Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

Gita Pravachanam

Gita Gana Pravachnam

GITA GANAMRITHA PRAVACHANAM

ఘంటసాల గారి శతజయంతి ఉత్సవం ‘స్వరగాంధర్వం’

In our relentless struggle for existence even in critical and challenging situations the Bhagavadgita extends comfort and courage. It indicates the right path and makes us tread on it. The enormous influence it exercises on a human being transformed it into a great moral and ethical force. To tell us to do our allotted duty without fear or favour and with purity of mind, speech and body and dedicate the fruits thereof to God is its message of imperishable significance.

Event on Ghantasala Bhagavadgita

This Bhagavadgita, the summarized essence of the Upanishads, is a thriving philosophical treatise in 700 verses systematically divided into 18 chapters each one expounding one specific philosophical doctrine described as a YOGA. It is an integral part of the great epic Mahabharatha and is embedded in chapters 25-42 of Bhishmaparva as a compact, independent text and it is that way it became extremely popular and venerable.

Gangadhara Sastry on Bhagavadgita

In our relentless struggle for existence even in critical and challenging situations the Bhagavadgita extends comfort and courage. It indicates the right path and makes us tread on it. The enormous influence it exercises on a human being transformed it into a great moral and ethical force. To tell us to do our allotted duty without fear or favour and with purity of mind, speech and body and dedicate the fruits thereof to God is its message of imperishable significance.

Event on Bhagavadgita Foundation

This Bhagavadgita, the summarized essence of the Upanishads, is a thriving philosophical treatise in 700 verses systematically divided into 18 chapters each one expounding one specific philosophical doctrine described as a YOGA. It is an integral part of the great epic Mahabharatha and is embedded in chapters 25-42 of Bhishmaparva as a compact, independent text and it is that way it became extremely popular and venerable.

Bhagavadgita Jayanthi

Bhagavadgita, the Song Celestial, is a dialogue in nectarine poetry in which Bhagavan (Lord) Sri Krishna, the universal teacher, imparted knowledge of the Self and various other philosophical doctrines to Arjuna 5000 yrs. ago. Kurukshetra battlefield is the setting and Bharat (India) is the platform for the universal message of this Divine discourse of eternal relevance handed down for the well-being of humanity cutting across nations, creeds and ages

అమెరికా తెలుగు సంబరాలు

అమెరికా లోని ప్రసిద్ధ తెలుగు సాంస్కృతిక సంస్థ నాట్స్ ( NATS – NORTH AMERICAN TELUGU SOCIETY ) ‘అమెరికా తెలుగు సంబరాలు -2023’ పేరుతో మే 26,27,28 తేదీలలో న్యూజెర్సీ లో సాంస్కృతిక సంబరాలు జరుపబోతోంది. ఇందులో తొలి రోజు కార్యక్రమం గా ‘ఘంటసాల శతజయంతి’ జరుపబోతున్నారు. ఇందులో ప్రసిద్ధ గాయకులు, గీతా గాన ప్రవచన, ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధరశాస్త్రి ని ‘ఘంటసాల శతజయంతి విశిష్ట పురస్కారం’ తో సత్కరించనున్నారు. ఇందుకోసం – నాట్స్ కన్వీనర్ శ్రీ శ్రీధర్ అప్పసాని, కో కన్వీనర్ శ్రీ రాజశేఖర్ అల్లాడ, ఈటీవీ ‘పాడుతా తీయగా’, ‘స్వరాభిషేకం’ దర్శకులు శ్రీ అనిల్ కడియాల లు శ్రీ గంగాధర శాస్త్రిని హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయo లో కలిసి ఆహ్వానించారు. ఘంటసాల గాన వైభవాన్ని దశాబ్దాలుగా ప్రచారం చేస్తూ, ఆయన ప్రారంభించిన భగవద్గీతను పూర్తి చేస్తూ, 9 సంవత్సరాల పరిశోధనాత్మక కృషి చేసి, స్వీయ సంగీతం లో సంపూర్ణం గా గానం చేసి, రికార్డు చేసి, తనకు స్ఫూర్తినిచ్చిన ఘంటసాలకు అంకితం చేస్తూ విడుదల చేసి, అంతటి తో తన పని పూర్తి అయిపోయిందని భావించకుండా, స్వార్ధ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం భగవద్గీత ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన తొలి భారతీయ గాయకుడిగా గంగాధరశాస్త్రి కి ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్టు చెప్పారు. భగవద్గీతా ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాల గురించి ఫౌండేషన్ అడ్వొకసీ చీఫ్ శ్రీ అజాద్ బాబు వివరించారు. గంగాధర శాస్త్రి వారిని తాను గానం చేసిన భగవద్గీత తో సత్కరించారు.

Event on Bhagavadgita

Bhagavadgita, the Song Celestial, is a dialogue in nectarine poetry in which Bhagavan (Lord) Sri Krishna, the universal teacher, imparted knowledge of the Self and various other philosophical doctrines to Arjuna 5000 yrs. ago. Kurukshetra battlefield is the setting and Bharat (India) is the platform for the universal message of this Divine discourse of eternal relevance handed down for the well-being of humanity cutting across nations, creeds and ages

No attendee found