Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

నీలకంఠాపురం దేవస్థానం లో గంగాధర శాస్త్రి గీత వైభవ గాన ప్రవచనం…..

నీలకంఠాపురం దేవస్థానం లో గంగాధర శాస్త్రి గీత వైభవ గాన ప్రవచనం…..

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

“భారతదేశం లో తొలిసారిగా – వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే అత్యున్నత సాంకేతిక విలువలతో, మా “భగవద్గీతా ఫౌండేషన్’ రూపొందించిన తెలుగు తాత్పర్య సహిత, సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత ప్రతి తెలుగు వాడి ఇంట్లోనూ, ప్రతి దేవాలయం లోనూ మ్రోగాలని ఆకాంక్షిస్తున్నాం. దాదాపు 150 మంది సాంకేతిక నిపుణులు, పండితులు 7 సంవత్సరాలపాటు పరిశోధనాత్మక కృషి చేసి, తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని ఆశీస్సులతో విడుదలైన భగవద్గీత ఇది. దీని ద్వారా భగవద్గీత సారాన్ని అర్ధం చేసుకుని, ఆచరించి, జన్మలను చరితార్థం చేసుకోవలసిందిగా కోరుతున్నాం. కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే భగవద్గీత – మతాలకు అతీతమైన సార్వజనీన బోధ ! మనం చేసే కర్మల తాలూకు ఫలితాలే మనం అనుభవించే సుఖ దుఃఖాలు ! ‘జన్మ మృత్యు జరా వ్యాధి, దుఃఖ దోషా ను దర్శనమ్’ (13-9) అని పరమాత్మ చెప్పినట్టుగా జనన, మరణ, వార్ధక్య, వ్యాధుల వలన కలిగే దుఃఖాన్ని దోషాన్ని గుర్తించడమే జ్ఞానము. ఆ జ్ఞానం భగవద్గీతా పఠనం వల్ల మనకు లభిస్తుంది. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా, ఫలితం పరమాత్మకు అర్పించి, నిస్వార్ధం గా, లోక హితం కోసం, బంధాలకు అతీతం గా ఆచరించమని గీత చెబుతుంది. భగవద్గీత వైరాగ్యాన్ని బోధించే వృద్ధాప్యపు గ్రంథం కాదు. బాల్య దశ నుండే అభ్యసించవలసిన ఉత్తమ జీవనవిధాన గ్రంథం. మీ ఫోన్లలో రింగ్ టోన్ గా, కాలర్ ట్యూన్ గా భగవద్గీతా శ్లోకాలను పెట్టుకోండి. తల్లులారా.. భగవద్గీత మీరు నేర్చుకుని రోజుకో శ్లోకాన్ని మీ పిల్లలకు నేర్పించండి. సత్ఫలితాలను పొందండి. ” అన్నారు గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. శ్రీ సత్యసాయి జిల్లా లోని నీలకంఠాపురం గ్రామం లో, ఆంధ్రప్రదేశ్ పూర్వ మంత్రివర్యులు డాII రఘువీరారెడ్డి అత్యద్భుతం గా పునర్నిర్మించిన నీలకంఠాపురం దేవస్థానం లో గంగాధర శాస్త్రి గీత వైభవ గాన ప్రవచనం చేశారు. శ్రీ రఘువీరారెడ్డి లోని నిస్వార్ధ సేవ, ఆధ్యాత్మిక తత్పరతలను కొనియాడుతూ, రాజకీయ నాయకుడి గా ఆయన ప్రజలకు నిరంతర సేవలందించే స్థితిని పరమాత్ముడు అందించాలని కోరుకుంటున్నానని గంగాధర శాస్త్రి అన్నారు. రాష్ట్రం లోని ప్రతి దేవాలయం లోనూ భగవద్గీత వినిపించేట్టు గా చర్యలు గైకొనాలని, అలాగే భగవద్గీత ప్రచారమే లక్ష్యం గా స్థాపించిన తమ భగవద్గీతా ఫౌండేషన్ కు చేయూతనివ్వాలని – ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన ఆం.ప్ర. ఎండోమెంట్స్ సలహాదారు శ్రీ జ్వాలాపురం శ్రీకాంత్ కు సూచించారు. ఆనంతరం లేపాక్షి ఆలయ సందర్శనార్ధం వెళ్లిన శ్రీ గంగాధర శాస్త్రి కి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చక స్వామి శ్రీమాన్ లక్ష్మి నృసింహ నిర్వహణలో శ్రీ వీరభద్ర స్వామికి, దుర్గామాత కు, హనుమంతుడు ప్రతిష్టించిన సైకత లింగానికి శ్రీ గంగాధర శాస్త్రి పూజలు నిర్వహించారు. దేవతా స్తుతి చేస్తూ ‘స్వర’ పుష్పాలు సమర్పించారు.em ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ

Leave a Reply