Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ పథకానికి…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ పథకానికి సంబంధించిన ‘స్పందన ‘ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలులో 16. 11. 2019 న A1 కన్వెన్షన్ హాల్ లో అత్యంత వైభవంగా జరిగింది. ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పోల భాస్కర్ IAS ఆహ్వానం మేరకు నేపధ్య గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా శిక్షణ పూర్తి చేసుకుని గ్రామ సచివాలయ ఉద్యోగాలు పొంది విధులలోకి అడుగుపెడుతున్న యువతరం ఉద్యోగులను ఉద్దేశించి గంగాధర శాస్త్రి ఉద్యోగ ధర్మాలను ఆసక్తి దాయకంగా వివరిస్తూ, మధ్య మధ్య ఛలోక్తులతో , పాటలతో ,స్ఫూర్తిదాయకమైన గాన ప్రసంగం చేశారు. కార్యక్రమ అనంతరం శ్రీ పోల భాస్కర్ IAS, శ్రీ ఎం గిరిజా శంకర్ IAS, కమీషనర్ ( P.R & R.D ) లు గంగాధర శాస్త్రి ని సత్కరించారు.  

బతుకమ్మ సంబరాలు

భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చ ఆధ్వర్యం లో ఆదివారం నాడు హైదరాబాద్, అంబర్ పేట లోని మహారాణాప్రతాప్ ఫంక్షన్ హాల్ లో బతుకమ్మ సంబరాలు ఘనం గా జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, గౌరవ అతిథి గా భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ గంగాధర శాస్త్రి, బేటీ బచావో -బేటీ పడావో తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి గీతామూర్తి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భం గా గంగాధర శాస్త్రి బతుకమ్మ పండగ విశిష్టతను పాడుతూ వివరించారు. బతుకమ్మ పండగ పరమార్ధం – కేవలం ప్రకృతి మాతను ఆరాధించడమే కాక , పరమాత్మ మనకు ఇచ్చిన శక్తులను శ్రీ కిషన్ రెడ్డి లాగా సేవ రూపం లో తిరిగి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడడం కూడా అని తెలుసుకోవాలన్నారు.

పువ్వు కాయగా మారడం లాగే… స్త్రీ కూడా నవమాసాలూ మోసి , బిడ్డలు అనే ఫలాలను సమాజానికి అందిస్తుందని, అందుకే తొమ్మిది రకాల పూలతో , తొమ్మిది వరుసలతో పేర్చి , తొమ్మిది రోజుల పాటు, దుర్గా నవరాత్రులలో ఈ బతుకమ్మ పండగను జరుపుతారని అన్నారు.

బతకడమంటే- మనం వెళ్లిపోయిన తర్వాత కూడా లోకం గుర్తుంచుకునే పనులతో మిగిలిపోవడమే అన్నారు..

శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ

ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్య్వవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి గారు తన జన్మ దినం సందర్భంగా – విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని హైదరాబాద్ ఫిలిం నగర్ లోని దైవసన్నిధానం ఆలయం లో సందర్శించి వారి ఆశీస్సులు పొందారు. స్వామి కోరిక మేరకు గంగాధర శాస్త్రి కొన్ని భక్తి గీతాలను ఆలపించారు. తనకు గంగాధరశాస్త్రి అన్నా ఆయన గాత్రమన్నా అభిమానమని స్వరూపానంద అన్నారు. ఘంటసాల గీతాలకూ, శ్రీకృష్ణ గీత కూ ప్రచారం కల్పించడానికే భగవంతుడు గంగాధర శాస్త్రి ని ఎంచుకున్నట్టుగా తాను భావిస్తానని, సంపూర్ణ భగవద్గీత రికార్డింగ్ కు తాను ముహూర్తం నిర్ణయించగా, తన జన్మ చరితార్ధమయ్యేలా గంగాధర శాస్త్రి గీతను గానం చేశారని స్వరూపానంద అన్నారు. ఈ సందర్భం గా గంగాధర శాస్త్రి – భగవద్గీతా ఫౌండేషన్ సభ్యులతో కలసి – తాము చేయబోతున్న ప్రాజెక్ట్ వివరాలను – స్వరూపానంద కు అందజేయగా -ఇవన్నీ సఫలీకృతం కావాలని స్వామి ఆశీర్వదించారు. త్వరలో తాను హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శిస్తానని అన్నారు. ఫౌండేషన్ సభ్యులు శ్రీయుతులు చలపతి రాజు, చక్రవర్తి , కృష్ణమాచార్యులు స్వామి ఆశీస్సులు పొందారు..

 

వనిత’ టీవీ ఛానల్ అధినేత శ్రీమతి తుమ్మల రమాదేవి..

ప్రేక్షకులను అలరించే కార్యక్రమాల రూపకల్పనలో విశేషమైన ఖ్యాతి గడించిన ‘వనిత’ టీవీ ఛానల్ అధినేత శ్రీమతి తుమ్మల రమాదేవి తో – ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ గంగాధర శాస్త్రి సమావేశమయ్యారు. ‘సంపూర్ణ భగవద్గీతా పారాయణ గాన యజ్ఞం’ శీర్షికన ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని రూపొందించి ప్రసిద్ధ ఛానల్ భక్తి టీవీ లో ప్రసారం చేయదలంచిన నేపధ్యం లో వీరి సమావేశం జరిగింది. ఈ సందర్భం గా ‘భగవద్గీతా ఫౌండేషన్’ అడ్వొకేసీ చీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ గంగాధర శాస్త్రి – శ్రీమతి రమాదేవి కి తాను గానం చేసి రూపొందించిన సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత ను అందించారు. ప్రపంచ వ్యాప్తం గా ఉన్న భగవద్గీతా బంధువుల చే రోజుకొక అధ్యాయం చొప్పున 18 రోజులపాటు గీతా పారాయణం చేయించి, ఆయా అధ్యాయాలలోని ముఖ్యమైన శ్లోకాల వ్యాఖ్య తో నిత్యజీవితం లో భగవద్గీత ఆచరణం గురించిన గాన ప్రసంగం గా కార్యక్రమాన్ని రూపొందించదలచినట్టు గంగాధర శాస్త్రి చెప్పారు. ఈ సమావేశం లో భక్తి ఛానల్ ప్రోగ్రాం చీఫ్ శ్రీ రఘు పాల్గొన్నారు… 

తాను పుట్టిన ఊరు ఎలాంటి సమస్యలనూ ఎదుర్కొనరాదని – తన మ

తాను పుట్టిన ఊరు ఎలాంటి సమస్యలనూ ఎదుర్కొనరాదని – తన మాతృ భూమి సేవే పరమాత్ముని సేవగా భావించి, తన యావదాస్తిని తన స్వగ్రామమైన ప్రాతళ్ల మెరక అభివృద్ధి కి కేటాయించి, ఈ దేశం లోనే ఒక ఆదర్శవంతమైన గ్రామం గా తీర్చిదిద్దిన మహనీయుడు, నిజమైన దేశభక్తుడు శ్రీ వేగిరాజు శివవర్మ ! ఇటీవల తన కుమార్తె చి|| సంజన వివాహ వేడుకలకు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ని ఆహ్వానించగా – దంపతులు చి|| అవినాష్, చి|| ల|| సౌ|| సంజన లకు – భగవద్గీత గ్రంధాన్ని అందజేసి ఆశీస్సులందించారు. ఈ సందర్భం గా కొన్ని చిత్రాలు ఇక్కడ..

చాలా మందికి తీసుకోవడం లో ఉన్న ఆనందం ఇవ్వడం లో ఉండదు… తెలియదు

చాలా మందికి తీసుకోవడం లో ఉన్న ఆనందం ఇవ్వడం లో ఉండదు… తెలియదు కూడా.. ఇవ్వడం మొదలు పెడితే నువ్వు శాశ్వతుడివవుతావు. శ్రీ రాముడి లాగా.. కర్ణుడి లాగా.. శిబి చక్రవర్తి లాగా..!!! పరోపకారాయ ఫలంతి వృక్షా : I పరోపకారాయ వహంతి నద్యః I పరోపకారాయ చరంతి గావః I పరోపకారార్థమిదం శరీరమ్ II అంటాడు భర్తృహరి … వృక్షాలు, నదులు, గోవులు .. అన్నీ లోకం కోసమే జీవిస్తున్నాయి. మనిషి మాత్రమే స్వార్థం తో తనకోసమే జీవిస్తున్నాడు.. ఇతరుల కోసమే ఈ జీవితం అనే సత్యాన్ని, ధర్మాన్ని తెలుసుకోవాలి. నహి కల్యాణకృత్ కశ్చిత్ దుర్గతిమ్ తాత గచ్ఛతి I అని గీత లో పరమాత్ముడు చెప్పినట్టు- లోకం కోసం మంచి పనులు చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు. శాశ్వతుడు అవుతాడు. ఎవడు తనకోసం ఆలోచిస్తాడో – తాను ఉన్నంత వరకే ఉంటాడు. ఎవడు లోకం కోసం ఆలోచిస్తాడో వాడు లోకం ఉన్నంతకాలం చిరంజీవి గా ఉండిపోతాడు.

ఈ ఆలోచనా విధానమే ఒక వ్యక్తిని చిరంజీవిని చేసింది.. ఆయన పేరు శ్రీ వేగిరాజు శివ వర్మ . పుట్టింది పశ్చిమ గోదావరి ప్రాతళ్ల మెరక గ్రామం. అభివృద్ధికి ఏ మాత్రం నోచుకోని ఆ గ్రామాన్ని – 25 సంవత్సరాల కాల వ్యవధి పెట్టుకుని తన ఆస్తిని, ఆదాయాన్ని, చివరకు తన యావజ్జీవితాన్ని అంకితం చేసి ఈ దేశం లోనే ఆదర్శ గ్రామం గా, గుడిసెలు లేని, సమస్యలు లేని గ్రామం గా తీర్చి దిద్దాడు. ‘పద్మశ్రీ’ లకు అతీతమైన ఖ్యాతి గడించాడు.

తన సోదరి పేరుమీద ‘విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్’ ను స్థాపించి శ్రీ శివవర్మ తన ఊరి ఋణం తీర్చుకున్న ఈ నేపధ్యం లో… అత్యంత వైభవం గా ప్రాతళ్ల మెరక లో జరిగిన రజతోత్సవ వేడుకలకు గౌరవ అతిథి గా, కార్యక్రమ సంధాన కర్త గా – భగవద్గీత ను ప్రచారం చేయడానికే తన జీవితాన్ని అంకితం చేసిన గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యస్థాపకులు అయిన శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ని ఆహ్వానించారు. భగవద్గీతను ఆచరించి చూపించిన శ్రీ శివ వర్మ లోకానికి ఆదర్శమని, తనవల్ల తన వల్ల ప్రయోజనం పొందిన వారి కళ్ళలో ఆనందం చూసి ఆనందించడమే నిజమైన, శాశ్వతమైన ఆనందమని తెలుసుకున్న నిష్కామ కర్మ యోగి అనీ శివవర్మను- గంగాధర శాస్త్రి ప్రశంసించారు. శ్రీ శివవర్మ – ఈ కార్య క్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ గంగాధర శాస్త్రి గానం చేసిన సంపూర్ణ భగవద్గీత సి డి ప్యాక్ ను బహుమతి గా అందించి సత్కరించారు.

భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ పీ మురళీధర రావు

భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ పీ మురళీధర రావు – రాజకీయాలకు అతీతం గా , రాష్ట్రాలు వేరైనా తెలుగువారంతా ఒక్కటే అనే నినాదం తో, తెలుగు సంస్కృతీ సంప్రదాయాల ఔన్నత్యాన్ని తరువాత తరాల వారికి వారసత్వ సంపదగా అందించాలనే ధ్యేయం తో ‘తెలుగు సంగమం’అనే సంస్థని స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఈ నెల 19 న ‘సంక్రాంతి సమ్మేళనం’ కార్యక్రమాన్ని అత్యంత వైభవం గా నిర్వహించారు. తెలుగు జాతి సమైక్య గీతి ని విశేషం గా కాపాడుకున్న ఈ కార్యక్రమం లో పలువురు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, కళా, సేవా రంగాయాలకు చెందిన ప్రముఖులు వందలాదిగా తరలి వచ్చారు. శ్రీ పి మురళీధర రావు స్వాగత వచనాలతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

ఈ విశేషమైన కార్యక్రమానికి ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతాఫౌండషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి సమన్వయకర్త గా, వ్యాఖ్యాతగా, గాయకుడు గా వ్యవహరించి కార్యక్రమాన్ని రంజింపచేశారు. ఆయన గానానికి తాను పరవశించానని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన తెలంగాణా రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళ సై సౌందరరాజన్ ప్రశంసించి గంగాధర శాస్త్రి ని సత్కరించారు.

ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ మరో విశిష్ట అతిథి గా విచ్చేసారు. ఈ కార్యక్రమం లో ప్రసిద్ధ సినీనటులు శ్రీ కృష్ణం రాజుని, గేయ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ని తెలుగుసంగమం వేదిక ఘనం గా సత్కరించింది.

ఈ నెల 7వ తేదీన దుబాయ్ లోని – అల్ జుర్ఫ్, అజ్మాన్ లోని..

ఫిబ్రవరి 7వ తేదీన దుబాయ్ లోని – అల్ జుర్ఫ్, అజ్మాన్ లోని ఇండియన్ అసోసియేషన్ హాల్ లో ‘శ్రీనివాస కళ్యాణం’ అత్యంత వైభవం గా జరిగింది. ఈ కార్యక్రమం లో భాగం గా – భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి గారి చే గీతా గాన ప్రవచనం జరిగింది. గత దశాబ్ద కాలం గా ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా వీక్షించిన వందలాదిమంది అభిమానులు గంగాధర శాస్త్రి ప్రవచనానికి తరలివచ్చారు. భగవద్గీత గురించి అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారు, తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సెల్ఫీ లు తీసుకున్నారు. గంగాధర శాస్త్రి గానం చేసిన సంపూర్ణ భగవద్గీత ఆడియో సిడి లను పొందారు. ప్రపంచం లో మిగతా మత గ్రంథాలు మానవుల చేత రచించబడినవనీ, భగవద్గీత – సాక్షాత్తూ పరమాత్ముని ముఖపద్మం నుండి వెలువడి ప్రపంచ మానవాళికి అందిన మహోత్కృష్టమైన దివ్య సందేశమని, దీనిని ప్రతి ఒక్కరూ విని, ఆచరించి, ప్రచారం చేయడం ద్వారా స్వార్ధ రహిత ఉత్తమ సమాజాన్ని స్థాపించవచ్చని, మానసిక వత్తిడి లేని ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చని శ్రీ గంగాధర శాస్త్రి చెప్పారు.

ఫిబ్రవరి 8,9,10 తేదీలలో దుబాయ్ పరిసరాల లోని అబు ధాబి, రాస్ ఆల్ ఖైమా, షార్జా ల లో కూడా శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం తో నిత్య జీవన మార్గం లో భగవద్గీత ఆవశ్యకతను తెలియజేశారు

మహాత్ములు మానవ జాతికి లభించడం మిక్కిలి అరుదు

హైదరాబాద్, బంజారా హిల్స్ లోని భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో సంస్థ వ్యవస్థాపకులు, గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి – సంగీత భరిత సంపూర్ణ ఆంగ్ల భగవద్గీత ఎడిటింగ్ కార్యక్రమం లో ఉన్నారు. ఆ సమయం లో ఓ జంట – తమ ఐదేళ్ల పిల్లవాడితో ఫౌండేషన్ కార్యాలయం లోకి అడుగు పెట్టారు. ఒక చోట కుదురుగా కూర్చోవడంకూడా తెలియని ఆ పిల్ల వాడి పేరు అచ్యుత్ ! కృష్ణ పరమాత్ముడి పేరే.. !
విచిత్రం ఏమిటంటే – వీడికి మాట్లాడడం ఇంకా పూర్తి గా రాకపోయినా ( ఈ విషయమై ఈ పిల్లవాడి తల్లి తండ్రులు శైలజ, కామేశ్వర రావులు అనేక మంది డాక్టర్లను సంప్రదించామని ఆవేదనతో చెప్పారు ) భగవద్గీత లోని 700 శ్లోకాలూ కంఠతా పట్టేసాడు. దీనిని పరమాత్మ అనుగ్రహం, పూర్వ జన్మ వాసన అనక ఇంకేమి అనగలం ? ఈ పిల్లవాడి వృత్తాంతం పునర్జన్మ ను ధ్రువీకరించడం లేదూ..! పైగా ఈ భగవద్గీత ను తల్లి తండ్రులు నేర్పించలేదట. వాడంతట వాడే యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నాడట.. ఇది ఇంకా అద్భుతం. ఆ రోజు పనులన్నీ ఆపేసి.. ఈ అచ్యుతుడి తోనే ఆనందం గా గడిపేశారు గంగాధర శాస్త్రి… ఏ శ్లోకం అడిగినా అత్యద్భుతమైన, పరిణతితో కూడిన, స్పష్టమైన ఉచ్చారణతో ఆ పిల్ల వాడు శ్లోకాలను చెప్పడం చూసి ఆశ్చర్యపోయారు గంగాధర శాస్త్రి… భగవద్గీతను ఏ వయస్సు పిల్లలకు నేర్పించాలి అని చాలామంది అడిగే ప్రశ్నకు ఈ పిల్లవాడే ఉదాహరణ అని, యంయం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం I తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః II (8-6) అని గీతాచార్యుడు చెప్పినట్టు – ‘అంత్య కాలం లో మనుజుడు ఏ ఏ భావాలను స్మరిస్తూ దేహత్యాగం చేస్తాడో మరు జన్మలో అతడు ఆయా భావాలనే పొందుతాడు.’ అనడానికి ఈ పిల్లవాడే ఒక ఉదాహరణ అని గంగాధర శాస్త్రి అన్నారు. ఈ పిల్ల వాడు భవిష్యత్తులో ‘గీతాచార్యుడు’ గా లోకానికి మార్గదర్శి కాగలడని ఆశీర్వదించారు. మనం పోయేటప్పుడు – లౌకికం గా సంపాదించిందంతా ఇక్కడే వదిలేసి పోతామని .. జీవుడు ఒక దేహం విడిచి మరొక దేహం పొందేటప్పుడు తన వెంట ఇంద్రియాలు, మనస్సు తీసుకు వెళతాడని, మనం చేసే కర్మల ఫలితం ఇంద్రియాలకు, మనస్సుకు అంటుకుని ఉంటుందని … ఈ కర్మలే జీవుల ఉత్తమ, అధమ జన్మలను నిర్ణయిస్తాయని గంగాధర శాస్త్రి అన్నారు. అందుకే మంచి పనులు, మంచి ఆలోచనలు చేయాలనీ, స్వార్ధ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని, మతాలకు అతీతమైన భగవద్గీతను ప్రతి ఒక్కరూ పఠించి, ఆచరించాలని పిలుపునిచ్చారు.
 

అది 2006 వ సంవత్సరం … TAMA

శ్రీ శ్రీ శ్రీ చిద్రూపానంద స్వామి, చిన్మయ మిషన్ ( ఢిల్లీ శాఖ అధిపతి ) తన హైదరాబాద్ పర్యటనలో భాగం గా – భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, గీతాగాన ప్రవచన కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి, సంస్థ అడ్వొకసి ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు, డాII పద్మ వీరపనేని, సభ్యులు శ్రీ బి ఎస్ శర్మ , శ్రీ ఎం రఘు తదితరులు చిద్రూపానంద కు ఘన స్వాగతం పలికారు. వారిని ఫల పుష్ప వస్త్రాలతొ సత్కరించి, సంపూర్ణ భగవద్గీత ఆడియో సి డి ని అందించారు. ఈ సందర్భం గా ప్రదర్శించిన The Making of Bhagavadgita – Documentrary ని తిలకించి శ్రీ చిద్రూపానంద – భగవద్గీతా ఫౌండేషన్ కి ఆశీస్సులు అందజేశారు. భగవద్గీత ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీ గంగాధర శాస్త్రి ని అభినందిస్తూ, ఫౌండేషన్ తలపెట్టిన భవిష్యత్తు ప్రాజెక్టులు విజయవంతం కావాలని అందుకు తమ గురుదేవులు శ్రీ చిన్మయానంద ఆశీస్సులు తప్పక ఉంటాయని ఆశిస్తున్నానని అన్నారు. విచ్చేసిన భక్తులు అడిగిన అనేక సందేహాలకు సమాధానాలు చెప్పారు…