Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

అమెరికా లోని న్యూ యార్క్ మహానగరం లో, నిత్యం మహా రద్దీ గా కనిపించే ‘THE CROSS ROADS OF THE WORLD’ గా ప్రసిద్ధిగాంచిన TIME SQUARE కూడలిలో, తెలుగు వారు మరియు విదేశ పర్యాటకుల కరతాళ ధ్వనుల నడుమ -‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి గాత్రం లో, భగవద్గీత…..

అమెరికా లోని న్యూ యార్క్ మహానగరం లో, నిత్యం మహా రద్దీ గా కనిపించే ‘THE CROSS ROADS OF THE WORLD’ గా ప్రసిద్ధిగాంచిన TIME SQUARE కూడలిలో, తెలుగు వారు మరియు విదేశ పర్యాటకుల కరతాళ ధ్వనుల నడుమ -‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి గాత్రం లో, భగవద్గీత…..

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

అమెరికా లోని న్యూ యార్క్ మహానగరం లో, నిత్యం మహా రద్దీ గా కనిపించే ‘THE CROSS ROADS OF THE WORLD’ గా ప్రసిద్ధిగాంచిన TIME SQUARE కూడలిలో, తెలుగు వారు మరియు విదేశ పర్యాటకుల కరతాళ ధ్వనుల నడుమ -‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి గాత్రం లో, భగవద్గీత మారుమ్రోగింది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, భారత్ మాతా కి జై, జై తెలుగు తల్లి నినాదాలు మిన్ను ముట్టాయి … ‘తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) న్యూయార్క్’ వారి ఆహ్వానం మేరకు విశిష్ట అతిథి గా హాజరై (31.8. 2024)జ్యోతి ప్రకాశనం చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించి సందేశం అందిస్తూ గీతా శ్లోకాలను గానం చేశారు. భగవద్గీతను ఈ దేశపు వాసులు కూడా గౌరవించారని చెబుతూ – న్యూ జెర్సీ లోని ‘శాటన్ హాల్ యూనివర్సిటీ’ లో MBA విద్యార్థులకు A JOURNEY OF TRANSFORMATION పేరుతో భగవద్గీతను పాఠ్యాంశం గా పెట్టడం, Apple కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ తన మరణానంతరం తన భౌతిక కాయాన్ని చూడడానికి వచ్చిన వారికి భగవద్గీత పంచిపెట్టమని తనవారికి చెప్పడం తనను కదిలించిన విషయాలని గంగాధర శాస్త్రి అన్నారు. ఈ సందర్భం గా గీత లోని ‘యద్యదాచరతిశ్రేష్ఠః ‘ శ్లోకం తాత్పర్యం తో సహా గానం చేసి – ఇతరులకు స్ఫూర్తినిచ్చే స్థాయిలో ప్రతి ఒక్కడూ ఉత్తముడుగా ఎదగాలని ప్రపంచం లోని మానవులందరికీ సందేశం అందించే గీత మతాలకు అతీతమైన కర్తవ్య బోధ గా గుర్తించాలని గంగాధర శాస్త్రి అన్నారు. ఇది అమెరికా లోని తెలుగుసాంస్కృతిక సంఘాల చరిత్ర లోనే ఈ కార్యక్రమం అత్యంత అరుదైన ఘట్టమని, TIME SQUARE కూడలిలో తెలుగు కార్యక్రమానికి వేదిక లభించడం చారిత్రాత్మక ఘట్టమని గంగాధర శాస్త్రి అన్నారు. “దేవనాగర భాష, భారత దేశానికి మాతృ భాష అయిన సంస్కృతాన్ని అంతే స్పష్టం గా ఉచ్ఛరించగలిగే వాడు తెలుగు వాడొక్కడే… భారత దేశం లో పుట్టినందుకు కృష్ణ గీత, తెలుగు వాడిగా పుట్టినందుకు పోతన పద్యం మీ పిల్లలకు నేర్పించి మన ఉనికిని చాటుకోండి… కూటి కోసం బయట ఇంగ్లిష్ మాట్లాడినప్పటికీ ఇంట్లో మాత్రం మాతృభాష లోనే సంభాషించండి. కేవలం సాంస్కృతిక ప్రదర్శనల కే తెలుగుని పరిమితం చేయకండి. మీ పిల్లలకు తెలుగు రాయడం, చదవడం, మాట్లాడడం నేర్పించి మన వారసత్వ సంపదను కాపాడండి. తెలుగు భాష గొప్పదనాన్ని తెలుగు వాడే మెచ్చుకుంటే అది గొప్పవిషయం కాకపోవచ్చు. కానీ కన్నడ సుష్పష్టం గా తెలిసిన శ్రీకృష్ణ దేవరాయలు సైతం తన ‘ఆముక్తమాల్యద’ గ్రంథం లో ‘దేశభాషలందు తెలుగు లెస్స…’ అని తెలుగు భాషను కీర్తించడం గొప్పవిషయo ..” అని చెబుతూ గంగాధర శాస్త్రి ‘తెలుగదేలయన్న’ పద్యాన్ని గానం చేశారు. తనను ఆహ్వానించిన TLCA అధ్యక్షులు శ్రీ కిరణ్ కుమార్, ‘పద్మశ్రీ’ పురస్కృత డాII నోరి దత్తాత్రేయుడు, శ్రీ ఉదయ్ దొమ్మరాజు, శ్రీ సుమంత్ రామ్, డాII పూర్ణ ప్రసాద్ అట్లూరి, శ్రీ నెహ్రు, ఆల్బని తెలుగు సంఘం’ అధ్యక్షులు శ్రీ వెంకట్ జాస్తి తదితరులకు కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేసారు. పిన్నలు, పెద్దలు ఆంధ్ర, తెలంగాణ కు చెందిన వివిధ కళా రూపాలతో ప్రదర్శించిన నృత్యాలను అభినందిస్తూ, భారత దేశం నుండి తీసుకు రావలసిన అవసరం లేనంత గా స్థానిక కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారన్నారు. మాతృదేశానికి దూరమైనా మాతృ సంస్కృతి ని కాపాడుతున్నందుకు అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భం గా TLCA సభ్యులు శ్రీ గంగాధర శాస్త్రిని సత్కరించారు.

0:00 / 6:50

+28

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ