Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

సెయింట్ లూయీస్, అమెరికా లోని ‘ప్రవాస గాయత్రి సమాఖ్య’ నిర్వాహకులు, భగవద్గీతా బంధువు శ్రీ స్వర్ణ ప్రసాద్ స్వగృహం లో ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చే భగవద్గీత లోని ‘కర్మ యోగం’ పై ప్రవచనం ఏర్పాటయింది.(26.8.2023). ఆ సందర్భం గా కొన్ని దృశ్యాలు ఇక్కడ…..

సెయింట్ లూయీస్, అమెరికా లోని ‘ప్రవాస గాయత్రి సమాఖ్య’ నిర్వాహకులు, భగవద్గీతా బంధువు శ్రీ స్వర్ణ ప్రసాద్ స్వగృహం లో ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చే భగవద్గీత లోని ‘కర్మ యోగం’ పై ప్రవచనం ఏర్పాటయింది.(26.8.2023). ఆ సందర్భం గా కొన్ని దృశ్యాలు ఇక్కడ…..

అమెరికా తిరుపతి గా ప్రసిద్ధి గాంచిన పిట్స్ బర్గ్ లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం లో భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్ధాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి భగవద్గీతా గాన ప్రవచనం….

అమెరికా తిరుపతి గా ప్రసిద్ధి గాంచిన పిట్స్ బర్గ్ లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం లో భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్ధాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి భగవద్గీతా గాన ప్రవచనం చేశారు.(1.9.2023) కర్మ భక్తి జ్ఞాన మార్గాల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి నిమిత్తం గా చేసుకుని ప్రపంచ మానవాళిని సన్మార్గం లో నడిపించడానికి చేసిన కర్తవ్య బోధే భగవద్గీత అని శ్రీ గంగాధర శాస్త్రి అన్నారు. ఇది కేవలం హిందువులకు మాత్రమే పరిమితమైన బోధ కాదని సకల మానవాళికి ఉపయుక్తమైనదని అన్నారు. భగవద్గీత చదవాల్సింది వృద్ధాప్యం లో కాదని బాల్యదశ నుంచే అని, చదివి, అర్ధం చేసుకుని, ఆచరించి, ప్రచారం చేయడం భగవద్గీత పరమార్ధమని భావించాలని అన్నారు. కర్మ ను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే జ్ఞానం లభిస్తుందన్నది గీతోపదేశం పరమార్ధమని గంగాధర శాస్త్రి అన్నారు. విశ్వరూప సందర్శన యోగం లోని శ్లోకాలను గానం చేస్తున్నప్పుడు గంగాధర శాస్త్రి తో పాటు ప్రేక్షకులు కూడా చెమర్చిన కళ్ళతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆలయ ట్రస్టీ శ్రీ కొత్తపల్లి శ్రీనివాస్ కి గంగాధర శాస్త్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెలిజియస్ ఛైర్ శ్రీ కళ్యాణ్ స్వాగత వచనాలు పలుకగా, ఎక్సిక్యూటివ్ కమిటీ అధ్యక్షులు శ్రీ ప్రభానంద్ యడ్ల మాట్లాడుతూ – ఒక గాయకుడు భారతీయ ఆధ్యాత్మిక సారమైన భగవద్గీతను స్వీయ సంగీతం లో తెలుగు తాత్పర్య సహితం గా 9 ఏళ్ల పాటు గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, విడుదల చేసి, అంతటితో తన బాధ్యత తీరిపోయిందని భావించకుండా, భగవద్గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేయడం భారతీయ సంగీత చరిత్రలో ఇదే ప్రథమమని, శ్రీ గంగాధర శాస్త్రి తెలుగువాడు కావడం గర్వకారణమని చెబుతూ వేదికకు ఆహ్వానించారు. ఆలయ ప్రధానార్చకులు శ్రీమాన్ గోపాల భట్టర్, శ్రీమాన్ సముద్రాల వెంకటాచార్యులు, ఆలయ బోర్డు సభ్యులతో కలిసి శ్రీ గంగాధర శాస్త్రి జ్యోతి ప్రకాశనం చేశారు. తొలుత ఆలయ మర్యాదలతో కమిటీ సభ్యులు శ్రీ గంగాధర శాస్త్రి కి స్వాగతం పలికి శ్రీ వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భం గా సౌండ్ ఇంజినీర్ శ్రీ కార్ల్ ను గంగాధర శాస్త్రి ప్రత్యేకం గా అభినందించారు. కార్యక్రమ ప్రారంభం లో శ్రీ గంగాధర శాస్త్రి భగవద్గీతా ప్రయాణానికి సంబంధించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.

సెయింట్ లూయిస్, అమెరికా లోని ‘ప్రవాస గాయత్రి సమాఖ్య’ ఆధ్వర్యం లో మహాత్మా గాంధీ సెంటర్ లో జరిగిన (27.8. 2023) గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి గారి ‘గీతా గాన ప్రవచనం’….

సెయింట్ లూయిస్, అమెరికా లోని ‘ప్రవాస గాయత్రి సమాఖ్య’ ఆధ్వర్యం లో మహాత్మా గాంధీ సెంటర్ లో జరిగిన (27.8. 2023) ‘గీతా గాన ప్రవచనం’ కార్యక్రమంలో ప్రజలు అత్యధిక సంఖ్య లో పాల్గొని ఘన విజయం చేకూర్చారు. ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి తన గీతా గాన ప్రవచనం లో భగవద్గీత తో పాటు ఘంటసాల, అన్నమయ్య భక్తి గీతాలతో, భజనలతో రెండున్నర గంటలసేపు ప్రేక్షకులకు స్పూర్తినిస్తూ గీతా మార్గం లో ప్రయాణించారు. ”అమెరికన్స్ తో పాటు కలిసి మెలుగుతున్న భారతీయుల పిల్లలు ఒక పక్క తమ తల్లి తండ్రుల సంస్కృతిని, మరోపక్క అమెరికన్స్ జీవన విధానాన్ని అర్ధం చేసుకుంటూ నడవడం లో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని, తత్కారణం గా అశాంతి పెరిగి పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గంగాధర శాస్త్రి అన్నారు. దీనికి పరిష్కారం – బాల్యదశ నుండే మన పిల్లలకు స్వధర్మాన్ని, సంప్రదాయాలను, భగవద్గీతను తెలియజేయడం ఒక్కటే అని, మన సంస్కృతిని, మాతృ భాషను తరువాత తరం వారికి తెలియజేయాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని ‘శ్రేయాన్ స్వధర్మో విగుణః’ అనే గీతా శ్లోకాన్ని తాత్పర్య సహితం గా శ్రీ గంగాధర శాస్త్రి గుర్తు చేస్తూ వివరించారు. ‘గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే’ అని చెబుతూ గీత లో అతి ముఖ్య శ్లోకాలను నిజ జీవితం లో ఆచరించడం ద్వారా మానసిక వత్తిడి లేని ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపవచ్చని అన్నారు. తనకీ అవకాశం ఇచ్చిన శ్రీ ప్రసాద్ స్వర్ణ కు గంగాధర శాస్త్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. కార్యక్రమం విజయవంతం కావడానికి దోహదం చేసిన శ్రీ నారాయణ బొమ్మిరెడ్డిపల్లి, శ్రీ వెంకట్ ధర్మవరపు, శ్రీ హరి కావూరి, రవి ప్రకాష్ శ్రీపాద, శ్రీ సాయి స్తబ్నవిస్ లకు ధన్యవాదాలు తెలియజేసారు. ప్రసిద్ధ నాట్యకళాకారిణి, నాట్యాచారిణి శ్రీమతి అర్చన ఉపమాక సుమధురమైన తెలుగు లో వ్యాఖ్యానం అందించారు. ప్రసిద్ధ నాట్యాచారిణి శ్రీమతి సుజాత వింజమూరి, శ్రీమతి సునీత ధర్మవరపు, శ్రీమతి నీలిమ స్వర్ణ, శ్రీమతి ప్రియా నందనవనం, శ్రీమతి లావణ్య కావూరి, శ్రీమతి మాధవి స్తబ్నవిస్ లు జ్యోతి ప్రకాశనం చేసిన అనంతరం శ్రీ ప్రసాద్ స్వర్ణ – భగవద్గీతా వ్యాప్తి కి శ్రీ గంగాధర శాస్త్రి చేస్తున్న కృషిని వివరిస్తూ ఆయనను వేదికకు ఆహ్వానించారు. శ్రీ శ్రీనివాస ఐనాపురపు – గంగాధరు జూటము విడి /పొంగుచు యేతెంచెనేమొ పుష్కరవేళన్ /జంగమ తీర్థపు గళమున /సంగమమైనట్టి గంగ చప్పున మెఱిసెన్ / అంటూ తన పద్య రత్న మాలతో గంగాధర శాస్త్రి ని సత్కరించారు. శ్రీ జయరాం అద్దేపల్లి, శ్రీమతి జయంతి లు స్ప్రింగ్ ఫీల్డ్ నుంచి మూడున్నర గంటల రోడ్డు ప్రయాణం చేసి ఈ కార్యక్రమానికి హాజరై దివ్యమైన అనుభూతిని, భగవద్గీతా స్ఫూర్తిని పొందామని అన్నారు. యూట్యూబ్ వీడియోలు చూసిన స్ఫూర్తి తో శ్రీ గంగాధర శాస్త్రి గీతా ప్రవచనాన్ని ప్రత్యక్షం గా వినేందుకు సుదూరాలనుంచి అభిమానులు తరలిరావడం విశేషం.

కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరం లో శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ( VEDA TEMPLE ) ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన ప్రచారకర్త డా. ఎల్. వి. గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం…

కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరం లో శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ( VEDA TEMPLE ) ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన ప్రచారకర్త డా. ఎల్. వి. గంగాధర శాస్త్రి ని అయన రెండు రోజుల గీతా గాన ప్రవచనం అనంతరం ‘భగవద్రత్న భగవద్గీతర్షి’ బిరుదుతోను, ప్రశంసా పత్రం తోను, స్వర్ణకంకణం తోను ఘనo గా సత్కరించింది. VEDA TEMPLE వ్యవస్థాపకులు, ప్రసిద్ధ వేద పండితులు, జ్యోతిష శాస్త్రజ్ఞులు, సుకవి బ్రహ్మశ్రీ మారేపల్లి నాగ వేంకట శాస్త్రి శ్రీ గంగాధర శాస్త్రిని – ప్రశంసా పత్రం చదివి, వేద ఆశీర్వచనo తోను పట్టు వస్త్రాలతోనూ సత్కరించారు. ‘సిలికానాంధ్ర’ వ్యవస్థాపకులు శ్రీ కూచిభొట్ల ఆనంద్ చేత శ్రీ గంగాధర శాస్త్రి కి స్వర్ణ కంకణ ధారణ చేయించారు. సంస్కృతాంధ్రాలలో అపారమైన విద్వత్సంపన్నుడు అమెరికా లో స్థిరపడిన ద్విసహస్రాధాని బ్రహ్మశ్రీ పాలడుగు శ్రీచరణ్ ఈ రెండు రోజుల కార్యక్రమానికి విశిష్ఠ అతిధి గా హాజరై గీతాప్రచారం కోసం శ్రీ గంగాధర శాస్త్రి చేస్తున్న కృషిని కొనియాడుతూ … ఆనయాతాద్యశోదాత్మ / గోవిందోయం జనార్దనః / లక్కావఝల వంశాబ్ధి / గ్లౌ గంగాధర శాస్త్రిణమ్ / వంటి పద్యరత్నాలతో ఆశీర్వదించారు. శ్రీ గంగాధర శాస్త్రి నిత్య జీవితం లో భగవద్గీత ఆవశ్యకత గురించి స్ఫూర్తిదాయకం గా వివరిస్తూ, గీతా గానం చేస్తూ, మధ్య మధ్యలో ఘంటసాల భక్తి గీతాలు, అన్నమయ్య కీర్తనలు, భజనలు గానం చేశారు. విశ్వరూప సందర్శన యోగం లోని శ్లోకాలను గానం చేస్తూ తాత్పర్యం చెబుతున్నప్పుడు ప్రాంగణం కరతాళధ్వనులతో మార్మోగిపోయింది. స్వార్ధ రహిత ఉత్తమ సమాజ నిర్మాణమే ధ్యేయం గా తాము చేస్తున్న భగవద్గీతా ప్రచారానికి, భగవద్గీతా ఫౌండేషన్ కి చేయూతనందించవలసిందిగా శ్రీ గంగాధర శాస్త్రి కోరుతూ, తనకు ఉత్తమమైన వేదిక, ఆత్మీయ ఆతిధ్యం అందించడం తో పాటు ఫౌండేషన్ కు చేయూతనందించడం లో కృషి చేసిన బ్రహ్మశ్రీ నాగ వెంకట శాస్త్రి దంపతులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. తన కార్యక్రమం గురించి తెలుసుకుని విచ్చేసిన హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ఉపాధ్యాయుల రాధాకృష్ణ, శ్రీ శ్రీనివాస మూర్తి, కతార్ దేశ వాస్తవ్యలు శ్రీ ఆదిత్య దంపతుల కు గంగాధర శాస్త్రి ధన్యవాదాలు తెలియజేసారు.

‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి భగవద్గీతా ప్రచార కార్యక్రమాల కోసం అమెరికా లో పర్యటిస్తూ శాన్ డియాగో కు చేరుకున్నారు.

‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి భగవద్గీతా ప్రచార కార్యక్రమాల కోసం అమెరికా లో పర్యటిస్తూ శాన్ డియాగో కు చేరుకున్నారు. ఆయనను ఆహ్వానించిన ‘గీతా ఫౌండేషన్’ అమెరికా శాఖ అధ్యక్షులు డాII రాధాకృష్ణ తమిరిసా, గీతా బంధువు శ్రీ ప్రవీణ్ పురాణం తో కలిసి ఆ రోజు (11.8.2023) లహోయా సముద్రపు ఒడ్డున భగవద్గీతా కార్యక్రమం గురించి మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఆమార్గం లో ఒక బెంచ్ మీద కూర్చుని, దూరం నుంచి తెల్ల చొక్కా తెల్ల లుంగీ ధరించిన గంగాధర శాస్త్రి ని గమనిస్తున్న ఒక అమెరికన్ యువకుడు గంగాధర శాస్త్రి దగ్గరకు వెళ్లి ‘నమస్తే … నా పేరు అలెక్స్ .. శాండియాగో లోని ఒక స్టార్ హోటల్ లో సీనియర్ షెఫ్ గా పనిచేస్తున్నాను. నాకు కాబోయే భార్య జిల్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ …ఎందుకో మిమ్మల్ని చూడగానే పరిచయం చేసుకోవాలని అనిపించింది. మీరు ఇండియన్ కదూ.. నాకు ఇండియన్ స్పిరిట్యువాలిటీ అంటే చాలా ఇష్టం..’ అంటూ పరిచయం చేసుకున్నాడు. అతనితో గంగాధర శాస్త్రి కాసేపు సంభాషించారు. భగవద్గీత సారాంశం వివరించారు. ఈ లోపు డాII రాధాకృష్ణ, శ్రీ ప్రవీణ్ లు మరుసటి రోజు జరిగే గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం కార్యక్రమానికి ఆహ్వానించారు. అలెక్స్ తనకు కాబోయే శ్రీమతి జిల్ తో శివ విష్ణు దేవాలయానికి వచ్చాడు. శ్రీ ప్రవీణ్ పురాణాన్ని అనువదించమని కోరి మరీ రెండు రోజుల గీతా గాన ప్రవచన కార్యక్రమాన్ని ఆద్యంతం భక్తి శ్రద్ధలతో ఆనందించారు అలెక్స్, జిల్ దంపతులు.. గంగాధర శాస్త్రి భజనలు చేయించినప్పుడు అలెక్స్ దంపతులు భక్తి పారవశ్యం తో కరతాళ ధ్వనులతో భజనలు చేశారు. కార్యక్రమం మొత్తాన్ని జిల్ తన కెమెరా లో భద్రపరుచుకుంది… ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలలో ఆమె కనిపిస్తున్న ఫోటోలు తప్ప మిగిలినవన్నీ ఆమె తీసినవే… ఎక్స్ప్రెషన్స్ ని క్లిక్ చేయడం తన ప్రేత్యేకత అని చెప్పింది జిల్ … రెండురోజుల ప్రవచన కార్యక్రమం అనంతరం గంగాధర శాస్త్రి అలెక్స్ దంపతులను దుశ్శాలువతో సత్కరించి పండ్లు అందించారు. ఆ సమయం లో అలెక్స్ అశ్రునయనాలతో భావోద్వేగానికి గురయ్యాడు. ‘నన్ను మీ శిష్యుడు గా స్వీకరిస్తారా.. నేను మీతో భారత దేశానికి వచ్చి సేవచేయడానికి సిద్ధం గా ఉన్నాను. నేను హిందువు గా మారిపోతాను ‘ అని అభ్యర్ధించాడు. అందుకు గంగాధర శాస్త్రి… ” మత మార్పిడులు మా అభిమతం కాదు. మతం తల్లి లాంటిది. మతం మారే ప్రయత్నం తల్లిని వదిలిపెట్టడం లాంటిది. అది అమానుషమైన చర్య. హిందువులు ఇలాంటి అకృత్యాలకు ఒడిగట్టరు … మనమందరం ఒక్కటే. మన అందరికి ఒక్కడే’ అనేది హిందూ ధర్మ సిద్ధాంతం.. మాది మతం కాదు. ధర్మం .. మీరు అమెరికా లోనే ఉండండి. మీ మాతృభూమిని వదిలిపెట్టొద్దు. ఆదర్శ దంపతులుగా మెలగండి. భారతీయులు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వీలు కుదిరినప్పుడల్లా వెళ్ళండి.. ఆధ్యాత్మిక సారాన్ని అర్ధం చేసుకోవడానికి, అటుపై ఆచరించడానికి ప్రయత్నించండి. మీరు సంపాదించే ధనాన్ని కొంత సమాజ సేవకు ఖర్చుపెట్టండి. మీ పిల్లలను దైవ భక్తి, దేశభక్తి కలిగి ఉండేలా, కుటుంబ వ్యవస్థ పై గౌరవం పెరిగేలా పెంచండి… సమాజానికి స్ఫూర్తి అందించేలా ఎదగండి.” అంటూ ఆశీర్వదించారు. మొత్తంమీద శాండియాగో లో జరిగిన శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచన కార్యక్రమానికి వచ్చిన తెలుగు వారి మధ్య అమెరికా జంట అలెక్స్, జిల్ లు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.

‘హిందూ టెంపుల్ ఆఫ్ శాన్ ఆంటోనియో’ లో 30.7.2023 న భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి గారి ‘గీత-వ్యక్తిత్వ వికాసం’ అనే అంశం పై స్ఫూర్తిదాయక ప్రసంగం…

భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ‘గీత-వ్యక్తిత్వ వికాసం’ అనే అంశం పై స్ఫూర్తిదాయకo గా చేసిన భగవద్గీతా గాన ప్రసంగానికి ప్రేక్షకులు విశేషం గా స్పందించారు. గీతాచరణ ద్వారా నిత్యజీవితాన్ని వత్తిడికి దూరం గా ఎలా ఆనందమయం చేసుకోవచ్చో గంగాధర శాస్త్రి వివరించారు. మనకు నచ్చిందని ఏదిపడితే అది చేసుకుంటూ పోరాదని, అది శాస్త్రసమ్మతమై ఉండాలని, ఆ శాస్త్రమే గీతా శాస్త్రమని, ‘తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యా కార్య వ్యవస్థితౌ’ అన్న పరమాత్మ వాక్కు మానవ జాతికి అనుసరణీయమని గంగాధరశాస్త్రి అన్నారు, ఈ కార్యక్రమం ‘హిందూ టెంపుల్ ఆఫ్ శాన్ ఆంటోనియో’ లో 30.7.2023 న ఉదయం జరిగింది. దేవాలయ కార్యవర్గం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చక స్వాములు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ గంగాధర శాస్త్రి కి తీర్థ ప్రసాదాలు అందించారు. డాII మీనాక్షి శ్రీ గంగాధర శాస్త్రి స్వాగత వచనాలతో వేదికపైకి ఆహ్వానించారు. గీతా గాన ప్రవచనం అనంతరం దేవాలయ పాలకమండలి చైర్మన్ శ్రీ రామకృష్ణ జూలుకుంట్ల, డా మీనాక్షి, శ్రీ కేదార్నాథ్ చింతపల్లి దంపతులు, శ్రీ రాజేశ్వర రావు టేకుమళ్ళ, శ్రీ గంగాధర శాస్త్రి ని సత్కరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు గంగాధర శాస్త్రి ఆశీస్సులు తీసుకుని ఫోటోలు దిగారు. ప్రవచనం కార్యక్రమానికి ముందు శ్రీమతి జయంతి కోట శిక్షణలో, బాలబాలికలు భగవద్గీత లోని ‘భక్తి యోగము’ పఠించగా గంగాధర శాస్త్రి ఆశీరభినందనలు అందించారు. తనకు ఆత్మీయ ఆతిధ్యం ఇచ్చిన శ్రీ రాజేశ్వర రావు టేకుమళ్ళ, శ్రీమతి జ్యోతి దంపతులకు గంగాధర శాస్త్రి కృతజ్ఞతలు తెలిపారు.

హ్యూస్టన్, అమెరికా ‘తెలుగు కల్చరల్ అసోసియేషన్’ గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ‘ గారి ని LIFETIME ACHIEVEMENT’ అవార్డు తో ఘనం గా సత్కరించింది.

గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని హ్యూస్టన్, అమెరికా ‘తెలుగు కల్చరల్ అసోసియేషన్’ (TCA) ‘LIFETIME ACHIEVEMENT’ అవార్డు తో ఘనం గా సత్కరించింది. అష్టలక్ష్మి దేవాలయం లో ‘భగవద్గీత-జీవన గీత’ అనే అంశం పై శ్రీ గంగాధర శాస్త్రి ఆసాంతం ఆకట్టుకునే గాన ప్రసంగం చేశారు. తొలుత ఆలయ మర్యాదలతో శ్రీ గంగాధర శాస్త్రి కి పూర్ణకుంభ స్వాగతం పలికి, అష్టలక్ష్మి కి ప్రత్యేక పూజలు చేశారు. TCA అధ్యక్షురాలు శ్రీమతి ఆశాజ్యోతి సుమధుర గాత్రం తో స్వాగత వచనాలు పలికి గంగాధర శాస్త్రి ‘గీతా’ ప్రయాణం పై లఘు చిత్రాన్ని ప్రదర్శించగా ప్రేక్షకులు కరతాళధ్వనులు సలిపారు. అనంతరం శ్రీ గంగాధర శాస్త్రి, శ్రీ వంగూరి చిట్టెంరాజు, శ్రీ జితేందర్ రెడ్డి, శ్రీ నరేంద్ర యరబర్ల, శ్రీమతి ఆశాజ్యోతి లు జ్యోతి ప్రకాశనం చేశారు. శ్రీ నరేంద్ర యరబర్ల – శ్రీ గంగాధర శాస్త్రి ని వేదికపైకి స్వాగతం పలికారు. గంగాధర శాస్త్రి తన ప్రసంగం లో భగవద్గీత ను తరువాత తరం వారికి చేర్చే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలని కోరారు. తల్లితండ్రులు తమ బిడ్డలను సర్వస్వం గా భావించి, కంటికి రెప్పలా కాపాడుకుంటూ, పెంచి పెద్ద వాళ్ళను చేస్తే – జీవితం విలువ తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అమెరికా లో భారతీయుల పిల్లలు కొందరు – తల్లి తండ్రులకి చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయి తల్లి తండ్రుల పట్ల గౌరవ భావం లేక, క్షోభకు గురిచేస్తున్నారని, పిల్లలకు 18 ఏళ్ళు దాటగానే తల్లి తండ్రులను లెక్కచేయని పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితులను ‘ చర్చి’ లలో ప్రార్ధనలు చేస్తామంటూ ఇతర మతాలు ఉపయోగించుకుంటున్నాయని, ఈ పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే తల్లి తండ్రులు తమ బిడ్డలతో వీలైనంత సమయం గడపాలనీ, బాల్యం లోనే తమ బిడ్డలకు భారతీయ ఆధ్యాత్మికత ను పరిచయం చేయాలనీ, భగవద్గీత ను సాధన చేస్తే స్థితప్రజ్ఞత అలవడుతుందని, ప్రతి ఒక్కరూ మానసిక వత్తిడి నుంచి బయట పడవచ్చని, ఎటువంటి సంక్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం గీత ఇస్తుందని, స్వార్ధం లేని, లోకహితం కోసం కర్మలను ఆచరించే ఆనందకరమైన జీవితం గడపవచ్చని గంగాధర శాస్త్రి అన్నారు. ప్రారంభం లో కార్యక్రమ వ్యాఖ్యాత శ్రీ గంగాధర శాస్త్రిని ‘పద్మశ్రీ’ అని సంబోధించగా – ‘నేను ‘పద్మశ్రీ’ ని కాదు ‘బ్రహ్మశ్రీ’ ని… పద్మశ్రీ మానవులు ఇచ్చేది. అందులో రికమండేషన్స్ కూడా ఉంటాయి. ‘బ్రహ్మశ్రీ’ పరమాత్మ ఇచ్చేది. ఇందులో నో రికమెండేషన్స్ …’ అంటూ చమత్కరించారు. స్వ ప్రయత్నం తో కాక పరమాత్మ అనుగ్రహంతోనే తాను ఈ గీతా మార్గం లోకి వచ్చానన్నారు. శ్రీ వంగూరి చిట్టెంరాజు, శ్రీ జితేందర్ రెడ్డి, శ్రీమతి ఆశాజ్యోతి, శ్రీ నరేంద్ర యరబర్ల లు గంగాధర శాస్త్రిని ‘లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు’ తోను, శ్రీ నరేంద్ర యరబర్ల దంపతులు పట్టుబట్టలతోను సత్కరించారు. ఈ కార్యక్రమానికి రథసారధి, తనకు ఆత్మబంధువైన శ్రీ నరేంద్ర యరబర్ల కు గంగాధర శాస్త్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భగవద్గీతా ఫౌండేషన్ తలపెట్టిన కార్యక్రమాలకు చేయూతను అందించవలసింది గా ప్రేక్షకులను కోరారు. కార్యక్రమ ప్రారంభం లో భగవద్గీత లో ‘భక్తి యోగం’ పఠించిన బాల బాలికలకు, ఈ కార్యక్రమానికి సౌండ్ ఇంజనీర్స్ గా వ్యవహరించిన అమెరికన్స్ కు, కార్యక్రమానికి సాంకేతిక సమన్వయకర్త గా వ్యవహరించిన ఎల్ విశ్వతేజ కు గంగాధర శాస్త్రి ఆశీరభినందనలు తెలిపారు.

‘వంగూరి ఫౌండేషన్’ ఆధ్వర్యం లో ‘భగవద్గీత- జీవన విలువలు’ అంశం పై గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి ప్రవచనం …..

‘వంగూరి ఫౌండేషన్’ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెంరాజు, శ్రీ మల్లిక్ పుచ్చా, శ్రీ నరేంద్ర యరబర్ల ల ఆధ్వర్యం లో హ్యూస్టన్ లోని తాజ్ రెసిడెన్సీ క్లబ్ హౌస్ లో భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి చేత ‘భగవద్గీత- జీవన విలువలు’ అనే అంశం పై గాన ప్రవచనం ( 20.7.2023) ఏర్పాటు చేశారు. శ్రీ వంగూరి చిట్టెంరాజు స్వాగత వచనాలతో గంగాధర శాస్త్రి ని ఆహ్వానించగా, శ్రీ రవి తమిరిసా పుష్పగుచ్ఛం తో స్వాగతం పలికారు. శ్రీ సత్య గుమ్మడి దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమానికి విచ్చేసిన దివంగత సినీ నటులు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు తనయులు శ్రీ జయ ఎస్. గుమ్మడి, శ్రీమతి పద్మశ్రీ ముత్యాల, శ్రీ కోనేరు ఆంజనేయులు, శ్రీ శౌరి నందగిరి లతో పాటు ప్రతి ఒక్కరు శ్రీ గంగాధర శాస్త్రి గాత్రానికి, గానానికి, గీతా ప్రవచనానికి పరవశులమయ్యామంటూ

అభినందనలు తెలిపారు.ఈ సందర్భం గా తనకు భక్తి పూర్వక ఆత్మీయ ఆతిధ్యం అందించడం తో పాటు సౌండ్ సిస్టమ్ ఏర్పాటులో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న శ్రీ నరేంద్ర యరబర్ల దంపతులకు గంగాధర శాస్త్రి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

సియాటెల్ లోని ఇస్కాన్ సభ్యుల అద్వర్యం లో భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి గారి “గీతా సత్సంగం”

సియాటెల్ లోని ఇస్కాన్ సభ్యుల అద్వర్యం లో భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి గారి చే (17.7.2023)గీతా సత్సంగం జరిగింది. లోక శ్రేయస్సును కాంక్షిస్తూ కృష్ణ మార్గాన్ని ప్రచారం చేస్తే వేదాంత ప్రభుపాద లాగా శాశ్వతులవుతారని గంగాధర శాస్త్రి అన్నారు. భగవద్గీతే శ్రీకృష్ణ తత్వమని, లోకహితం కోసం, స్వార్ధ రహితo గా, దైవార్పణ బుద్ధి తో కర్మలు చేయాలనేదే భగవద్గీతా సారాంశమని అన్నారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ శ్రీ గంగాధర శాస్త్రి గానం చేసిన భగవద్గీతను ఎన్నోమార్లు విన్నామని, గాన పద్ధతి లో ఆయన అందించే గీతా సందేశాన్ని విని స్ఫూర్తి పొందామని, సామాన్యుడికి అర్ధమయ్యే రీతిలో ఆయన గీతకు ఇస్తున్న వివరణ ఎంతో మందిని ప్రభావితం చేస్తోందని చెబుతూ శ్రీ గంగాధర శాస్త్రి ని సత్కరించారు. ఆ తర్వాత తనకు ఆత్మీయ ఆతిధ్యం ఇచ్చిన శ్రీ నండూరి జయరాం, శ్రీమతి కళ్యాణి దంపతులను గంగాధరశాస్త్రి సత్కరించారు. సియాటెల్ వాసులు నిర్వహించిన పలు ‘గీతా’ కార్యక్రమాలలో పాల్గొన్న శ్రీ గంగాధర శాస్త్రి జులై 18 న హ్యూస్టన్ చేరుకున్నారు.

వాషింగ్టన్ లోని సియాటెల్ లో వైభవం గా ప్రా రంభమయిన ‘గీతా గాన ప్రచార శంఖారావం’…..

ప్రసిద్ధ గాయకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త , భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ‘గీతా గాన ప్రచార శంఖారావం’ పేరుతో అమెరికా పర్యటన చేస్తున్న నేపధ్యం లో తొలి కార్యక్రమం వాషింగ్టన్ లోని సియాటెల్ లో వైభవం గా జరిగింది. రెడ్మoడ్ లోని లక్ష్మీ వేంకటేశ్వర దేవాలయం లో ఏర్పాటైన తొలి రోజు కార్యక్రమం లో శ్రీ గంగాధర శాస్త్రి తన ప్రవచనం లో భగవద్గీత పరిచయం తో పాటు అన్నమయ్య కీర్తనలు, ఘంటసాల భక్తి గీతాలు, భజనలు ఆలపించారు. కార్యక్రమానంతరం ప్రేక్షకులు ఆనందాశృవులతో తమ ఆనందాన్ని గంగాధర శాస్త్రి తో పంచుకున్నారు. అంతకు ముందు దేవాలయ ప్రధానార్చకులు శ్రీమాన్ ఉదయభాస్కర పరాశర దీక్షితులు గంగాధర శాస్త్రిని సత్కరించి, సమున్నతమైన పరిచయ వాక్యాలతో వేదికపైకి స్వగతం పలికారు. తనకు ఆత్మీయ ఆతిథ్యం అందించిన శ్రీ నండూరి జయరాం, శ్రీమతి కళ్యాణి దంపతులకు, కార్యక్రమ ఏర్పాటుకు మూలకారకులైన శ్రీ శేఖర్ రావు బసవరాజు లకు గంగాధర శాస్త్రి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.