Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

భగవద్గీతా సందేశాన్ని గ్రామాలలో విస్తృతం చేయాలి …

భగవద్గీతా సందేశాన్ని గ్రామాలలో విస్తృతం చేయాలి …

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp
‘భగవద్గీతా సందేశాన్ని పట్టణాలలో, నగరాలలో కంటే – మతమార్పిడులు అధికం గా జరుగుతున్న గ్రామాలలోనే విస్తృతం గా ప్రచారం చేయాలి. మానవీయ విలువలతో పాటు ఉత్త్తమ మానవ జీవన విధానమంతా భగవద్గీతలోనే ఇమిడి ఉంది. మానవుడు భగవద్గీత అనే నావను ఆశ్రయిస్తే ఘోరమైన సంసార సాగరాన్ని సులభం గా దాటివేయగలడని వైష్ణవీయ తంత్ర సారం చెబుతుంది. భగవద్గీత కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తుంది. పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తుంది. దేవుడు కోరికని బట్టి కాదు. అర్హతని బట్టి ఇస్తాడు. ఆ అర్హతని సాధించాలంటే ధర్మ మార్గం లో నడవాలి. భగవద్గీత లో మొదటి పదం ‘ధర్మం’… చివరి పదం ‘మమ’… ఈ రెండూ కలిపితే ‘మమ ధర్మం’ అవుతుంది. అంటే ప్రతి ఒక్కడూ తన ధర్మాన్ని తను తెలుసుకుని ఆచరిస్తే పరమాత్మ అనుగ్రహాన్ని తప్పక పొందినట్టే. కర్మను త్రికరణ శుద్ధిగా ఆచరించాలి తప్ప మొక్కుబడిగా చేస్తే సత్ఫలితాలను సాధించలేమని భగవద్గీత చెబుతుంది. ప్రతి ఒక్కరూ దైవభక్తి, దేశభక్తి, కర్తవ్య నిష్ఠ, నిష్కామ కర్మల ఆంతర్యం తెలుసుకుని ఆచరిస్తే జన్మ చరితార్ధమవుతుందని గ్రహించాలి. ప్రతి దేవాలయం లోనూ నిత్యమూ భగవద్గీత ప్రదర్శింపబడాలి. అందుకొరకే మేము స్థాపించిన ‘భగవద్గీతా ఫౌండేషన్’ ద్వారా 9 సంవత్సరాల పరిశోధనాత్మక కృషి చేసి, వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే అత్యున్నత సాంకేతిక విలువలతో, భారత దేశపు తొలి సంగీత భరిత, తెలుగు తాత్పర్య సహిత సంపూర్ణ భగవద్గీతను రూపొందించడం జరిగింది. గ్రామ గ్రామాలలోనూ గీతా సత్సంగాలు, గీతా బోధనలు జరగాలి. మానసిక వత్తిడిని జయించాలంటే, ఆత్మహత్యలు లేని ప్రపంచాన్ని చూడాలంటే, లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే, స్వార్ధరహిత ఉత్తమ సమాజాన్ని నిర్మించాలంటే, భారత దేశానికి పూర్వ వైభవం తీసుకు రావాలంటే బాల్య దశ నుండే భగవద్గీతను అభ్యసించాలి. భగవద్గీత మత గ్రంథమూ, వృద్ధాప్యపు పఠనా గ్రంథమూ కాదు. మానవీయ విలువలతో కూడిన జ్ఞాన గ్రంథం. ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హామర్, వారన్ హేస్టింగ్స్, ఐనిష్టియన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే వంటి పాశ్చాత్యులు సైతం భగవద్గీత ను మతాలకు అతీతమైన ఉపదేశం గా పేర్కొన్నారు. సనాతన ధర్మానికి పునాది భగవద్గీత..! గీత పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉంటే ఇతర మతాల దాడులను ఎదుర్కొనే మానసిక స్థైర్యం ఏర్పడుతుంది. హిందువులకు హిందూయిజం పట్ల సరిఅయిన అవగాహన, నమ్మకం లేకపోవడం వల్లే మతమార్పిడులు, దాడులు, దేవాలయాల కూల్చివేతలు, విగ్రహాలను ధ్వంసం చేయడం వంటి దురదృష్టకర సంఘటనలను చూడవలసివస్తోంది. హిందువులారా లేవండి. మేలుకోండి. లక్ష్యం చేరుకునేంతవరకూ విశ్రమించకండి.” అన్నారు గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. ఏలూరు జిల్లా కలిదిండి గ్రామం లోని “ఆధ్యాత్మిక మహా మండలి” సంస్థ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినo సందర్భం గా, జిల్లాపరిషత్ హై స్కూల్ ప్రాంగణం లో (22.3.2022) ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమం లో శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి భగవద్గీతా జ్ఞాన గానామృతాన్ని పంచారు.కలిదిండి గ్రామానికి చెందిన కొందరు మహిళలు ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఈ కార్యక్రమానికి గ్రామస్థులను ఆహ్వానించడం విశేషం. ఈ సందర్భం గా ఆధ్యాత్మిక మహా మండలి అధ్యక్షులు శ్రీ నంబూరి విజయ నరసింహరాజు (బాండు రాజు), శ్రీ మద్దూరి శేషగిరి రావు, శ్రీ అగ్నిహోత్రం ఆత్రేయబాబు తదితర సభ్యులు మరియు గ్రామస్థులు శ్రీ గంగాధర శాస్త్రి ని దుశ్శాలువ తో, పట్టు వస్త్రం తో ‘గీతా వాచస్పతి’ బిరుదుతో ఘనం గా సత్కరించారు.

.

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ

Leave a Reply