FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A
Category: Blogs
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజన్ -II రీజన్ మీట్ – కరీంనగర్
Posted on by user
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజన్ -II రీజన్ మీట్ – కరీంనగర్ లో వైభవం గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి హాజరయ్యారు. ఆయనకు లయన్స్ క్లబ్ ఘన స్వాగతం పలికింది.. భగవద్గీత ద్వారా ఉత్తమ జీవన విధానాన్ని బోధిస్తూ శ్రీ గంగాధర శాస్త్రి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వవికాస ప్రసంగం చేశారు. అనంతరం ఆయనను లయన్స్ క్లబ్ సభ్యులు గౌరవ సత్కారం చేసారు. సెల్ఫీ లతో పాటు ఆశీస్సులు తీసుకున్నారు.
గుంటూరు జిల్లా జగ్గాపురం గ్రామంలో సంక్రాంతి సంబరాలు
Posted on by user
గుంటూరు జిల్లా జగ్గాపురం గ్రామం లో జనవరి 14న సంక్రాంతి సంబరాలు వైభవం గా జరిగాయి… ఈ సందర్భంగా జాగర్లమూడి ఆదియ్య భవనం లో కళారత్న, ‘గీతాగాన గంధర్వ’ శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి గారిచే భగవద్గీతా గాన ప్రవచనం ఏర్పాటు చేశారు. రెండున్నర గంటల పాటు జగ్గాపురం గ్రామ ప్రజలు శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన వాహినిలో తేలియాడారు. అనంతరం పోపూరి వెంకటేశ్వర్లు మరియు జగ్గాపురం గ్రామ ప్రజలు గంగాధర శాస్త్రి గారిని సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ పథకానికి…
Posted on by user
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ పథకానికి సంబంధించిన ‘స్పందన ‘ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలులో 16. 11. 2019 న A1 కన్వెన్షన్ హాల్ లో అత్యంత వైభవంగా జరిగింది. ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పోల భాస్కర్ IAS ఆహ్వానం మేరకు నేపధ్య గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా శిక్షణ పూర్తి చేసుకుని గ్రామ సచివాలయ ఉద్యోగాలు పొంది విధులలోకి అడుగుపెడుతున్న యువతరం ఉద్యోగులను ఉద్దేశించి గంగాధర శాస్త్రి ఉద్యోగ ధర్మాలను ఆసక్తి దాయకంగా వివరిస్తూ, మధ్య మధ్య ఛలోక్తులతో , పాటలతో ,స్ఫూర్తిదాయకమైన గాన ప్రసంగం చేశారు. కార్యక్రమ అనంతరం శ్రీ పోల భాస్కర్ IAS, శ్రీ ఎం గిరిజా శంకర్ IAS, కమీషనర్ ( P.R & R.D ) లు గంగాధర శాస్త్రి ని సత్కరించారు.
బతుకమ్మ సంబరాలు
Posted on by user
భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చ ఆధ్వర్యం లో ఆదివారం నాడు హైదరాబాద్, అంబర్ పేట లోని మహారాణాప్రతాప్ ఫంక్షన్ హాల్ లో బతుకమ్మ సంబరాలు ఘనం గా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, గౌరవ అతిథి గా భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ గంగాధర శాస్త్రి, బేటీ బచావో -బేటీ పడావో తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి గీతామూర్తి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భం గా గంగాధర శాస్త్రి బతుకమ్మ పండగ విశిష్టతను పాడుతూ వివరించారు. బతుకమ్మ పండగ పరమార్ధం – కేవలం ప్రకృతి మాతను ఆరాధించడమే కాక , పరమాత్మ మనకు ఇచ్చిన శక్తులను శ్రీ కిషన్ రెడ్డి లాగా సేవ రూపం లో తిరిగి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడడం కూడా అని తెలుసుకోవాలన్నారు.
పువ్వు కాయగా మారడం లాగే… స్త్రీ కూడా నవమాసాలూ మోసి , బిడ్డలు అనే ఫలాలను సమాజానికి అందిస్తుందని, అందుకే తొమ్మిది రకాల పూలతో , తొమ్మిది వరుసలతో పేర్చి , తొమ్మిది రోజుల పాటు, దుర్గా నవరాత్రులలో ఈ బతుకమ్మ పండగను జరుపుతారని అన్నారు.
బతకడమంటే- మనం వెళ్లిపోయిన తర్వాత కూడా లోకం గుర్తుంచుకునే పనులతో మిగిలిపోవడమే అన్నారు..
శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ
Posted on by user
ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్య్వవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి గారు తన జన్మ దినం సందర్భంగా – విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని హైదరాబాద్ ఫిలిం నగర్ లోని దైవసన్నిధానం ఆలయం లో సందర్శించి వారి ఆశీస్సులు పొందారు. స్వామి కోరిక మేరకు గంగాధర శాస్త్రి కొన్ని భక్తి గీతాలను ఆలపించారు. తనకు గంగాధరశాస్త్రి అన్నా ఆయన గాత్రమన్నా అభిమానమని స్వరూపానంద అన్నారు. ఘంటసాల గీతాలకూ, శ్రీకృష్ణ గీత కూ ప్రచారం కల్పించడానికే భగవంతుడు గంగాధర శాస్త్రి ని ఎంచుకున్నట్టుగా తాను భావిస్తానని, సంపూర్ణ భగవద్గీత రికార్డింగ్ కు తాను ముహూర్తం నిర్ణయించగా, తన జన్మ చరితార్ధమయ్యేలా గంగాధర శాస్త్రి గీతను గానం చేశారని స్వరూపానంద అన్నారు. ఈ సందర్భం గా గంగాధర శాస్త్రి – భగవద్గీతా ఫౌండేషన్ సభ్యులతో కలసి – తాము చేయబోతున్న ప్రాజెక్ట్ వివరాలను – స్వరూపానంద కు అందజేయగా -ఇవన్నీ సఫలీకృతం కావాలని స్వామి ఆశీర్వదించారు. త్వరలో తాను హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శిస్తానని అన్నారు. ఫౌండేషన్ సభ్యులు శ్రీయుతులు చలపతి రాజు, చక్రవర్తి , కృష్ణమాచార్యులు స్వామి ఆశీస్సులు పొందారు..
వనిత’ టీవీ ఛానల్ అధినేత శ్రీమతి తుమ్మల రమాదేవి..
Posted on by user
ప్రేక్షకులను అలరించే కార్యక్రమాల రూపకల్పనలో విశేషమైన ఖ్యాతి గడించిన ‘వనిత’ టీవీ ఛానల్ అధినేత శ్రీమతి తుమ్మల రమాదేవి తో – ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ గంగాధర శాస్త్రి సమావేశమయ్యారు. ‘సంపూర్ణ భగవద్గీతా పారాయణ గాన యజ్ఞం’ శీర్షికన ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని రూపొందించి ప్రసిద్ధ ఛానల్ భక్తి టీవీ లో ప్రసారం చేయదలంచిన నేపధ్యం లో వీరి సమావేశం జరిగింది. ఈ సందర్భం గా ‘భగవద్గీతా ఫౌండేషన్’ అడ్వొకేసీ చీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ గంగాధర శాస్త్రి – శ్రీమతి రమాదేవి కి తాను గానం చేసి రూపొందించిన సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత ను అందించారు. ప్రపంచ వ్యాప్తం గా ఉన్న భగవద్గీతా బంధువుల చే రోజుకొక అధ్యాయం చొప్పున 18 రోజులపాటు గీతా పారాయణం చేయించి, ఆయా అధ్యాయాలలోని ముఖ్యమైన శ్లోకాల వ్యాఖ్య తో నిత్యజీవితం లో భగవద్గీత ఆచరణం గురించిన గాన ప్రసంగం గా కార్యక్రమాన్ని రూపొందించదలచినట్టు గంగాధర శాస్త్రి చెప్పారు. ఈ సమావేశం లో భక్తి ఛానల్ ప్రోగ్రాం చీఫ్ శ్రీ రఘు పాల్గొన్నారు…
తాను పుట్టిన ఊరు ఎలాంటి సమస్యలనూ ఎదుర్కొనరాదని – తన మ
Posted on by user
తాను పుట్టిన ఊరు ఎలాంటి సమస్యలనూ ఎదుర్కొనరాదని – తన మాతృ భూమి సేవే పరమాత్ముని సేవగా భావించి, తన యావదాస్తిని తన స్వగ్రామమైన ప్రాతళ్ల మెరక అభివృద్ధి కి కేటాయించి, ఈ దేశం లోనే ఒక ఆదర్శవంతమైన గ్రామం గా తీర్చిదిద్దిన మహనీయుడు, నిజమైన దేశభక్తుడు శ్రీ వేగిరాజు శివవర్మ ! ఇటీవల తన కుమార్తె చి|| సంజన వివాహ వేడుకలకు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ని ఆహ్వానించగా – దంపతులు చి|| అవినాష్, చి|| ల|| సౌ|| సంజన లకు – భగవద్గీత గ్రంధాన్ని అందజేసి ఆశీస్సులందించారు. ఈ సందర్భం గా కొన్ని చిత్రాలు ఇక్కడ..
చాలా మందికి తీసుకోవడం లో ఉన్న ఆనందం ఇవ్వడం లో ఉండదు… తెలియదు
Posted on by user
చాలా మందికి తీసుకోవడం లో ఉన్న ఆనందం ఇవ్వడం లో ఉండదు… తెలియదు కూడా.. ఇవ్వడం మొదలు పెడితే నువ్వు శాశ్వతుడివవుతావు. శ్రీ రాముడి లాగా.. కర్ణుడి లాగా.. శిబి చక్రవర్తి లాగా..!!! పరోపకారాయ ఫలంతి వృక్షా : I పరోపకారాయ వహంతి నద్యః I పరోపకారాయ చరంతి గావః I పరోపకారార్థమిదం శరీరమ్ II అంటాడు భర్తృహరి … వృక్షాలు, నదులు, గోవులు .. అన్నీ లోకం కోసమే జీవిస్తున్నాయి. మనిషి మాత్రమే స్వార్థం తో తనకోసమే జీవిస్తున్నాడు.. ఇతరుల కోసమే ఈ జీవితం అనే సత్యాన్ని, ధర్మాన్ని తెలుసుకోవాలి. నహి కల్యాణకృత్ కశ్చిత్ దుర్గతిమ్ తాత గచ్ఛతి I అని గీత లో పరమాత్ముడు చెప్పినట్టు- లోకం కోసం మంచి పనులు చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు. శాశ్వతుడు అవుతాడు. ఎవడు తనకోసం ఆలోచిస్తాడో – తాను ఉన్నంత వరకే ఉంటాడు. ఎవడు లోకం కోసం ఆలోచిస్తాడో వాడు లోకం ఉన్నంతకాలం చిరంజీవి గా ఉండిపోతాడు.
ఈ ఆలోచనా విధానమే ఒక వ్యక్తిని చిరంజీవిని చేసింది.. ఆయన పేరు శ్రీ వేగిరాజు శివ వర్మ . పుట్టింది పశ్చిమ గోదావరి ప్రాతళ్ల మెరక గ్రామం. అభివృద్ధికి ఏ మాత్రం నోచుకోని ఆ గ్రామాన్ని – 25 సంవత్సరాల కాల వ్యవధి పెట్టుకుని తన ఆస్తిని, ఆదాయాన్ని, చివరకు తన యావజ్జీవితాన్ని అంకితం చేసి ఈ దేశం లోనే ఆదర్శ గ్రామం గా, గుడిసెలు లేని, సమస్యలు లేని గ్రామం గా తీర్చి దిద్దాడు. ‘పద్మశ్రీ’ లకు అతీతమైన ఖ్యాతి గడించాడు.
తన సోదరి పేరుమీద ‘విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్’ ను స్థాపించి శ్రీ శివవర్మ తన ఊరి ఋణం తీర్చుకున్న ఈ నేపధ్యం లో… అత్యంత వైభవం గా ప్రాతళ్ల మెరక లో జరిగిన రజతోత్సవ వేడుకలకు గౌరవ అతిథి గా, కార్యక్రమ సంధాన కర్త గా – భగవద్గీత ను ప్రచారం చేయడానికే తన జీవితాన్ని అంకితం చేసిన గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యస్థాపకులు అయిన శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ని ఆహ్వానించారు. భగవద్గీతను ఆచరించి చూపించిన శ్రీ శివ వర్మ లోకానికి ఆదర్శమని, తనవల్ల తన వల్ల ప్రయోజనం పొందిన వారి కళ్ళలో ఆనందం చూసి ఆనందించడమే నిజమైన, శాశ్వతమైన ఆనందమని తెలుసుకున్న నిష్కామ కర్మ యోగి అనీ శివవర్మను- గంగాధర శాస్త్రి ప్రశంసించారు. శ్రీ శివవర్మ – ఈ కార్య క్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ గంగాధర శాస్త్రి గానం చేసిన సంపూర్ణ భగవద్గీత సి డి ప్యాక్ ను బహుమతి గా అందించి సత్కరించారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ పీ మురళీధర రావు
Posted on by user
భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ పీ మురళీధర రావు – రాజకీయాలకు అతీతం గా , రాష్ట్రాలు వేరైనా తెలుగువారంతా ఒక్కటే అనే నినాదం తో, తెలుగు సంస్కృతీ సంప్రదాయాల ఔన్నత్యాన్ని తరువాత తరాల వారికి వారసత్వ సంపదగా అందించాలనే ధ్యేయం తో ‘తెలుగు సంగమం’అనే సంస్థని స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఈ నెల 19 న ‘సంక్రాంతి సమ్మేళనం’ కార్యక్రమాన్ని అత్యంత వైభవం గా నిర్వహించారు. తెలుగు జాతి సమైక్య గీతి ని విశేషం గా కాపాడుకున్న ఈ కార్యక్రమం లో పలువురు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, కళా, సేవా రంగాయాలకు చెందిన ప్రముఖులు వందలాదిగా తరలి వచ్చారు. శ్రీ పి మురళీధర రావు స్వాగత వచనాలతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ విశేషమైన కార్యక్రమానికి ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతాఫౌండషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి సమన్వయకర్త గా, వ్యాఖ్యాతగా, గాయకుడు గా వ్యవహరించి కార్యక్రమాన్ని రంజింపచేశారు. ఆయన గానానికి తాను పరవశించానని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన తెలంగాణా రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళ సై సౌందరరాజన్ ప్రశంసించి గంగాధర శాస్త్రి ని సత్కరించారు.
ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ మరో విశిష్ట అతిథి గా విచ్చేసారు. ఈ కార్యక్రమం లో ప్రసిద్ధ సినీనటులు శ్రీ కృష్ణం రాజుని, గేయ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ని తెలుగుసంగమం వేదిక ఘనం గా సత్కరించింది.