Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

భగవద్గీత వృద్ధాప్యపు కాలక్షేపం కాదు. కేవలం పఠనా గ్రంథమూ కాదు. అధ్యయన గ్రంథం.. ఆచరణ గ్రంథం..!

‘దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే / దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతమ్ II ( గీత -17-20) దానమిచ్చుట కర్తవ్యమని భావించి దేశ, కాల, పాత్రములనెఱిఁగి ప్రత్యుపకారమునాశింపక చేయుదానము సాత్త్విక దానము… అంటాడు కృష్ణ పరమాత్మ ఇదే ఉత్తమ దానము. మనిషి విధి గా ఆచరించవలసిన మూడు పుణ్య కర్మలలో దానము కూడా ఒకటి. మిగతా రెండు యజ్ఞము, తపస్సు. దాతలు ప్రధానం గా గుర్తించవలసింది పాత్ర ఎరిగి దానం చేయడం. దేవుడు కూడా కోరికను బట్టి ఇవ్వడు. అర్హతను బట్టే ఇస్తాడు. మనమూ అర్హతను బట్టే దానం చెయ్యాలి. శారీరక, మానసిక, ఆర్ధిక దుర్బలులకు, ప్రకృతి వైపరీత్యాలవల్ల దెబ్బతిని కోలుకోలేని వారికి సహాయం చెయ్యండి. ఈ జ్ఞానం కొరవడడం వల్లే ప్రభుత్వాలు ప్రజలకు అవసరం లేని అనేక ఉచితాల ఆశ చూపించి, ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. ప్రజలను మానసిక దుర్బలులను, సోమరిపోతులను చేస్తున్నారు. ఉచితం ఎప్పుడూ అనుచితమే.. ఉచితం గా వచ్చేదానికి విలువ ఉండదు. ఏదైనా కష్టపడితే వచ్చే ఫలితానికే విలువ… ఏదైనా ఉచితం గా పొందాలనుకోవడం మానసిక దుర్బలత్వమే…! ఉచితం అంటున్నారంటే అది మరొక చోట ధరలు పెంచి వసూలు చేస్తారని, ఆ భారం పేదల పైనే మరింత పడుతుందని అర్ధం చేసుకోనంతకాలం వ్యవస్థ మారదు.’ అన్నారు ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి…! మాజీ ప్రధాని శ్రీ పి వి నరసింహా రావు సోదరులు, సర్వార్ధ సంక్షేమ సమితి మరియు పి.వి సాహిత్య పీఠం అధ్యక్షులు శ్రీ పివి మనోహరరావు ఆధ్వర్యం లో జరిగిన ( 10.12.2023, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం, హైదరాబాద్) కార్తీకమాస వనభోజన కార్యక్రమం లో శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. “కార్తీక మాసం శివునికి ప్రీతికరమైనదైతే, మార్గశిరం విష్ణువునకు ప్రీతికరమైనది. ఈ ఇద్దరికీ భేదం లేదని ‘గీత’ లో ‘రుద్రాణాం శంకరశ్చాస్మి’ అంటూ మరోసారి స్పష్టం చేసాడు విష్ణు రూపుడైన కృష్ణపరమాత్మ…దీన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీ పి వి మనోహరరావు గారు నాచేత కార్తీక మాసం లో గీతా ప్రవచనం చెప్పించడం సముచితం గా ఉందని భావిస్తున్నాను. భగవద్గీతను జీవన గీత గా గుర్తెరిగి అధ్యయనం చేస్తే ఉత్తమ జీవితం గడపడం ఎలాగో అర్థమవుతుంది. అప్పుడే జన్మ సార్ధకమవుతుంది. భగవద్గీత వృధాప్యపు కాలక్షేపం కాదు. కేవలం పఠనా గ్రంథమూ కాదు. అధ్యయన గ్రంథం.. ఆచరణ గ్రంథం..! కాబట్టి గీత నేర్చుకుందాం.. రాత మార్చుకుందాo… ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం… బాల్యదశ నుండే మన పిల్లలకు భగవద్గీతను నేర్పించడం ద్వారా సనాతన ధర్మ రక్షకులమవుదాం. స్వార్ధరహిత ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం…” అన్నారు గంగాధర శాస్త్రి. అనంతరం శ్రీ పివి మనోహర రావు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా విచ్చేసిన బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ, బ్రహ్మశ్రీ వి ఎస్ ఆర్ మూర్తి, ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా సంఘం అధ్యక్షులు శ్రీ విజయ బాబు తదితరులు గంగాధర శాస్త్రి ని సత్కరించారు.

అమెరికా, కాన్సస్ సిటి లోని ‘సయ్ కాన్ సొల్యూషన్స్’ గ్లోబల్ క్లయింట్ పార్టనర్ శ్రీ రాజ్ చెరుకుముడి తన బృందం తో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ని సందర్శించారు. ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి, అడ్వకసి ఛీఫ్ శ్రీ అజాద్ బాబు వారికి స్వాగతం పలికి భగవద్గీతా గ్రంథం బహూకరించి సత్కరించారు. ఫౌండేషన్ తలపెట్టిన కార్యక్రమాల గురించి రాజ్ వివరంగా తెలుసుకుని, గీతా ప్రచారం లో తానూ భాగస్వామ్యం వహిస్తానన్నారు.

అమెరికా, కాన్సస్ సిటి లోని ‘సాయ్ కాన్ సొల్యూషన్స్’ గ్లోబల్ క్లయింట్ పార్టనర్ శ్రీ రాజ్ చెరుకుముడి తన బృందం తో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ని సందర్శించారు.’భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి, అడ్వకసి ఛీఫ్ శ్రీ అజాద్ ఆయనకు స్వాగతం పలికి భగవద్గీతా గ్రంథం బహూకరించి సత్కరించారు. ఫౌండేషన్ తలపెట్టిన కార్యక్రమాల గురించి రాజ్ వివరంగా తెలుసుకుని, గీతా ప్రచారం లో తానూ భాగస్వామ్యం వహిస్తానన్నారు.

అమెరికా, కాన్సస్ సిటి లోని ‘సాయ్ కాన్ సొల్యూషన్స్’ గ్లోబల్ క్లయింట్ పార్టనర్ శ్రీ రాజ్ చెరుకుముడి తన బృందం తో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ని సందర్శించారు.’భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి, అడ్వకసి ఛీఫ్ శ్రీ అజాద్ ఆయనకు స్వాగతం పలికి భగవద్గీతా గ్రంథం బహూకరించి సత్కరించారు. ఫౌండేషన్ తలపెట్టిన కార్యక్రమాల గురించి రాజ్ వివరంగా తెలుసుకుని, గీతా ప్రచారం లో తానూ భాగస్వామ్యం వహిస్తానన్నారు.

ఘంటసాల పా ట లో ఉన్న మాధుర్యం ఆర్ద్రత, పవిత్రత, పరమ శాంతి తన హృదయం పై బాల్యం లో చెరగని ముద్ర వేసింది…..

‘నాకు గాయకుడు గా స్ఫూర్తినిచ్చింది, అవకాశాలు తెచ్చిపెట్టింది, గుర్తిపుతెచ్చింది, గౌరవం సంపాదించిపెట్టింది, భాషా సంస్కారం నేర్పింది, సినినేపధ్య గాయకుడుగా అవకాశం కల్పించింది, చివరకు నా జీవితానికి అర్ధం, పరమార్ధం చెప్పి సంపూర్ణ భగవద్గీతా గానం ద్వారా శాశ్వతత్వాన్ని ప్రసాదించింది … ఘంటసాల పాటే..! ఆ పాట మాధుర్యాన్ని నాకు బాల్యం లో రుచి చూపించిన మా తండ్రి గారు శ్రీ కాశీవిశ్వనాధ శర్మ గారికే ఈ అవార్డు అంకితం … !’ అన్నారు ప్రసిద్ధ గాయకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. ‘గోవింద గీతికలు’ సంస్థ శ్రీ గంగాధర శాస్త్రి ని ‘ఘంటసాల – జీవిత కాల సాఫల్య పురస్కారం’ తో సత్కరించిన సందర్భం గా ( పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (24.1.2023) ఆయన గాన ప్రసంగం చేశారు. ఘంటసాల పాట లో ఉన్న మాధుర్యం ఆర్ద్రత, పవిత్రత, పరమ శాంతి తన హృదయం పై బాల్యం లో చెరగని ముద్ర వేసిందని గంగాధర శాస్త్రి అన్నారు. ఘంటసాల భగవద్గీత గానం చేసి ఉండకపోతే తాను దానిని సంపూర్ణం గా గానం చేయాలనే ఆలోచన వచ్చి ఉండేది కాదని, ఘంటసాల పాటలు తేలిగ్గా రావని, సాధన చేయడం వల్లే వస్తాయని, తెలుగు పద్యాలు, సంస్కృత శ్లోకాలు, దండకాలు పిల్లలకు నేర్పాలంటే ఘంటసాల గాత్రాన్ని రుచి చూపించాలని అన్నారు. అలాగే ఇదే వేదికపై ‘నటసామ్రాట్ ఏ ఎన్నార్ శతజయంతి సిల్వర్ క్రౌన్’ పురస్కారాన్ని ప్రముఖ సినీ హీరో శ్రీ సుమన్ అందుకున్నారు. హీరో గా, దేముడి గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలక్షణమైన పాత్రలు పోషించి మెప్పించిన నటుడు శ్రీ సుమన్ అని గంగాధర శాస్త్రి చెబుతూ తాను జర్నలిస్ట్ గ ఉన్న రోజులనుంచి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తమను సత్కరించిన ‘గోవింద గీతికలు’ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీమతి గీతకు కృతజ్ఞతలు తెలియజేసారు. ‘కళ’ పత్రిక సంపాదకులు శ్రీ మహ్మద్ రఫీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

సంగారెడ్డి జిల్లా లోని నారాయణ్ ఖేడ్ గ్రామం లో ప్రసిద్ధ యజుర్వేద పండితులు బ్రహ్మశ్రీ యలమంచి మోహన్ జోషి ఘనం గా నిర్వహించిన ‘మహారుద్ర సహిత శత చండీ యాగ పురస్సర చతుర్వేద స్వాహాకార సుదర్శన మహా యాగ ఉత్సవం’లోప్రసిద్ధ ఆధ్యాత్మిక గాయకులు, గీతా గాన ప్రవచన, ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి….

‘క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరన్తప … అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ..! అంటే – మానసిక దౌర్బల్యాన్ని నీచమైనది గా చెబుతూ దాన్ని విడిచిపెట్టి నీ కర్తవ్యాన్ని ధర్మబద్ధం గా ఆచరిస్తే అంతటా విజయమే..! భగవద్గీతను జీవితకాలం లో సర్వావస్థల్లో చదివి అర్ధం చేసుకోగలిగితే స్వార్ధ రహిత ఉత్తమ సమాజాన్ని నిర్మించవచ్చు. మానసిక దౌర్బల్యం అనేక రూపాలలో పట్టి పీడిస్తుంది. ఎలక్షన్స్ దగ్గరపడుతుండగా మద్యం, డబ్బు, ఉచితాలు, పధకాల పేరుతొ సామాన్యుణ్ణి ప్రలోభపెడితే పదవిలోకి రావచ్చు. అనేది రాజకీయ నాయకుల మానసిక దౌర్బల్యమైతే.. ఆ పంచిపెట్టేది మన డబ్బే కదా… తీసుకుంటే తప్పేంటి ? అనేది సామాన్యుడి లాజికల్ మానసిక దౌర్బల్యం ..! డబ్బు మనదే.. కానీ ఇస్తున్నది ఏ రూపం లో అన్నది ముఖ్యం… ఇదీ ఒకరకం గా ‘ఓటుకి నోటు’ పథకమే.. దురదృష్టం ఏమిటంటే ఈ సామాన్యుడే ప్రభుత్వాలను నిర్ణయించేది. మనం ఏది ఆలోచించినా, ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం కుటుంబం మీద, సమాజం మీద, రాష్ట్ర అభివృద్ధి మీద, దేశ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఈ సందర్భం లోనే ‘ధర్మo’ అనేది గుర్తుకు రావాలి.. భగవద్గీతా బోధన పేరుతో ప్రతి ఒక్కరికీ ధర్మమార్గం అంటే ఏమిటో, హిందూయిజం గొప్పతనమేమిటో చెబుతూ ప్రజలను చైతన్యపరచాలి. కష్టం తో సంపాదించేదానికే విలువుంటుంది. ఉచితానికి విలువలేదు. ఇచ్చేవాడికీ తీసుకునే వాడికీ ఇద్దరికీ అగౌరవమే.. శారీరక, మానసిక, ఆర్ధిక, ప్రకృతి వైపరీత్యాలవల్ల దుర్బలులైన వారికే దానం చెయ్యాలి. ఇదే పాత్ర ఎరిగి దానం అంటారు. గీత లో ‘దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే..’ శ్లోకం ఈ విషయమే చెబుతుంది.. నైతిక విలువలను పెంపొందించడానికి భగవద్గీత కంటే మించిన జీవిత పాఠం మరొకటి లేదు. దీనిని బాల్యదశ నుండే పిల్లలకు నేర్పించండి.” అన్నారు ప్రసిద్ధ ఆధ్యాత్మిక గాయకులు, గీతా గాన ప్రవచన, ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. సంగారెడ్డి జిల్లా లోని నారాయణ్ ఖేడ్ గ్రామం లో ప్రసిద్ధ యజుర్వేద పండితులు బ్రహ్మశ్రీ యలమంచి మోహన్ జోషి ఘనం గా నిర్వహించిన ‘మహారుద్ర సహిత శత చండీ యాగ పురస్సర చతుర్వేద స్వాహాకార సుదర్శన మహా యాగ ఉత్సవం’ సందర్భం గా మూడవ రోజున గంగాధర శాస్త్రి గీతా వైభవాన్ని గానసహితం గా వివరించారు. ‘శివునికి ప్రీతికరమైన ఈ కార్తీక మాసం లో విష్ణురూపుడైన శ్రీ కృష్ణుని గీతను చెప్పించడాన్ని శివకేశవులకు అభేదాన్ని చెప్పడమే’ అని గంగాధర శాస్త్రి అన్నారు. కర్మ ఫలాన్ని పరమాత్మకు అర్పిస్తూ, అనన్య భక్తి తో ఆరాధించడం వల్లే పరమాత్మ అనుగ్రహం లభిస్తుందని అన్నారు. తల్లి తండ్రులు పిల్లలతో వీలైనంత సమయం గడపాలనీ, శ్రీరామాయణ, భారత, భాగవత, భగవద్గీతల వంటి మన ఆధ్యాత్మిక సంపద గురించిన అవగాహన కల్పించాలని గంగాధర శాస్త్రి కోరారు. తన సమక్షం లో భగవద్గీతా శ్లోక పఠనం చేసిన చిన్నారులను గంగాధర శాస్త్రి అభినందించి ఆశీర్వదించారు. లోక క్షేమాన్ని కాంక్షిస్తూ ఈ యాగాలను శాస్త్రోక్తం గా నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ మోహన్ జోషి కి హృదయపూర్వకo గా నమస్సులందిస్తూ అభినందించారు. చివరిగా భక్తులతో శ్రీ గంగాధర శాస్త్రి చేయించిన కృష్ణ భజన తో ‘మా ఫంక్షన్ హాల్’ భక్తి తరంగాలతో నిండిపోయింది. కార్యక్రమ అనంతరం గంగాధర శాస్త్రి మార్వాడి గల్లీ లోని 200 ఏళ్ల క్రిందటి రాధాకృష్ణ మందిరాన్ని దర్శించారు. ఈ మందిర నిర్వాహకులు

శ్రీ నందకిషోర్ భంగ్ గంగాధర శాస్త్రి కి స్వాగతం పలికి రాధాకృష్ణ చిత్రాన్ని ఆవిష్కరింపజేసి అటుపై తాము నిర్వహిస్తున్న గోశాలను చూపించారు. ఈ సందర్భం గా రావి ఆకు పైన శ్రీ గంగాధర శాస్త్రి చిత్రాన్ని చిత్రించిన పటాన్ని శ్రీ సంతోష్ కుమార్ బహూకరించారు.

+66

See Insights and Ads

Boost post

All reactions:

88

ఇది మతం కాదు ధర్మం .. మతం అంటే ఒక వర్గానికి సంబంధించింది. ధర్మం అంటే సార్వజనీనమైనది. అందుకే పాశ్చాత్యులకు సైతం గీత స్ఫూర్తినిచ్చింది…

ఆయన పేరు డాక్టర్ అజీమి …. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హృద్రోగ నిపుణులు ( Cardio Vascular Specialist )..! ప్రస్తుతం అమెరికా లోని శాండియాగో లో ‘SHARP HEALTHCARE’ ద్వారా సేవలందిస్తున్నారు. తన 12 ఏళ్ల వయసులో ఆఫ్ఘనిస్తాన్ నుండి శరణార్థి గా అమెరికా కి వచ్చి స్థిరపడి స్వయం కృషి తో ప్రసిద్ధ హృద్రోగ నిపుణుడి గా ఎదిగిన డాII నస్సీర్ అజీమీ ఇటీవల ఒకరోజు …. ( ఆగష్టు 13,2023 ) ప్రసిద్ధ గాయకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని శాండియాగో ( కాలిఫోర్నియా-అమెరికా) లోని ఒక కాఫీ డే లో చూడడం తటస్థించింది. ఆ సమయం లో గంగాధర శాస్త్రి తో పాటు అప్పటి ‘గీతా ఫౌండేషన్’ అధ్యక్షులు, ప్రముఖ Anaesthetist డాII రాధాకృష్ణ తమిరిసా, గంగాధర శాస్త్రి అభిమాని శ్రీ ప్రవీణ్ పురాణం ఉన్నారు. ఈలోగా తన తన సహచర వైద్యులు డా II అజీమి, మరొక phisician ఆష్ కాస్తో లను గమనించిన డాII రాధాకృష్ణ (ఈ ముగ్గురూ ఒకే ఆసుపత్రిలో సేవలందిస్తున్నారు) శ్రీ గంగాధర శాస్త్రి ని తన గురువు గా పరిచయం చేశారు. కాసేపు గంగాధర శాస్త్రి తో మాట్లాడిన ప్రభావం తో .. ‘మీ నుంచి నా ఛానల్ కి భారతీయ ఆధ్యాత్మికత పైన ఒక ఇంటర్వ్యూ ఆశిస్తున్నాను..’ అని కోరారు డాII అజీమి…! ఆ మరురోజే ప్యాలస్ ను తలపించే అజీమి స్వగృహం లో ఇంటర్వ్యూ జరిగింది. కృష్ణ ప్రార్ధనా శ్లోక గానం తో ప్రారంభించిన శ్రీ గంగాధర శాస్త్రి – హిందూయిజం పైన, భగవద్గీత పైన అజీమి అడిగిన అనేక ప్రశ్నలకు సంతృప్తి కరమైన సమాధానాలిచ్చారు.” భగవద్గీత – మతాలు ఆవిర్భవించని కాలం లో ప్రపంచం లోని ప్రతి మానవుడినీ ఉద్దేశించి బోధించబడిన ఉత్తమ జీవన విధాన మార్గదర్శిని.. ఇది మతం కాదు ధర్మం .. మతం అంటే ఒక వర్గానికి సంబంధించింది. ధర్మం అంటే సార్వజనీనమైనది. అందుకే పాశ్చాత్యులకు సైతం గీత స్ఫూర్తినిచ్చింది. అమెరికా లోని న్యూజెర్సీ లో ఉన్న శాటన్ హాల్ యూనివర్సిటీ లో MBA విద్యార్థులకు A JOURNEY OF TRANSFERMATION పేరుతో గీతను బోధిస్తున్నారు. గీత కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. నువ్వు చేసే కర్మను బట్టి ఫలితం ఉంటుంది. తదుపరి జన్మ కూడా ఈ జన్మలో చేసిన కర్మ ను బట్టి ఉంటుంది.. ఏ పని చేసినా ధర్మబద్ధం గా, త్రికరణ శుద్ధి గా, నీ చేతుల్లోలేని ఫలితాన్ని – దైవానికి వదిలిపెట్టి , భవబంధాలకు అతీతంగా, నిస్వార్ధ బుద్ధితో, లోక శ్రేయస్సు కోసం చెయ్యాలని గీత చెబుతుంది. ‘ప్రాణులంతా ఒక్కటే.. ప్రాణులందరికీ ఒక్కడే..’ అన్నది గీతా సారాంశం .. భారతదేశం అన్నిమతాలనూ గౌరవించడానికి కారణం ‘గీత’ భావజాలమే… గీత సర్వ ప్రాణులనూ సమదృష్టి తో చూడమని చెబుతుంది. ఇది మానవీయ గ్రంథం .. సిద్ధాంత గ్రంథం.. గీత విషయం లో ఎవరికి ఏ సందేహం వచ్చినా వివరణాత్మకం గా, అందరికీ అంగీకారయోగ్యం గా సమాధానం చెప్పవచ్చు. ప్రపంచం లో ఇతర గ్రంథాలు దైవ దూతలు, దైవ కుమారులు గా ప్రకటించుకున్న వారి చేత చెప్పబడితే… భగవద్గీత – తానే దైవం గా ప్రకటించుకుని, అందుకు నిదర్శనం గా విశ్వరూపాన్ని దర్శింపజేసిన కృష్ణ పరమాత్మ చేత బోధించబడింది. మానవ జీవితానికి సంబంధించిన అన్ని విషయాలూ ఇందులో చర్చించబడ్డాయి. భగవద్గీత – దేశ, కాల, జాత్యాదులకు, వయో వర్గ లింగ విభేదాలకు అతీతమైన ‘కాలం చెల్లని’ ఒకే ఒక్క దైవ గ్రంథం..గీతా పఠనం, ఆచరణ మానసిక వత్తిడిని దూరం చేసి ఇతరులకు స్పూర్తిని అందించే లక్ష్యానికి చేరుస్తుంది. ప్రపంచం లో ని అన్ని మతాలూ జీవన విధాన మార్గాలే… కానీ హిందూమతం మాత్రం సర్వజనమోదయోగ్యమైన ఉత్తమజీవన విధాన మార్గం.” అంటూ అనేక విషయాలను సహేతుకం గా వివరించారు శ్రీ గంగాధర శాస్త్రి. ‘శాస్త్రీ జీ’ అంటూ ఇంటర్వ్యూ ప్రారంభించిన డాII అజీమి – ఇంటర్వ్యూ పూర్తి అయ్యే సమయానికి ..’You are my Guruji..!’ అంటూ గంగాధర శాస్త్రి కి తన భార్యా పిల్లలను పరిచయం చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ ఇంటర్వ్యూ తో హిందూయిజం భావజాలం పైన తన గౌరవం వెయ్యి రెట్లు పెరిగిందని, తదుపరి అమెరికా పర్యటనలో తమ సంస్థ లో పనిచేసే డాక్టర్స్ మిత్రులకు గీతా సందేశం అందించాలని అజీమీ గంగాధర శాస్త్రి ని కోరారు. మానవత్వం సేవా విశ్వరూపం ప్రదర్శించాల్సిన కరోనా సమయంలో అన్ని వ్యవస్థలూ పతనావస్థకు చేరుకోగా మెడికల్ వ్యవస్థలు, సంస్థలు, ఆసుపత్రులు మాత్రం ఈ అవకాశాన్ని వ్యాపారం గా మార్చుకోవడం అమానుషమని, దీనికి కారణం మానవీయతను పెంపొందించే ఆధ్యాత్మిక పునాది లేకపోవడమేనననీ అన్న గంగాధర శాస్త్రి అభిప్రాయం తో డాII అజీమి ఏకీభవించారు. అయితే ప్రాణాలకు తెగించి డాక్టర్లు చేసిన సేవలకు మాత్రం సకల మానవాళి ఎంత కృతజ్ఞతలు తెలియజేసినా తక్కువే అని గంగాధర శాస్త్రి అన్నారు. గంగాధర శాస్త్రి తో డా ఆష్ కాస్తో (క్రిస్టియన్) డా నస్సిర్ అజీమి (ముస్లిం) ఫోటో దిగినప్పుడు ‘Now we’ll be called as RAM -ROBERT- RAHIM’ అంటూ చమత్కరించారు గంగాధర శాస్త్రి.

భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి ని ‘గీతా గాంధర్వ సుధార్ణవ’ బిరుదుతో సత్కారం…

‘మోహన్ ట్రస్ట్’ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ వ్యాఖ్యాత శ్రీ పి ఎం కె గాంధి ‘తెలుగు కళా వైభవం’ పేరుతో హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభ లో నిర్వహించిన (10.11.2023) కార్యక్రమం లో – ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి ని ‘గీతా గాంధర్వ సుధార్ణవ’ బిరుదుతో సత్కరించారు. తెలంగాణ బి సి కమిషన్ చైర్మన్ డాII వకుళాభరణం కృష్ణమోహన్ చేతులమీదుగా ఈ సత్కారం జరిగింది. అమెరికాలో ఇటీవల మూడు నెలల పాటు విజయవంతం గా అనేక నగరాలలో తన గీతాగాన ప్రవచనం తో హిందువులను చైతన్య పరచి స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భం గా శ్రీ గంగాధర శాస్త్రి ని సత్కరిస్తున్నట్టు శ్రీ గాంధీ తెలియజేసారు. సత్కారానంతరం శ్రీ గంగాధర శాస్త్రి తన స్పందనను తెలియజేస్తూ – నేటి తరం శారీరకం గా, ప్రతిభ పరం గా, తెలివితేటల పరం గా చాల బలం గా ఉన్నారని మానసికం గా మాత్రం చాలా బలహీనం గా ఉన్నారని, మానసిక వత్తిడులను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇందుకు సుఖదుఃఖాలను, జయాపజయాలను, లాభాలాభాలను సమం గా తీసుకునే స్థితప్రజ్ఞత్వ లక్షణాన్ని నేర్పగలిగే భగవద్గీత ను భవరోగాలకు దివ్యఔషధం లా భావించి అధ్యయనం చేయగలిగితే ఆదర్శవంతమైన జీవితాన్ని సాధించవచ్చని అన్నారు. భారత దేశం లో పుట్టిన, మతాలకు అతీతమైన జ్ఞాన గ్రంథం భగవద్గీతను జాతీయ గ్రంథం గా ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని, పాఠ్యాంశం గా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని గంగాధర శాస్త్రి అన్నారు. గీత లోని విశ్వరూప సందర్శనయోగ ఘట్టాన్ని తాత్పర్యం తో పాడుతూ కళ్ళకు కట్టినట్టు గా వివరించి ప్రేక్షకులను కదిలించారు. నిరు పేదలకు లక్ష కిలోల బియ్యాన్ని పంపిణి చెయ్యాలనే తమ లక్ష్యాన్ని మోహన్ గాంధి వ్యక్తం చేస్తూ వేదికపైన గంగాధర శాస్త్రి చేతుల మీదుగా పేదలకు బియ్యం పంపిణీ చేసినప్పుడు – శ్రీ గంగాధర శాస్త్రి తమ భగవద్గీతా ఫౌండేషన్ తరఫున 25 వేల విరాళాన్ని మోహన్ ట్రస్ట్ కు అందించారు. సమర్ధవంతమైన వ్యాఖ్యానం తో సభలను రంజింపజేస్తూ తెలుగుభాషను కాపాడుతున్నందుకు గాంధీని ప్రశంసించారు.

తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.

తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.

హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.

హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.

శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.