాయణం చదివి పిల్లలకు చెప్పండి. విశ్వామిత్రుడు గంగావతరణం శ్రీరామునికి చెప్పడానికి కారణం - తమ పూర్వికులు ఎంత గొప్పవారో తెలుసుకుని తదనుగుణం గా ప్రవర్తించమని చెప్పడమే. తన వనవాసం గురించి శ్రీరాముడు సీతకు చెప్పినప్పుడు - ' నేను మీ వెంటే వస్తాను. మీరు లేకుండా స్వర్గ సుఖాలు లభించినా ఇష్టపడను. పతిని అనుసరించడమే సతికి ధర్మం.' అన్నది సీతమ్మ. ఇది ఇవాళ్టికీ దంపతులకు శిరోధార్యం. చేసిన ప్రయత్నం విఫలమైనప్పుడు, సంపదలను పోగొట్టుకున్నప్పుడు అధైర్యపడకుండా మరల ప్రయత్నిస్తే ఫలితం ఉంది తీరుతుంది అని రామ కథ చెబుతుంది. చీటికీ మాటికీ ఆత్మహత్యల ఆలోచన చేసే మానసిక దుర్బలులకు రామాయణ మహాభారతాలు గొప్ప ఆత్మ స్థైర్యాన్నిస్తాయి.'వ్యక్తులు జీవించి ఉన్నంతవరకే వైరం.. ఆ తర్వాత దాన్ని వదిలివేయాలి.' అంటాడు శ్రీరాముడు - రావణుని దహన సంస్కారాలు నిర్వహించే విషయం లో విభీషణునికి చెబుతూ. అదీ రాముని ధర్మ తత్వం... ! ఇచ్చినపనిని సాధించడమే కాక, అసలుపనికి భంగం కలగకుండా దానికి అనుబంధంగా ఇతర కార్యాలను కూడా సాధించేవాడు ఉత్తమమైన సేవకుడు అని హనుమంతుడి పాత్ర చెబుతుంది. మోడీ అనే మహాత్ముడి వల్ల రామజన్మ భూమి వివాదాన్ని పరిష్కరించుకుని రామాలయ నిర్మాణం చేసుకోగలుగుతున్నాం. ఇక మిగిలింది రామరాజ్య స్థాపన. ఇందుకు ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా సహకరించాలి. అందుకోసం స్వార్ధం విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరూ స్వకళ్యాణం కోసం కాక లోకకల్యాణం కోసం ఆలోచించాలి. ' జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ..' అనే రామ వాక్యాన్ని పాటించి ప్రతిఒక్కరూ దేశభక్తులు కావాలి. భారతo లో భగవద్గీత రామాయణo లో సుందరకాండ అత్యంత శక్తివంతమైనవి. ఆపదలు కలిగినప్పుడు 'ఆపదామపహర్తారం...' శ్లోకాన్ని, సర్వకార్యసిద్ధికి 'సర్వధర్మాన్ పరిత్యజ్య" శ్లోకాన్ని పఠించండి. దైవం ధర్మజ్ఞులను మాత్రమే కరుణిస్తాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చైత్ర శుద్ధ నవమి శ్రీరాముని జన్మదినం. శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణుని జన్మదినం. మార్గశిర శుద్ధ ఏకాదశి గీతోపదేశ దినం. అని పిల్లలకు తెలియజేయండి. 11 వేల సంవత్సరాలు శ్రీరాముడు ఆదర్శ పరిపాలన సాగిస్తే, నేడు 5 సంవత్సరాల తరువాత ఆ ప్రభుత్వo కొనసాగుతుందో లేదో అనే సందేహం రావడానికి కారణం ప్రభుత్వాలపైన ప్రజలకు, ప్రజలపైన ప్రభుత్వాలకు గౌరవం లేకపోవడమే. అన్ని పండగలు మొక్కుబడిగా జరుపుకునే హిందువులు పండగల పరమార్ధాన్ని తెలుసుకుని హిందుత్వాన్ని కాపాడుకోవడం లో మాత్రం అత్యంత బలహీనం గా ఉన్నారు. కాబట్టే ఎవడు పడితే వాడు హిందువులను, హిందూ దేవతలను, దేవాలయాలను అవమానించి కూడా ధైర్యం గా మన మధ్యనే తిరగగలుగుతున్నారు. సనాతన ధర్మానికి పునాది అయిన భగవద్గీతను తాత్పర్యసహితం గా అధ్యయనం చేయండి. పిల్లలకు నేర్పించండి. తద్వారా హిందూ ధర్మాన్ని కాపాడండి. హిందువులను అవమానించే వారికి బలం గా బుద్ధి చెప్పండి." అన్నారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యం లో మెదక్ జిల్లా లోని రామాయంపేట లో ప్రభుత్వ కళాశాల మైదానం లో (28. 3.2023) జరిగిన సహస్ర హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం లో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం విశ్వహిందూ పరిషత్ మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీ పబ్బ సత్యనారాయణ నిర్వహణలో ఘనం గా జరింగింది.

అమెరికా తెలుగు సంబరాలు -2023