Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

“శ్రీకృష్ణ పరమాత్మ దైవానుగ్రహానికి నిదర్శనం … అర్జునుడు పురుష ప్రయత్నానికి నిర్వచనం … పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే అఖండ విజయమే…

“శ్రీకృష్ణ పరమాత్మ దైవానుగ్రహానికి నిదర్శనం … అర్జునుడు పురుష ప్రయత్నానికి నిర్వచనం … పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే అఖండ విజయమే…

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

“శ్రీకృష్ణ పరమాత్మ దైవానుగ్రహానికి నిదర్శనం … అర్జునుడు పురుష ప్రయత్నానికి నిర్వచనం … పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే అఖండ విజయమే… ఇదే భగవద్గీతా ఆచరణ ఫలితం …! ఇస్తే వద్దన్న వాడు శ్రీరాముడు… నాకివ్వమని అడిగిన వాడు శ్రీకృష్ణుడు… యత్కరోషి యదశ్నాసి (9-27) అంటూ నువ్వు చేసే కర్మము, తినే ఆహారము, హోమము చేసే హవ్యము, అర్పించే దానము ఆచరించే తపస్సు, సర్వ కర్మల ఫలితం నాకే సమర్పిస్తే మోక్షం పేరుతో నన్నే చేరతావు.. అంటాడు కృష్ణ పరమాత్మ .. ఇక్కడ అడగడం అంటే ఆయనకు అవసరమై కాదు. మనలోని అహంకారాన్ని దునుమాడి మోక్షం ఇవ్వడానికి !!! వామనుడు బలిచక్రవర్తి అహంకారాన్ని అడిగాడు … మోక్షం ఇవ్వడానికి … అలాగే శ్రీకృష్ణుడు సమస్త కర్మఫలాన్ని తనకు సమర్పించమని అడుగుతాడు ఇదీ మోక్షం ఇవ్వడానికే… !!! ” అన్నారు గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డా II ఎల్ వి గంగాధర శాస్త్రి..

గురుపౌర్ణమి సందర్భం గా (21.7. 2024) మణికొండ (హైదరాబాద్) లోని కోదండ రామస్వామి దేవాలయం లో ‘గీతా సద్గురు’ శ్రీమాన్ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యం లో జరిగిన గీతా సత్సంగం లో గంగాధర శాస్త్రి పాల్గొని నిత్య జీవితం లో భగవద్గీత ఆవశ్యకతపై గాన ప్రవచనం చేశారు. గీత మతాలకు అతీతమైన గ్రంథమని, ఇది మత గ్రంథం కాదనీ, మానవీయ గ్రంథమనీ ఆయన అన్నారు. గీతను బాల్య దశ నుండే నేర్పించాలని, భగవద్గీతను చదివి అర్ధం చేసుకుని, ఆచరించి, ప్రచారం చేస్తే స్వార్ధ రహిత ఉత్తమ సమాజాన్ని చూడవచ్చని అన్నారు. “ఇది ధర్మ ప్రబోధ గీత, కర్తవ్య బోధ, వ్యక్తిత్వ వికాస గ్రంథం, నైతిక విలువలను పెంపొందించే ఉపదేశం…. సర్వమానవులకు ఆశాదీపం… సాధకులకు కల్పవృక్షం … గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే … తల్లి తండ్రులారా … బాల్యదశనుంచే మీ పిల్లలకు ఆధ్యాత్మికతను పరిచయం చేయండి.రామాయణ, మహాభారతాలు వారికి పరిచయం చేయండి. ఇవి వారికి కొండంత మానసిక స్థైర్యాన్నిస్తాయి. నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి.ఇవాళ సోషల్ మీడియా లో కనిపించే అనేక అనారోగ్యకరమైన వీడియోలకు, ఆ వీడియోల కింద సంస్కారం లేని కామెంట్లకు కారణం … వారి తల్లితండ్రులు విలువలు చెప్పి పెంచకపోవడమే… జీవితం కేవలం ధనార్జకోసమే అన్నట్టు గడుపరాదు… డబ్బు సుఖాన్నిస్తుంది కానీ శాంతినివ్వదు. సత్కర్మ, దుష్కర్మ, పాపం,పుణ్యం, ధర్మo,అధర్మం, దైవం, మోక్షం, జ్ఞానం, అజ్ఞానం, ఇంద్రియాల వ్యాపారం, త్రిగుణాలు, యజ్ఞం, దానం, తపస్సు, ధ్యానం, యోగం… ఇలాంటి పదాలన్నిటి అర్ధాలను బాల్యదశనుండే పిల్లలకు చెప్పండి… ముఖ్యం గా ఈ బాధ్యత తల్లులదే.. ఎందుకంటే బిడ్డకి తల్లే మొదటి గురువు కాబట్టి…. కేనోపనిషత్తు చెప్పినట్టు – న చేదిహావేదీన్మహతీ వినష్టిః … ఏది ఈ జన్మలో తెలుసుకొనకపోతే గొప్ప నష్టం జరుగుతుందో అదే ఉపనిషత్తు వివరిస్తుంది … ఆ సర్వోపనిషత్తుల సారమే భగవద్గీత …! ” అన్నారు గంగాధర శాస్త్రి. భారత దేశం లో హిందువులు 85 శాతం ఉన్నప్పటికీ వారిలోని హిందుత్వం బలం గా లేకపోవడం దురదృష్టం అని అన్నారు. క్రైస్తవ పాఠశాలల్లో బైబిల్ నేర్పుతున్నప్పుడు… హిందువులు స్థాపించే విద్యాలయాలలో భగవద్గీత ను నేర్పించక పోవడం అత్యంత దురదృష్టం అన్నారు. హిందువులలో బలమైన ఐక్యత ఉండివుంటె ఈ పాటికే గీత జాతీయ గ్రంథం అయ్యుండేదని, ప్రతి పాఠశాలలోనూ పాఠ్యాంశం గా అయ్యుండేదని గంగాధర శాస్త్రి అన్నారు. ప్రతి హిందువూ గీతా ప్రచారకులు కావాలని పిలుపునిచ్చారు.

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ