Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

ఒకరినొకరు అర్ధం చేసుకుని మెలుగుతూ, ఉత్తమ సంతానాన్ని ప్రపంచానికి అందించడమే వైవాహిక జీవిత పరమార్థం…గీతా గాన ప్రవచన, ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాII ఎల్ వి గంగాధర శాస్త్రి.

ఒకరినొకరు అర్ధం చేసుకుని మెలుగుతూ, ఉత్తమ సంతానాన్ని ప్రపంచానికి అందించడమే వైవాహిక జీవిత పరమార్థం…గీతా గాన ప్రవచన, ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాII ఎల్ వి గంగాధర శాస్త్రి.

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

“వివాహాలు అందరూ చేసుకుంటారు. కానీ వైవాహిక జీవితాన్ని ఆదర్శవంతం గా సాధించేవారు అతి తక్కువమంది మాత్రమే ఉంటారు. వారిలో మీరుండాలని కోరుకుంటున్నాను. ఒకరినొకరు అర్ధం చేసుకుని మెలుగుతూ, ఉత్తమ సంతానాన్ని ప్రపంచానికి అందించడమే వైవాహిక జీవిత పరమార్థం.. ప్రపంచం లోనే హిందూ కల్యాణ సంస్కృతి అత్యుత్తమమైనది. ఆదర్శవంతమైనది. ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో పంచభూతాల సాక్షిగా జరుగుతున్న ఈ నిశ్చితార్ధ కార్యక్రమం – సాంప్రదాయ విలువలను రామినేని కుటుంబo ఎంత గౌరవిస్తుందో తెలియ జేస్తోంది. భవిష్యత్తులో మీ దంపతులు కూడా ఈ విలువలను కాపాడుతూ సీతారాముల అనుగ్రహం తో ఆదర్శదంపతులై చరింతురు గాక ..!” అంటూ కాబోయే దంపతులను ఆశీర్వదించారు గీతా గాన ప్రవచన, ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. అమెరికా లోని సిన్సినాటి లో జరిగిన (17.8.2024) చిII లII సౌII శ్రియ, చిII సంతోష్ ల నిశ్చితార్ధ కార్యక్రమానికి ఆయన హాజరై – గీతా గాన ప్రవచనం ద్వారా ఉత్తమ జీవితాన్ని వివరించారు. దంపతులు కాబోతున్న జంటకు భగవద్గీత ద్వారా ఉత్తమ జీవన విధానాన్ని వివరించే కార్యక్రమాన్ని ఏర్పాటుచేయడం పట్ల అతిథులందరూ హర్షం వ్యక్తం చేశారు. “గీతలో ‘యద్యదాచరతిశ్రేష్ఠః’ అని పరమాత్మ చెప్పినట్టు – తరువాత తరాలవారికి ‘ఆదర్శవంతమైన దాంపత్యజీవితమంటే ఇది’ అనే సందేశాన్ని మీ దంపతులు ఇవ్వాలి. ‘సఖ్యం సాప్తపదీనాం’ – ఏడడుగులు కలిసి నడిచినా, ఏడూ మాటలు కలిసి మాట్లాడుకున్నా విడదీయరాని అనుబంధం ఏర్పడుతుందని పెద్దలు చెబుతారు. ఆ అనుబంధమే ఈ జన్మలో మీ ఇద్దరినీ ఒకటి చేయబోతోంది. ప్రేమ అయినా, స్నేహం అయినా, దాంపత్యం అయినా ‘అహం’ చొరబడకుండా ఉంటేనే నిలబడుతుంది. సీతా రాములనుంచి ఏ దంపతులైనా తెలుసుకోవలసింది ఒక్కటే….. అధిక దుఃఖమైన ఆనందమైన / కలసి చెమ్మగిల్లు కనులు రెండు / ఆలుమగల జంట అట్లున్నయప్పుడే / సౌఖ్య జీవనమ్ము సాధ్యమగును.. పెళ్లి జరుగుతున్నప్పుడు మిగతా విషయాల పైన దృష్టి పెట్టకుండా వేదజ్ఞులు చెప్పే మంత్రాల పైన దృష్టి పెడితే జీవిత పరమార్థం అర్ధమవుతుంది. వివాహం సామాజిక శ్రేయస్సుకై చేసే ఒక మహా యజ్ఞం. జీవితానికి పూర్ణత్వం లభించేది పెళ్లిపేరుతో స్త్రీపురుషులు ఒకరి జీవితం లోకి ఒకరు అడుగుపెట్టాకే.. కన్యాదాత వరుడిచేత – ‘ధర్మార్ధకామమోక్షాలలో నేను ఈమెను అతిచరించను’ అని చేయించే వాగ్దానాన్ని వరుడు ఎన్నటికీ మరువకూడదు. ‘వాగర్థావివసంపృక్తౌ’ అన్నట్టు దంపతులు వాక్కు అర్ధాల వలే కలిసి కలిసి ఉండి మీ కుటుంబ ప్రతిష్ఠ ను నిలబెట్టoడి. మీ సంతానాన్ని కూడా ఆధ్యాత్మిక సంస్కారం తో పెంచండి. భారతీయ సనాతన ధర్మాన్ని, సంసృతిని కాపాడండి. భవిష్యత్తులో మీ బిడ్డలతో మీ విలువైన సమయాన్ని వీలైనంతసేపు గడిపి మీ ఆలోచనల సంస్కారాన్ని వారికి తెలియజేయండి. ఆ లక్ష్మీనారాయణులు, ఉమామహేశ్వరులు, వాణి హిరణ్యగర్భులు, శచీపురందరులు, అరుంధతీ వశిష్టు లు, సీతారాములు మీ జీవితాన్ని ఎల్లప్పుడూ రక్షింతురు గాక…! ఆదర్శవంతమైన జీవితం గడిపి కీ.శే డాII రామినేని అయ్యన్న చౌదరి గారు గొప్ప పేర్లు పెట్టి సమాజానికి అందించిన పంచపాండవుల్లాంటి కుమారులు శ్రీ ధర్మప్రచారక్, శ్రీ సత్యవాది, శ్రీ బ్రహ్మానంద, శ్రీ వేదాచార్య, శ్రీ హరిశ్చoద్ర, కుమార్తె శ్రీమతి శారద లను వారు చేస్తున్న ఆధ్యాత్మిక, సామాజిక సేవను హృదయపూర్తి గా శత నమస్సులతో అభినందిస్తున్నాను.” అంటూ ఆశీర్వదించారు శ్రీ గంగాధర శాస్త్రి. అతిథుల కోరికపై ఆయన ‘పిడికిట తలంబ్రాల పెళ్లికూతురు’ అనే అన్నమయ్య కీర్తనను ఆలపించారు. అనంతరం రామినేని కుటుంబం బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రి ని పట్టు వస్త్రాలతో ఘనం గా సత్కరించారు.

+39

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ