ప్రసిద్ధ గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ‘గీత గాన ప్రచార శంఖారావం’ పేరుతో అమెరికా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వాషింగ్టన్ లోని సియాటెల్ లో లక్ష్మి వెంకటేశ్వర దేవాలయం లో మూడు రోజులపాటు ( జులై 14,15,16 తేదీలలో ) గీతామృతం పంచనున్నారు.ఈ నేపధ్యం లో గంగాధర శాస్త్రి గారికి ఆతిధ్యo అందించిన శ్రీ జయరాం నండూరి ఇంట్లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గళమురళి డాII ఈలపాట శివప్రసాద్, గంగాధర శాస్త్రి ల సమావేశం ప్రత్యేకత సంతరించుకుంది.. దేవాలయ సేవకులు శ్రీ రాంగోపాల్ రెడ్డి వంగపాటి, శ్రీ జయరాం నండూరి, శ్రీమతి కళ్యాణి, ఎల్ విశ్వతేజ లు తమ సంతోషాన్ని పంచుకున్నారు. శ్రీ కె.శివప్రసాద్ – గంగాధర శాస్త్రిని దుశ్శాలువా తో సత్కరించి ‘గీత ప్రచార లక్ష్యం’ సఫలీకృతం కావాలని ఆశీర్వదించారు. అమెరికా లో తన గీతా గాన ప్రవచన కార్యక్రమాలను ఏర్పాటు చేయదలుచుకున్న వారిని శ్రీ శేఖర్ రావు బసవ రాజు – +1(817)675-3404 ; శ్రీ ఆజాద్ బాబు +91 9866296699 లను సంప్రదించవచ్చని విజ్ఞప్తి చేశారు.

